హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
హాసన సెక్స్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు- ఎంపీ ప్రజ్వల్పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ (47).. భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త కుమార్తె.
హాసన, న్యూస్టుడే : హాసన సెక్స్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు- ఎంపీ ప్రజ్వల్పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ (47).. భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త కుమార్తె. రేవణ్ణకు సోదరి వరస. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు నాగలాపుర పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్లో వంట పని చేసేందుకు అవకాశాన్ని కల్పించారు. తన నివాసంలో 2015లో పనిలో చేర్పించుకున్నారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారు. పనిలో చేరిన నాలుగు నెలల నుంచి తనపై దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారని బాధితురాలు ఆరోపించారు. భవానీ రేవణ్ణ ఇంట్లో లేని సమయంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలి ఆరోపణ. పండ్లు ఇచ్చే నెపంతో స్టోరూమ్కు పిలిచి వేధించేవారని వివరించింది. తాను వంట గదిలో ఉన్నప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ శరీరాన్ని తాకుతూ వేధించేవారని ఆరోపించింది. నలుగు స్నానం చేయించాలని, ఒంటికి తైలాన్ని పెట్టి స్నానం చేయించాలని స్నానాలగదికి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆక్రోశించింది. ఇంట్లో నుంచి తన కుమార్తెకు వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అతని చేష్టలకు భయపడి కుమార్తె ప్రజ్వల్ ఫోన్ నంబరును బ్లాక్ చేసుకుందని, ఆ తర్వాత తానూ పని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని తెలిపింది. కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉండడంతో తన భర్త నుంచి ఎదురైన ఇక్కట్ల నేపథ్యంలో- తప్పనిసరి పరిస్థితులతో జరిగిన ఘటనలతో ఫిర్యాదు చేస్తున్నానని వెల్లడించింది.
మూడు వేల సీడీలు
మరో వైపు యువతులను ప్రలోభ పెట్టి, ప్రజ్వల్ తన వాంఛలను తీర్చుకుని, వాటిని వీడియోలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు దుయ్యబట్టారు. ఆయనను పొత్తు అభ్యర్థిగా బరిలో నిలిపి భాజపా తప్పు చేసిందని ఆ పార్టీ సానుభూతిపరులు విమర్శలు గుప్పించారు. ప్రజ్వల్ వీడియోలు అంటూ మూడు వేలకు పైగా వీడియో సీడీలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజ్వల్పై వచ్చిన ఆరోపణలు, వీడియోకు సంబంధించిన ఆరోపణలపై మాట్లాడేందుకు విపక్ష నాయకుడు ఆర్.అశోక్ నిరాకరించారు. దళ్ నేతలే దానికి సంబంధించి మాట్లాడతారని, దర్యాప్తు అనంతరం వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.
సిట్ చూసుకుంటుంది..
బెంగళూరు (సదాశివనగర) : హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని రెవెన్యూ మంత్రి కృష్ణ భైరేగౌడ పేర్కొన్నారు. కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రి, రేవణ్ణ ఐదుసార్లకు పైగా మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. హాసన లోక్సభ సభ్యునిగా ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నిక చెల్లదని ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై ఆయన సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. రేవణ్ణ నివాసంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. దర్యాప్తులో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఈ దేశపు శక్తి (మహిళ)ని అవమానించారని మోదీ తప్పుడు ఆరోపణలు చేశారని అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు ఈ ఘటనపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
ఉప్పు తింటే..
బెంగళూరు (యశ్వంతపుర): ఉప్పుతిన్న వారెవరైనా నీరు తాగాల్సిందేనని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వ్యాఖ్యానించారు. హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో వైరల్ సంఘటనపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు అప్పగించడంపై ఆదివారం ఇక్కడ స్పందించారు. ‘నేను, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మహిళల విషయంలో చాలా గౌరవంగా వ్యవహరించాం. వారెవరైనా కష్టాలు చెప్పడానికి వస్తే సాయం చేశాం. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఆ దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిన అంశంతో నాకెలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు
[ 14-05-2024]
ఓ వైపు లోక్సభ ఎన్నికల తంతు కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో కనీసం 20 నియోజకవర్గాల్లో గెలుస్తామన్న ధీమాలో రెండు జాతీయ పార్టీలున్నాయి. -
పదిలో బాలికల జోరు!
[ 14-05-2024]
విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ పది, 12వ తరగతి ఫలితాలు సోమవారం వెల్లడించారు. రెండు పరీక్షల్లోనూ బెంగళూరు వలయం నాలుగో స్థానంలో నిలిచింది. -
కమనీయం.. తైలాభిషేకం
[ 14-05-2024]
విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా ఉజ్జనిలోని మరుళిసిద్ధేశ్వర స్వామివారి గోపుర తైలాభిషేక కార్యక్రమం సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది. -
మురుగుకాలువలో బాలల మృతదేహాలు
[ 14-05-2024]
ఇంటి నుంచి వెళ్లి.. ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు బాలల మృతదేహాలను ఓ మురుగుకాలువలో గుర్తించారు. -
అన్నింటా భాజపాదే విజయం
[ 14-05-2024]
బెంగళూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎ.దేవేగౌడ, బెంగళూరు ఆగ్నేయ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి వై.ఎ.నారాయణ స్వామి తమ నామినేషన్ పత్రాలను శాంతినగరలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో సోమవారం దాఖలు చేశారు -
రేవణ్ణకు షరతులతో జామీను
[ 14-05-2024]
ఒక మహిళను అపహరించిన ఆరోపణలతో బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న జనతాదళ్ అగ్రనేత, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సోమవారం జామీను మంజూరు చేసింది -
హాసన కేసు ఏమైంది?
[ 14-05-2024]
లెక్కకు మించిన మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు సోమవారం ఇక్కడ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ నాగలక్ష్మికి విన్నవించారు. -
విశ్వవిజ్ఞానం.. కళ్లెదుటే సాక్షాత్కారం
[ 14-05-2024]
ఆకాశం ఎత్తెంత? భూగోళం లోతెంత? నీరు మంచుగా ఎందుకు మారుతుంది? మంచు.. మరీ నీరుగా ఎలా రూపాంతరం చెందుతుంది? రాకెట్లు పైకెలా వెళతాయి. -
హోటల్ మేనేజ్మెంట్లో ఉజ్వల భవిష్యత్తు
[ 14-05-2024]
హోటల్స్ విధులు నిర్వహించే వారికి వృత్తిపర శిక్షణ చాలా అవసరం. నిరుద్యోగ యువతి, యువకులకు హోటల్స్ మేనేజ్మెంట్పై శిక్షణ పొందడంతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని బళ్లారి జిల్లా వాణిజ్య, పరిశ్రమల సంస్థ సహాయక కార్యదర్శి డా.మర్చేడు మల్లికార్జున గౌడ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
-
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
-
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
-
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
-
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
-
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో