హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు.
కిరాయి ఇచ్చిన నిందితుడు
గదగ, న్యూస్టుడే : జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, తన సోదరుడ్ని చంపాలని ప్రకాశ్ బాకళె, సునంద పెద్ద కుమారుడు వినాయక్ బాకళెలను హత్య చేసేందుకు రూ.65 లక్షలకు కిరాయి మాట్లాడుకున్న వారి కుమారుడు వినాయక్ రూ.2 లక్షలు బయానా ఇచ్చాడు. అదే సమయంలో వారింటికి వచ్చిన సమీప బంధువులు పరశురామ్ హాదిమని (55), ఆయన భార్య లక్ష్మీ హాదిమని (47), వారి కుమార్తె ఆకాంక్ష (17), సునంద బాకళె చిన్న కుమారుడు కార్తిక్ (28)లను హంతకులు కడతేర్చి పరారయ్యారు. సునంద, ప్రకాశ్ తమ పడకగదిని బంధువులకు ఇచ్చి మరో గదిలో పడుకోవడంతో వారి ప్రాణాలు మిగిలాయి. మహారాష్ట్రకు చెందిన ఫయాజ్, అతని అనుచరులు హత్య చేశారని విచారణలో గుర్తించి, వారి కోసం గాలింపు తీవ్రం చేశారు. నగర సభ మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ బాకళె, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు సునంద బాకళెకు కార్తిక్ బాకళె ఒక్కడే కుమారుడు. ప్రకాశ్ మొదటి భార్యకు వినాయక్, దత్తాత్రేయ, మరో కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహమై అత్తవారింటికి వెళ్లింది. రెండో కుమారుడు దత్తాత్రేయ నకిలీ ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి వంచించిన పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. గదగ, ముండరగి, బెంగళూరుతో పాటు పలు బ్యాంకులకు రూ.45 కోట్లు వంచించిన కేసులు ఉన్నాయి. తనకు చెడ్డ పేరు తెచ్చావంటూ దత్తాత్రేయను ఇంటి నుంచి దూరంగా ఉంచాడు. పోలీసులు అరెస్టు చేస్తారని దత్తాత్రేయ పరారయ్యాడు. ఇంట్లో వినాయక, కార్తిక్, తన రెండో భార్యతో కలిసి ప్రకాశ్ ఉంటున్నారు. తల్లిదండ్రులు, తన సోదరుడ్ని హత్య చేయిస్తే ఆ నేరం పరారీలో ఉన్న దత్తాత్రేయ మీదకు వెళుతుందని వినాయక్ భావించాడు. కిరాయి మాట్లాడుకుని తల్లిదండ్రులు, సోదరుడు ఉండే గది వివరాలను ఫయాజ్కు చెప్పాడు. ఏప్రిల్ 19న వేకువ జామున హంతకులు ఇంటికి చేరుకున్నారు. ప్రకాశ్, సునంద పడుకునే గదిలో బంధువులు పడుకున్నారు. ఆ దంపతులు, వారి కుమార్తెను, మరో గదిలో పడుకున్న కార్తిక్ను హత్య చేసి నిందితులు పరారయ్యారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. తన మొదటి భార్య రెండో కుమారుడు దత్తాత్రేయ కానీ, అతని చేతిలో వంచనకు గురైన వారే ఈ హత్యలు చేసి ఉంటారని ప్రకాశ్ మొదట భావించారు. తాను నమ్ముకున్న పెద్ద కుమారుడు వినాయక్ హత్య చేయించాడని తెలుసుకుని నిర్ఘాంత పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింగాయత్ల గ్యారంటీ.. విజయానికి దివిటీ
[ 03-05-2024]
కన్నడనాట ఈనెల 7న జరగనున్న 14 నియోజకవర్గాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు లింగాయత్ల ప్రాబల్యం ఉన్నవే! ఏప్రిల్ 26న ఎన్నికలు నిర్వహించిన 14 క్షేత్రాల్లో ఒక్కలిగల బలం ఎక్కువగా ఉంటే.. మలివిడత ఆ ఘనత లింగాయత్లదే. -
పెద్ద కుటుంబానికి తలవంపులు
[ 03-05-2024]
లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ సిట్ అధికారుల ముందు గురువారం విచారణకు హాజరు కాలేదు. హాసన నుంచి భార్య భవానీతో కలిసి బెంగళూరుకు చేరుకున్న ఆయన పద్మనాభనగరలోని తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు. -
రాజకీయ వింతలు.. ప్రచారం కొత్తపుంతలు
[ 03-05-2024]
రాష్ట్రంలో రెండోదశ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ నేతల నోట ప్రజా సంక్షేమం, ప్రగతి మాట కంటే వివాదాస్పద అంశాలే దొర్లుతున్నాయి. ఎన్నికల ముందు ప్రణాళికల్లో రచించుకున్న దీర్ఘకాలిక లక్ష్యాల కంటే రోజువారీ సంఘటన అంశాలతో నేతలు ప్రచారాన్ని నెగ్గుకొస్తున్నారు. -
ప్రేమించలేదని.. వివాహిత ఇంటికి నిప్పు
[ 03-05-2024]
తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒక వివాహితను వేధిస్తూ.. ఆమె అందుకు నిరాకరించడంతో ఇంటికి నిప్పు పెట్టిన అర్బాజ్ అనే పిచ్చి ప్రేమికుడ్ని సంపిగెహళ్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. -
సిద్ధు సర్కారు అన్ని రంగాల్లో విఫలం
[ 03-05-2024]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భాజపా అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి లోక్సభ భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు తరఫున యడియూరప్ప కురుగోడు తాలూకాలో ప్రచారం నిర్వహించారు. -
కల్యాణ్ జువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
బళ్లారి నగరం తేరువీధిలో మార్టిన్ మార్గంలో ఉన్న కల్యాణ్ జువెలరి దుకాణంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. -
హరపనహళ్లిని ప్రగతి దారిలో నడిపించేదెవరు?
[ 03-05-2024]
దావణగెరె లోక్సభ నియోజకవర్గం, ప్రస్తుతం విజయనగర జిల్లా పరిధిలోకి వచ్చే, వెనుకబడిన తాలూకా హరపన హళ్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు హరపన హళ్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచివారిలో సగంకన్నా ఎక్కువ మంది స్థానికేతరులే కావడం ప్రత్యేకం. -
ఓటేస్తే..ఉచితంగా నేత్రాలంకరణ
[ 03-05-2024]
తమకే ఓటు వేయాలని ఓటర్లకు తాయిలాలు ఇచ్చేవారే ఎక్కువ. ఇక్కడో యువతి ఓటు శాతం పెరగాలని ఓటేసి వచ్చిన మహిళలకు ఉచితంగా ఐబ్రో అలంకరణ భాగ్యాన్ని కల్పిస్తానని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు