అభివృద్ధి చూపి ఓట్లడగాలి
గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
బోయినపల్లిలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్, పక్కన
ఎమ్మెల్యేలు సత్యం, సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి రాజేందర్రావు
బోయినపల్లి, న్యూస్టుడే: గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి బోయినపల్లిలో శనివారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సంజయ్ పార్టీ అధ్యక్ష పదవిని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడటంతోనే రాత్రికి రాత్రి ఆ పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. ఎంపీగా అయిదేళ్లలో చేసిన అభివృద్ధి, భవిష్యత్లో ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగకుండా రాముడి పేరు చెప్పి, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మధ్యమానేరు ముంపు నిర్వాసితులకు రూ. 5.04 లక్షలు కేంద్రం నుంచి ఇప్పిస్తానని, లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన సంజయ్ ఎందుకు నిర్వాసితుల సమస్య పరిష్కరించలేదని నిలదీశారు. మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎంపీ, భారాస అభ్యర్థి వినోద్కుమార్ అత్తగారి మండలం బోయినపల్లిని ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చూసి తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మండల అధ్యక్షుడు వెన్నల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి మహేశ్వర్రెడ్డి, బోయినపల్లి పీఏసీఎస్ ఛైర్మన్ జోగినపల్లి వెంకటరామారావు, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ష్.. ఇక నిశ్శబ్దం!
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పార్టీలు ఇన్నాళ్ల ప్రచార సందడిని ఉన్నపళంగా నిలిపివేశాయి. శ -
భారీ మెజార్టీతో భాజపాదే విజయం
[ 12-05-2024]
‘కేసీఆర్.. నీకు శ్రీరాముడి గురించి ఏమి తెలుసు? ముస్లిం ఓట్లే కావాలా? హిందువుల ఓట్లు వద్దా? గతంలోనూ హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే సంజయన్న ఏమి చేసిండో తెలుసు కదా..’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
లక్ష మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు ఖాయం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలలో కరీంనగర్ స్థానంలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును లక్ష ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి : కేటీఆర్
[ 12-05-2024]
‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఆనాడే చెప్పారు.. -
పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి వెల్లడించారు. -
విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులుండొద్దు
[ 12-05-2024]
పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ సీజీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 12-05-2024]
వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు, -
పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, -
పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. సమీకృత పాలనా ప్రాంగణంలో శనివారం ఆన్లైన్లో ర్యాండమైజేషన్ చేపట్టారు. -
ముగిసిన ఈఏపీసెట్
[ 12-05-2024]
సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షలు శనివారం ముగిశాయి. అయిదు రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. -
స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
[ 12-05-2024]
ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. -
భద్రత కట్టుదిట్టం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లాకు భారీగా పోలీసు బలగాలను రప్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఓటింగ్ శాతాన్ని పకడ్బందీగా నమోదు చేయాలి
[ 12-05-2024]
ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. -
ఇరువురి వాదనలపై ఆర్డీవోకు నివేదిక
[ 12-05-2024]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదు మేరకు శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విచారణకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున న్యాయవాదులు హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ