బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది.
యశ్వంతపురలో డాక్టర్ మంజునాథ్తోపాటు దళపతి కుమారస్వామి ప్రచారం
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గం బరిలో దిగినప్పుడు కనిపించి సందడి.. ఆపై ప్రత్యర్థి ఎత్తుగడల క్రమంలో కనిపించడం లేదు. రాజకీయ అనుభవంతో పాటు ఆర్థిక, అంగ బలమున్న కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్ ఆయన ప్రత్యర్థి కావడంతో విజయం ఏమంత సులువైన అంశం కాదనే విషయాన్ని గుర్తించారు. సురేశ్కు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్- మంజునాథ్ తరఫున మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ నేరుగా ప్రచారాన్ని భుజానికెత్తుకోవడమే పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఈ రెండు కుటుంబాల మధ్య పోరు నువ్వా-నేనా అన్నంత హోరెత్తిస్తోంది. గ్రామీణ నియోజకవర్గంలోనే శివకుమార్ ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. నాలుగో సారి విజయం కోసం డీకే బ్రదర్స్ శ్రమటోడుస్తున్నారు. బెంగళూరు గ్రామీణ, రామనగర, తుమకూరు జిల్లాల పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నియోజకవర్గం విస్తరించింది. అందులో ఆరు చోట్ల కాంగ్రెస్, రెండింట ఎన్డీఏ నేతలు ఎమ్మెల్యేలుగా సేవఅందిస్తున్నారు. వారివారి అభ్యర్థుల విజయ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. శివకుమార్ ప్రాతినిధ్యం వహించే కనకపుర ఇందులో ఒకటి. సోదరుడి విజయం ఆయనకు పెద్దసవాల్. ఈసారి అన్ని రకాల ఎత్తుగడలూ ఎంచుకుని ముందుకెళుతున్నారు. ఏదోలా ఒప్పించి బీఎస్పీ అభ్యర్థి చెన్నప్పను బరిలోంచి తప్పించడమూ అందులో భాగమేననే ప్రచారం లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే చెన్నపట్టణలో జనతాదళ్ నేతలు, కార్యకర్తలను భారీగా కాంగ్రెస్లో చేర్చుకున్నారు. మచ్చలేని వ్యక్తిగా పేరున్న మంజునాథ్కు రాజకీయాలు పూర్తిగా కొత్తకావడంతో దళపతి దేవేగౌడ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన బావమరిది కుమారస్వామి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ‘ప్రచార బాధ్యతలన్నీ కుమారస్వామి, దేవేగౌడ చూసుకుంటారు’ అంటూ అభ్యర్థి పలుమార్లు ప్రకటించడం ప్రస్తావనార్హం. పోటీ పడుతున్న ఇద్దరూ ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన వారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో మైనార్టీలు, దళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువ. వారు ఎటువైపు మొగ్గు చూపుతారో ఆపార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింగాయత్ల గ్యారంటీ.. విజయానికి దివిటీ
[ 03-05-2024]
కన్నడనాట ఈనెల 7న జరగనున్న 14 నియోజకవర్గాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు లింగాయత్ల ప్రాబల్యం ఉన్నవే! ఏప్రిల్ 26న ఎన్నికలు నిర్వహించిన 14 క్షేత్రాల్లో ఒక్కలిగల బలం ఎక్కువగా ఉంటే.. మలివిడత ఆ ఘనత లింగాయత్లదే. -
పెద్ద కుటుంబానికి తలవంపులు
[ 03-05-2024]
లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ సిట్ అధికారుల ముందు గురువారం విచారణకు హాజరు కాలేదు. హాసన నుంచి భార్య భవానీతో కలిసి బెంగళూరుకు చేరుకున్న ఆయన పద్మనాభనగరలోని తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు. -
రాజకీయ వింతలు.. ప్రచారం కొత్తపుంతలు
[ 03-05-2024]
రాష్ట్రంలో రెండోదశ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ నేతల నోట ప్రజా సంక్షేమం, ప్రగతి మాట కంటే వివాదాస్పద అంశాలే దొర్లుతున్నాయి. ఎన్నికల ముందు ప్రణాళికల్లో రచించుకున్న దీర్ఘకాలిక లక్ష్యాల కంటే రోజువారీ సంఘటన అంశాలతో నేతలు ప్రచారాన్ని నెగ్గుకొస్తున్నారు. -
ప్రేమించలేదని.. వివాహిత ఇంటికి నిప్పు
[ 03-05-2024]
తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒక వివాహితను వేధిస్తూ.. ఆమె అందుకు నిరాకరించడంతో ఇంటికి నిప్పు పెట్టిన అర్బాజ్ అనే పిచ్చి ప్రేమికుడ్ని సంపిగెహళ్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. -
సిద్ధు సర్కారు అన్ని రంగాల్లో విఫలం
[ 03-05-2024]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భాజపా అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి లోక్సభ భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు తరఫున యడియూరప్ప కురుగోడు తాలూకాలో ప్రచారం నిర్వహించారు. -
కల్యాణ్ జువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
బళ్లారి నగరం తేరువీధిలో మార్టిన్ మార్గంలో ఉన్న కల్యాణ్ జువెలరి దుకాణంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. -
హరపనహళ్లిని ప్రగతి దారిలో నడిపించేదెవరు?
[ 03-05-2024]
దావణగెరె లోక్సభ నియోజకవర్గం, ప్రస్తుతం విజయనగర జిల్లా పరిధిలోకి వచ్చే, వెనుకబడిన తాలూకా హరపన హళ్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు హరపన హళ్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచివారిలో సగంకన్నా ఎక్కువ మంది స్థానికేతరులే కావడం ప్రత్యేకం. -
ఓటేస్తే..ఉచితంగా నేత్రాలంకరణ
[ 03-05-2024]
తమకే ఓటు వేయాలని ఓటర్లకు తాయిలాలు ఇచ్చేవారే ఎక్కువ. ఇక్కడో యువతి ఓటు శాతం పెరగాలని ఓటేసి వచ్చిన మహిళలకు ఉచితంగా ఐబ్రో అలంకరణ భాగ్యాన్ని కల్పిస్తానని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు