అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు.
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. కానీ సీఎం స్పష్టమైన హామీ ఇవ్వటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులు మాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.
పంట రుణ పరిమితి ప్రకారం..
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), గ్రామీణ వికాస్ బ్యాంకు(ఏపీజీవీబీ), స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకు, ఇండియన్ బ్యాంకు ఇలా మొత్తం 28 ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు పంట రుణాలు మంజూరుచేస్తున్నాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (పంట రుణ పరిమితి) ప్రకారం ఆయా బ్యాంకులు రైతులకు ఏటా వానాకాలం, యాసంగిలో పంట రుణాలు ఇస్తాయి. పంటలు పండిన తర్వాత బ్యాంకులు నిర్దేశించిన సమయానికి వడ్డీతో సహా రైతులు రుణాలు చెల్లించాలి. ఉభయ జిల్లాల్లో అధిక శాతం రైతులకు రుణాలను డీసీసీబీ, ఏపీజీవీబీ, ఎస్బీఐ మంజూరు చేస్తున్నాయి.
కటాఫ్ తేదీపై ఉత్కంఠ
పంట రుణాల మాఫీ విషయంలో కటాఫ్ తేదీ అనేది ముఖ్యం. ఏ తేదీని సర్కారు పరిగణనలోకి తీసుకుంటుందనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. కొన్ని నెలలుగా డీసీసీబీ, సహకార సంఘాలు రైతుల నుంచి సుమారు 95 శాతం రుణాలు వసూలు చేశాయి. వసూళ్లలో ఖమ్మం డీసీసీబీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏపీజీవీబీ సైతం బకాయిలు ఉన్న రైతులకు నోటీసులు జారీ చేసింది. చాలామంది రైతులు తమ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పినా డీసీసీబీ, ఏపీజీవీబీ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చిన రుణాల జాబితాలో చేరాయి. డిసెంబరు 9ని కటాఫ్ తేదీగా తీసుకుంటే ఇప్పుడు రెన్యువల్ అయిన రుణాలకు మాఫీ వర్తించే అవకాశం ఉండబోదని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం మార్చిని కటాఫ్ తేదీగా పరిగణిస్తేనే రూ.2లక్షల రుణమాఫీ పథకం వర్తించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కటాఫ్ తేదీ ప్రకటించాకే ఎంతమంది రైతులకు ఎంతమేర రుణం మాఫీ అవుతుందనే విషయంపై స్పష్టత రానుంది. గతంలో రూ.లక్ష రుణమాఫీకి సంబంధించి అప్పటి భారాస సర్కారు 2018 నవంబరు 11న ప్రకటన చేసింది. అదే తేదీని కటాఫ్గా తీసుకుంది. ఇప్పుడు సీఎం రేంవత్రెడ్డి ఏనిర్ణయం తీసుకుంటారోనని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ను సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో శనివారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాహనాలు ఆపేయాలన్నారు. -
పోలింగ్ ముగిసే వరకు ‘నిశ్శబ్దం’
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. పోలింగ్ క్రతువు ముగింపునకు 48 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. -
గళాలు.. బలాలు
[ 12-05-2024]
ప్రముఖులు గెలుపొందిన నేల.. పలు సందర్భాల్లో భిన్నమైన ఫలితానిచ్చిన నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటరీ స్థానం.. అతిరథుల పోటీ నేపథ్యంలో ఈసారి ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అంశంతోనే నియోజకవర్గం, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఓటుహక్కు ఆవశ్యకతను వివరిస్తూ నగరంలోని వివిధ కూడళ్లలో నిలువెత్తు బ్యాలెట్ యూనిట్ల ఫ్లెక్సీలు అమర్చారు. తప్పనిసరిగా ఓటేయాలని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. -
‘రాహుల్ని ప్రధాని చేయటమే లక్ష్యం’
[ 12-05-2024]
శాసనసభ ఎన్నికల ఫలితాలు ఖమ్మం, మహబాబూబాద్ లోక్సభ స్థానాల్లో పునరావృతమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
అందుబాటులో ఉన్నా.. ఆశీర్వదించండి: నామా
[ 12-05-2024]
ఖమ్మం జిల్లా గొంతుకగా పనిచేసే తనను మరోసారి ఆశీర్వదించి లోక్సభకు పంపించాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
ఒక్క అవకాశమివ్వండి: తాండ్ర
[ 12-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోరారు. కులమతాలకు అతీతంగా తనను ఆశీర్వదించాలని బహిరంగ లేఖ ద్వారా శనివారం విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు గెలుపు కోసం రాజశ్యామల యాగం
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించినట్టు తెదేపా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావు అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
[ 12-05-2024]
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. కారేపల్లి అడ్డరోడ్డుకు చెందిన చింతా విజయలక్ష్మి(38) కారేపల్లిలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు తన చిన్నకుమారుడు వరుణ్సాయితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 12-05-2024]
అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల కోరారు. కొత్తగూడెంలో శనివారం మాట్లాడారు. తుది దశ ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి పోలింగ్ కేంద్రాలను కేటాయించామన్నారు.