రైతులకు అండగా ఉంటాం: నామా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
రైతులతో మాట్లాడుతున్న నామా నాగేశ్వరరావు
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చట్టం చేయాలని పార్లమెంటులో కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో సాగునీరందక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. గద్దెనెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. దోరేపల్లి శ్వేత, మాటేటి నాగేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, సతీష్, నరేష్, శ్రీశైలం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కందాళ ఓటమి బాధించింది..
ఖమ్మం గ్రామీణం: కాంగ్రెస్ మాయమాటల వల్లే పాలేరులో తప్పు జరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కందాళ ఉపేందర్రెడ్డి ఓటమి తననెంతో బాధించిందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పల్లెగూడెంలో నిర్వహించిన భారాస మండల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. గత ఎంపీ ఎన్నికల్లో పాలేరులో అత్యధికంగా 34 వేల ఓట్ల మెజార్టీ వచ్చిందని గుర్తుచేశారు. రైతులు బాగుండాలనే చక్కెర పరిశ్రమ నష్టాల్లో ఉన్నా కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో భారాస ఓటమి తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో నామాను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.
ప్రజలెందుకు ఇలా చేశారో..: కందాళ
గత అయిదేళ్లలో ఓ ఒక్క రోజూ ప్రజలకు దూరంగా లేనని, పాలేరును రాజకీయంగా ఎన్నడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. నాయకుల అతి విశ్వాసం వల్లే నష్టపోయామని తెలిపారు. ఇప్పటికీ ప్రజలు తనకు ఫోన్ చేసి సమస్యలు వివరిస్తున్నారని, బహుశా తాను ఇంకా ఎమ్మెల్యేనే అని అనుకుంటున్నారని వివరించారు. ఎమ్మెల్సీ, భారాస జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ సభ్యుడు యండపల్లి వరప్రసాద్, పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, పీఏసీఎస్ ఛైర్మన్ లక్ష్మణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జన జాతరకు సర్వం సిద్ధం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతం చేస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
ఓట్ల పండుగ.. బాధ్యతలు మెండుగా!
[ 04-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. పౌరులు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఓటరు నమోదు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తుంది. -
ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదు: తుమ్మల
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో తుమ్మల మాట్లాడారు. -
‘ప్రజాదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలి’
[ 04-05-2024]
భారాసపై ప్రజల్లో ఉన్న ఆదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని భారాస జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసలో కుదుపు
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మంలో వలసలు భారాసను కుదిపేస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వరుస కట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. -
భాజపా గెలిస్తేనే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర
[ 04-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపా గెలిస్తేనే నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం టూటౌన్లో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
టేబుల్ టెన్నిస్లో పేట విద్యార్థుల సత్తా
[ 04-05-2024]
‘క్రీడలు ఏవైనా పతకాలు మనకే’ అన్నట్లు కొంతకాలంగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తాజాగా రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్లో ‘పేట’ విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. -
నీటిసంపులో పడి బాలుడు మృతి
[ 04-05-2024]
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం: తుమ్మల
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా మార్చి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం
[ 04-05-2024]
దేశ సుభిక్షానికి మోదీ పాలన మళ్లీ అవసరమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ తెలిపారు. మణుగూరు, అశ్వాపురంలో శుక్రవారం ప్రచారం చేశారు. -
రెప్పపాటు నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో!
[ 04-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యంతో క్షణాల్లో సంభవించే విద్యుత్తు ప్రమాదాలు ఏకంగా ప్రాణనష్టాన్ని తెచ్చిపెడతాయి. విద్యుదాఘాతాలు నిండు నూరేళ్ల జీవితాన్ని ఎలా బలితీసుకుంటాయి? దానివల్ల బాధిత కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో గుర్తించేందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్: నామా
[ 04-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం