logo

‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.

Published : 23 Apr 2024 02:08 IST

 హారాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్న సిద్ధరామయ్య

 చిక్కమగళూరు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది. ‘శక్తి’ పథకంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణంతో తాను నిత్యం కళాశాలకు వెళ్లేందుకు అవకాశం లభించిందని, ప్రయాణ ఖర్చు కలిసి రావడంతో, చదువుకునేందుకు పుస్తకాలు కొనుగోలు చేసుకుంటున్నానని ఆమె ముఖ్యమంత్రికి వివరించింది. ‘జీరో’ టికెట్లతో చేసిన హారాన్ని ముఖ్యమంత్రి పరిశీలించి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికైనా మీకు పంపించాలని దీన్ని తయారు చేశానని జయశ్రీ తెలిపింది. అరసికెరెకు వస్తున్నట్లు తెలుసుకుని తాను ఇక్కడకు తీసుకువచ్చి ఇచ్చానని సీˆఎంకు చెప్పింది. ఆమెను సిద్ధు ఆశీర్వదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని