అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి
ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు బాధ్యత
హొసపేటెలో జరిగిన ఓ కార్యక్రమంలో గెలుపోటములపై చర్చలు జరుపుతున్న బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు నాగేంద్ర, జమీర్ అహ్మద్ ఖాన్
హొసపేటె, న్యూస్టడే: బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి. అభ్యర్థి తుకారాంను గెలిపించుకోవడం కోసం బళ్లారి జిల్లా బాధ్యమంత్రి బి.నాగేంద్ర రేయింబవళ్లు ఆయన వెంట తిరుగుతూ చెమటోడ్చుతున్నారు. విజయనగర జిల్లా బాధ్యమంత్రి జమీర్ అహ్మద్ఖాన్ అభ్యర్థి తరఫున ప్రచారంలో సక్రమంగా పాల్గొనలేకపోతున్నారు. నామినేషన్ రోజు, మొన్న హొసపేటెలో జరిగిన కార్యకర్తల సమావేశానికి మాత్రమే జమీర్ అహ్మద్ఖాన్ పాల్గొన్నారు. బళ్లారి జిల్లా నుంచి ఎక్కువ ఆధిక్యం ఇస్తామని మంత్రి బి.నాగేంద్ర, విజయనగర నుంచి ఎక్కువ ఆధిక్యం ఇస్తామని మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ను స్వయంగా సవాల్ స్వీకరించారు. అది అంత సులభం కాదని ఇద్దరు అమాత్యులకూ తెలుసు. 2004 నుంచి లోక్సభ ఎన్నికల్లో భాజపా కంచుకోటగా మారిన బళ్లారిని తిరిగి కాంగ్రెస్ గుప్పిట్లోకి తీసుకోవాలని ఆ పార్టీ నాయకలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఫలితం మాత్రం దక్కడంలేదు. 2004లో కరుణాకర రెడ్డి, 2009లో జె.శాంత భాజపా నుంచి బళ్లారి లోక్సభ క్షేత్రంలో గెలిచారు. 2014లో శ్రీరాములు భాజపా నుంచి గెలిచి 2018లో రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉగ్రప్ప గెలవడంతో బళ్లారి కోట కాంగ్రెస్ స్వాధీనంలోకి వచ్చిందని ఆ పార్టీ నాయకులు సంతోషిస్తుండగానే 2019లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ భాజపా అభ్యర్థి దేవేంద్రప్ప విజయం సాధించారు. సుమారు 20 ఏళ్లు బళ్లారి లోక్సభ క్షేత్రంలో కాంగ్రెస్కు అధికారం దక్కలేదు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ బళ్లారి జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచారు. అదే ఉత్సాహంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటే బళ్లారి కోట కాంగ్రెస్ పరమవుతుందని ఆ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే పూర్తి బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. దానికి తోడు మాజీ ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థిని గెలిపించి తమ సత్తా చాటుకోవాలని ఇద్దరు మంత్రులు పలు కసరత్తులు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
[ 04-05-2024]
కర్ణాటకలోని బెళగావి జిల్లా వంటెమూరి గ్రామంలో గత ఏడాది డిసెంబరులో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ప్రజలు మరచిపోకనే.. హావేరి జిల్లాలో అదే తరహా ఘటన కలకలం రేపింది. -
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
[ 04-05-2024]
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ తాలూకూ అశ్లీల వీడియోలు, వాటి ఆధారంగా నమోదైన కేసులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. -
అ‘ద్వితీయ’ ఫలితం ఎవరికో
[ 04-05-2024]
కన్నడనాట రెండో విడత ఎన్నికల కోసం కొనసాగుతున్న ప్రచారంలో జాతీయ నేతల సందడి క్రమంగా తగ్గనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే ఉత్తర ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలనూ చుట్టేశారు. -
మోదీ నాటకాలు చెల్లవ్
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చక్కని నాటక కళాకారుడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘ఈవెంట్ మేనేజరు’గా కూడా ఆయన చక్కగా పని చేస్తారని విమర్శించారు. -
తల్లి హత్యకేసు.. సామాజిక శిక్ష ఖరారు
[ 04-05-2024]
తల్లిని కొట్టి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ (35) అనే నిందితుడికి కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆరు నెలలు సమాజ సేవను శిక్షగా విధించింది. -
దేశద్రోహులతో ముప్పు
[ 04-05-2024]
ఈ ఎన్నికల్లో మేమంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సైన్యంగా మారడం పూర్వజన్మ సుకృతం..నా సంకల్పం రాష్ట్రంలోని 28 స్థానాల్లో విజయం సాధించి మోదీకి శక్తినందించడం అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర పేర్కొన్నారు. -
రాహుల్గాంధీ వద్ద ఆధారాలు ఉన్నాయా..!
[ 04-05-2024]
ప్రజ్వల్ అశ్లీల వీడియోల కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. నేరం నిరూపణ కాలేదు..అవి నిజమైనవో కాదో..అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాత్రం ప్రజ్వల్ రేవణ్ణవి దాదాపు 400 వీడియోలు ఉన్నట్లు చెబుతున్నారు. -
కేంద్రమే ప్రజ్వల్ను రక్షిస్తోంది: సిద్ధు
[ 04-05-2024]
లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ వద్ద ఉన్న దౌత్య పాస్పోర్టును రద్దు చేస్తే అతను ఏ దేశంలోనూ ఉండేందుకు అవకాశం ఉండన్నారు. -
శిరసిలో ఐటీ దాడులు
[ 04-05-2024]
పీసీసీ సభ్యుడు, శిరసిలో పారిశ్రామికవేత్త దీపక్ దొడ్డూరు, ఆయన ఆప్తులు శివరాం హెగ్డే, అనిల్ ముష్టగిల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!