గంజాయి తాగొచ్చి వేధిస్తున్నాడని తమ్ముడి హత్య
మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు.
ఆసిఫ్నగర్, న్యూస్టుడే: మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు. ఆసిఫ్నగర్ ఇన్స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫ్నగర్లోని ఫీల్ఖానా ప్రాంతానికి చెందిన ఫిరోజ్(28) గంజాయి, మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు చెప్పినా వినకపోగా వారిపై దాడి చేసేవాడు. శుక్రవారం రాత్రి 11.30గంటల సమయంలో అన్న మహ్మద్ సయీద్తో గొడవకు దిగి అతని చరవాణి తీసుకొని పారిపోయాడు. అర్ధరాత్రి 2గంటలకు ఇంటికి వచ్చిన ఫిరోజ్తో అన్నకు మరోసారి గొడవ జరిగింది. దీంతో కొపం పెంచుకున్న సోదరుడు తన స్నేహితుడు షానవాజ్ ఖాన్తో కలిసి తమ్ముడిని ఇంటి పైఅంతస్తుకి తీసుకెళ్లి ఇనుప రాడ్తో దాడి చేసి హతమార్చారు. అనంతరం ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరు స్లిప్పు అందలేదా?.. ఇలా చేయండి
[ 12-05-2024]
ఓటరు సమాచార పత్రాలను ఇప్పటికే సంబంధిత బీఎల్లు ఇంటింటికీ పంపిణీ చేశారు. రాజకీయ పార్టీలు ఓటరు చీటీలను పంచుతున్నాయి. ఇంకా అందనివారు ‘ఓటరు హెల్ప్లైన్’ మొబైల్ యాప్తో సమాచారం పొందొచ్చు. -
అభయ హస్తం.. ప్రగతికి నేస్తం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు శివారులో కాంగ్రెస్ నినాదాలు హోరెత్తాయి.. కూడళ్లు జన పరవళ్లతో కిక్కిరిశాయి.. -
నగరాన్ని చుట్టేశారు.. ప్రచారానికి తెరదించారు
[ 12-05-2024]
రాజధానిలో మైకులు మూగబోయాయి. నెల రోజులపాటు ప్రసంగాలతో ఊదరగొట్టిన నేతల నోళ్లు మూతపడ్డాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. -
ఓటుకు సిద్ధమా
[ 12-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ నగరం ఓటుకు సిద్ధమైంది. మరో 24గంటల్లో ఎన్నిక ప్రక్రియ మొదలుకానుంది. మూడు జిల్లాల్లోని నాలుగు ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుండగా.. -
గులాబీతో అభివృద్ధి గుబాళింపు..
[ 12-05-2024]
ముస్లింల సంక్షేమానికి భారాస ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
ఎన్నికల యుద్ధం.. బలగం సిద్ధం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు కమిషనరేట్ల పరిధిలో 27వేల మంది పోలీసులు, 60 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తులో ఉండనున్నాయి. ఎక్కడ ఘర్షణ చెలరేగినా క్షణాల్లో చేరుకునేలా దశలవారీ భద్రతా వ్యూహం రూపొందించారు. -
నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అందరూ ఓటు వేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ పిలుపునిచ్చారు. -
రండి.. స్వేచ్ఛగా ఓటేయండి
[ 12-05-2024]
ఓటు హక్కు వినియోగంపై ఎలా అవగాహన కల్పించారు? ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారా? -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్క్షాప్ 19న
[ 12-05-2024]
ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. ‘ఎ ప్యాలెట్ ఆఫ్ డ్రీమ్స్’ పేరున ఈ నెల 19న నిర్వహించనున్న ఈ శిబిరంలో 14 సంవత్సరాలు దాటిన వారెవరైనా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. -
ప్రచారం ముగిసింది.. పోలింగే మిగిలింది!
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. దాదాపు మూడు నెలలుగా సాగిన ప్రచారానికి తెరపడింది. మల్కాజిగిరి, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. -
ఈవీఎంల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: కలెక్టర్
[ 12-05-2024]
ఈవీఎంలను పోలీంగ్ కేంద్రాలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందికి తెలిపారు. శనివారం స్థానిక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రమైన మేరీ-ఏ-నాట్్్స పాఠశాలను అదనపు పాలనాధికారి రాహుల్ శర్మ, శిక్షణ కలెక్టర్ ఉమా హారతితో కలిసి పరిశీలించారు. -
అమిత్షోతో.. కొండంత భరోసా
[ 12-05-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్లో నిర్వహించిన సభ విజయవంతమై పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. -
సర్కార్లో జిల్లాకు అధిక ప్రాధాన్యం
[ 12-05-2024]
మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి విజయాన్ని కోరుతూ శనివారం తాండూరులోని విలియమ్ మూన్ మైదానంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొని సీఎం మాట్లాడారు. -
వేలిపై సిరా చుక్క.. ఉచిత వైద్యం పక్కా
[ 12-05-2024]
ఈనెల 13న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆరోజు ఉచితంగా వైద్యం అందజేస్తామని స్థానిక మైత్రి ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ శ్రవణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
-
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
-
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత