పట్టుదలతో చదివి.. సత్తా చాటి
పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు.
పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు. నగరానికి చెందిన పలువురు ఇంటర్మీడియట్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. భవిష్యత్తులో తాము సాధించబోయే లక్ష్యాలను వారి మాటల్లోనే వివరించారు.
అమ్మానాన్న ప్రోత్సాహంతోనే సాధించా..
మహమ్మద్ అజ్హాన్సాద్, 6వ ర్యాంకు అగ్రికల్చర్, ఫార్మసీ
నాచారం: మేం నాచారం పరిధి బాబానగర్లో ఉంటాం. నాన్నా ఈసీఐఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం రోజుకు 12గంటల పాటు అభ్యసించడంతోనే ఈ ఫలితం వచ్చింది. తల్లిదండ్రులు మహమ్మద్ జమాలుద్దీన్, నూష్రాత్ జహన్ అందించిన ప్రోత్సాహంతోనే ఈ విజయం లభించింది. పదోతరగతిలో 487/500 మార్కులు, ఇంటర్మీడియట్ 970 మార్కులు సాధించాను. నీట్ ఫలితాలు ఇంకా రాలేదు. అందులో కూడా మంచి ర్యాంకు వస్తుందనే ఆశిస్తున్నా. మంచి ర్యాంకు రాకపోతే బయోటెక్నాలజీ చేస్తా.
రోజుకు 10 గంటలు కష్టపడి చదివా
విదిత్ హుండేకర్, ఇంజినీరింగ్ 7వ ర్యాంకర్
మణికొండ: తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు రోజూ పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదవడంతో ఈఏపీ సెట్లో 7వ ర్యాంకు సాధించాను. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించా. ముంబయి ఐఐటీలో సీఎస్సీ చేయాలనే లక్ష్యంతో చిన్ననాటి నుంచే ప్రణాళికతో చదివాను. ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉపకరించింది. విదిత్ హుండేకర్ తండ్రి అనీల్కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, తల్లి మమత ఖాజాగూడలోని ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో ఉంటున్నారు.
క్యాన్సర్ వైద్యుడిగా స్థిరపడాలనుకుంటున్నా
-భార్గవ్ సుమంత్, అగ్రికల్చర్, ఫార్మసీ 8వ ర్యాంక్
పేట్బషీరాబాద్: జీడిమెట్ల డివిజన్ ఎన్సీఎల్ కాలనీ సౌత్కు చెందిన జె.భార్గవ్ సుమంత్ ఎప్సెట్లో రాష్ట్రంలో 8వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి చంద్రశేఖర్ వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. తల్లి జయశ్రీ గృహిణి. ఇంటర్లో బైపీసీలో 985 మార్కులు సాధించాడు. ‘‘ర్యాంక్ సాధించడంలో ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. నీట్ పరీక్ష కూడా రాశా. అందులో మంచి ర్యాంక్ వస్తే దిల్లీలోని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదివి.. క్యాన్సర్ వైద్యుడిగా స్థిరపడాలనుకుంటున్నా’’ అని భార్గవ్ తెలిపారు.
చదువుతోపాటు యోగా, ధ్యానం చేస్తా
పబ్బ రోహన్ సాయి, ఇంజినీరింగ్, 8వ ర్యాంకు
జూబ్లీహిల్స్: మాది ఎల్లారెడ్డిగూడ. కళాశాలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద నాన్న రాజేశ్వర్, అమ్మ లావణ్య ప్రోత్సాహంతో పాటు సాధించాలనే తపన వల్ల ఇది సాధ్యమైంది. నిత్యం ప్రణాళికాబద్ధంగా పరీక్షకు ప్రిపేర్ అయ్యాను. రోజూ చదువుతోపాటు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తా, అప్పుడే చదువు మీద ఏకాగ్రత ఉంటుంది. ఇంటి నుంచే రోజు కళాశాలకు వెళ్లి వచ్చేవాడిని, అదే పనిగా చదవడం కాకుండా విరామం తీసుకుంటూ చదివేవాడిని. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్లో చేరాలనేది లక్ష్యం. ఇందుకు సాధన చేస్తున్నా.
డాక్టర్ని కావాలన్నదే లక్ష్యం
ఆదిత్య, 9వ ర్యాంకు, అగ్రికల్చర్,ఫార్మసీ
వివేకానందనగర్కాలనీ: డివిజన్లోని కమలాప్రసన్ననగర్లో ఉంటాం. నీట్ ద్వారా మంచి కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలన్న లక్ష్యంతో చదివాను. లక్ష్యం సాధించేందుకు రెండేళ్లు నీట్కు సిద్ధమయ్యాను. నీట్తోపాటు ఎప్సెట్కు దరఖాస్తు చేశాను. ఈనెల 5న నీట్ పరీక్ష రాసి మధ్యలో రెండు రోజులపాటు సిద్ధమై 8న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష రాశాను. 9వ ర్యాంకు రావడం ఆనందాన్నిచ్చింది. వైద్యుడిగా స్థిరపడాలన్న లక్ష్యం సిద్ధమవుతూ వచ్చాను. తండ్రి సూర్యకాంత్ జయశెట్టి, తల్లి జయలక్ష్మి, గురువుల ప్రోత్సాహంతో ఈ సక్సెస్ సాధ్యమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
-
డ్రాగన్ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..!
-
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా హవా
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!