రీల్స్ చేద్దామని పిలిచి.. కాబోయే వాడిని కత్తితో పొడిచేసింది..!
తాను ప్రేమిస్తున్న యువకుడ్ని వదిలి మరో యువకునితో వివాహం చేసుకోవడానికి ఆ బాలిక (17)కు ఇష్టమే లేదు.
హావేరి, న్యూస్టుడే : తాను ప్రేమిస్తున్న యువకుడ్ని వదిలి మరో యువకునితో వివాహం చేసుకోవడానికి ఆ బాలిక (17)కు ఇష్టమే లేదు. తనకు ఇష్టం లేకపోయినా, కుటుంబ సభ్యుల ఒత్తిడితో దేవేంద్ర గౌడ (23) అనే యువకుడితో వివాహ నిశ్చితార్థానాకి తలవంచక తప్పలేదు. ఎలాగైనా అతన్ని అడ్డు తప్పించుకునేందుకు ఎత్తుగడ వేసింది. ‘మీరు ఉద్యానానికి వస్తే రీల్స్ తీసుకుందాం’ అని గౌడను నమ్మించింది. కొంత సమయం రీల్స్ తీసిన తర్వాత- చేతులు కట్టేసి, మరో రీల్ తీస్తానని చెప్పింది. ఆమె మాటలు దేవేంద్రగౌడ నమ్మాడు. చేతులు కట్టేసిన తర్వాత తన వద్ద ఉన్న కత్తితో అతని గొంతుపై పొడిచి పరారైంది. బాధతో కేకలు వేస్తున్న అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. బాలికను అదుపులోకి తీసుకున్నామని హలగేరి ఠాణా పోలీసులు శనివారం వెల్లడించారు. బాధితుడు హరపనహళ్లిలో సేల్స్మెన్గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బాలిక మేజర్ అయిన తర్వాత వివాహం చేసుకునేలా ఆమె తల్లిదండ్రులు దేవేంద్రగౌడతో మార్చి 3న నిశ్చితార్థం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నియమావళి చట్రంలోనే ప్రగతి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో ముగిసినా ఇంకా నాలుగు విడతల ఎన్నికలు దేశవ్యాప్తంగా నిర్వహించాలి. ఈ ఎన్నికల ఫలితాల విడుదలైన రెండు రోజుల వరకు నియమావళి అమలులో ఉంటుంది. జూన్ ఆరోతేదీ వరకు నిబంధనలను పాటించాల్సిందే. -
భాజపాదే సంపూర్ణ విజయం
[ 12-05-2024]
మిత్రపక్షం జనతాదళ్తో కలిసి కర్ణాటకలో 28 లోక్సభ నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తామని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ధీమా వ్యక్తం చేశారు. -
మోదీ సాధనలేవీ?
[ 12-05-2024]
అబద్ధాలు చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరితేరినా.. ప్రజల మనోభావాలతో ఆయన చెలగాటమాడటాన్ని అందరూ గుర్తించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
వికృత నేరాల రూపం
[ 12-05-2024]
కొడగు జిల్లాలో సంచలనం సృష్టించిన సూర్లబ్బి సమీపంలోని కుంబారగడిగె గ్రామానికి చెందిన మీనా (16) హత్య కేసు కొత్త మలుపుతిరిగింది. ఆమె తలను తనతో తీసుకు వెళ్లిన నిందితుడు హొన్నండ ప్రకాశ్ (32).. -
మానవత్వానికే మచ్చ
[ 12-05-2024]
నగదు కోసం ముగ్గురిని అపహరించి, వారిపై భౌతిక దాడి చేసి, మర్మావయవాలకు విద్యుత్తు షాక్ ఇచ్చిన రమేశ్ అనే వ్యక్తిని, అతని అనుచరులను కలబురగి విశ్వవిద్యాలయం ఠాణా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
ప్రజ్వల్కు మోదీనే రక్ష: కాంగ్రెస్
[ 12-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రక్షిస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజ్వల్ వద్ద ఉన్న డిప్లమేటిక్ పాస్పోర్టును రద్దు చేస్తే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు తిరిగి వస్తారని... -
ఆత్మాభిమానంతోనే బానిసత్వ విముక్తి
[ 12-05-2024]
ఆత్మాభిమానం లేకపోతే బానిసలుగా మారవలసి ఉంటుందని- అది సాధించిన నాడే స్వేచ్ఛ సాధ్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటే ఇతరులకు బానిసలుగా ఉంటూ, భజన చేయవలసిన అవసరం ఉండదన్నారు. -
ఎస్ఎం కృష్ణకు కొనసాగుతున్న చికిత్స
[ 12-05-2024]
వయోసహజమైన ఆరోగ్య సమస్యలతో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు వైద్యులు చికిత్సను కొనసాగిస్తున్నారు. -
వారి ఓటమికి.. అదే కారణం : ఎంబీ
[ 12-05-2024]
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కాకుండానే తాము రామునికి గుడి కట్టామని చేసుకున్న ప్రచారమే భాజపా ఓటమికి కారణమవుతుందని మంత్రి ఎంబీ పాటిల్ పేర్కొన్నారు. -
కూటమికి ఓటేస్తేనే ‘ఆంధ్ర’కు బలిమి!
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేపట్టి మనకు, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వారు పేర్కొన్నారు.