logo

గంజాయి తాగొచ్చి వేధిస్తున్నాడని తమ్ముడి హత్య

మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు.

Published : 28 Apr 2024 03:01 IST

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు. ఆసిఫ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫ్‌నగర్‌లోని ఫీల్‌ఖానా ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌(28) గంజాయి, మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు చెప్పినా వినకపోగా వారిపై దాడి చేసేవాడు. శుక్రవారం రాత్రి 11.30గంటల సమయంలో అన్న మహ్మద్‌ సయీద్‌తో గొడవకు దిగి అతని చరవాణి తీసుకొని పారిపోయాడు. అర్ధరాత్రి 2గంటలకు ఇంటికి వచ్చిన ఫిరోజ్‌తో అన్నకు మరోసారి గొడవ జరిగింది. దీంతో కొపం పెంచుకున్న సోదరుడు తన స్నేహితుడు షానవాజ్‌ ఖాన్‌తో కలిసి తమ్ముడిని ఇంటి పైఅంతస్తుకి తీసుకెళ్లి ఇనుప రాడ్‌తో దాడి చేసి హతమార్చారు. అనంతరం ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని