టీటీలో జిల్లా మేటి!
క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి.
జిల్లా క్రీడాకారుల బృందం
ఖమ్మం క్రీడలు, న్యూస్టుడే: క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి. ఇక్కడి పోటీల ద్వారా టేబుల్ టెన్నిస్(టీటీ) రంగంలో వచ్చిన మార్పులు స్పష్టమయ్యాయి. టోర్నీలో 300 మంది పాల్గొంటే అందులో 72 మంది ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు. జిల్లా టీటీ సంఘం చూపిన చొరవ, స్టేడియంలోని శిక్షణా కేంద్రం నుంచి ఎదిగి వచ్చిన యువ ఆటగాళ్లు ప్రతిభావంతంగా రాణించారు. సబ్ జూనియర్ విభాగంలో జిల్లా క్రీడాకారిణి ఆ విభాగంలో ఛాంపియన్గా నిలిచిన హైదరాబాదు క్రీడాకారిణిని మొదటి రౌండ్లోనే నిలువరించింది. ఈ ప్రగతిని రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం సభ్యులు మంచి ప్రగతిగా కీర్తించారు.
చిన్నారులే కానీ...
జిల్లా జట్టుగా రంగంలో దిగిన 72 మందిలో దాదాపుగా అందరూ 12 ఏళ్లలోపు వారే ఉన్నారు. వారంతా ఆటపై పట్టు సాధించారు. వీరిలో చాలామంది తమ విరామ సమయంలో అంపైరింగ్ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ క్రీడాకారులు ఆడే మ్యాచులను సైతం వివాదరహితంగా నిర్వహించారు. ఆటపై వీరికి ఉన్న పరిజ్ఞానాన్ని పసిగట్టిన రాష్ట్ర టీటీ సంఘం దాదాపుగా అంపైరింగ్ బాధ్యతలు వారికే అప్పగించింది. ఆట, అంపైరింగ్లో రాణించిన జిల్లా చిన్నారులు పలువురి అభినందనలు అందుకున్నారు.
రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం
ఖమ్మం క్రీడలు, న్యూస్టుడే: రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి మూడు వందల మంది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యా సంస్థల యాజమాన్య సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఆహ్వానితులు ఒక్కో సమయంలో వచ్చారు. వచ్చిన వారందరితో ఒక్కో రకం ప్రారంభాలు, ఆవిష్కరణలు చేయించారు. వచ్చిన క్రీడాకారుల్లో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారితో పెద్దలు కూడా ఇక్కడికి వచ్చారు. దీంతో ప్రాంగణం కిటకిటలాడింది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్టు జిల్లా టీటీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాలసాని విజయ్కుమార్, సాంబమూర్తి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుకు పోటెత్తారు
[ 14-05-2024]
సార్వత్రిక సమరంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఓటర్లు మరోసారి చైతన్యం చాటారు. పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బడిముబ్బడిగా బారులు కనిపించనప్పటికీ ఎక్కువ మంది ఓటేసేందుకు ఆసక్తి కనబరిచారు. కొంతమంది ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ఓటుకు పట్టం..!
[ 14-05-2024]
ఓటు చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ‘తెల్లావారకముందే పల్లే లేచింది..’ అన్న చందంగా గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలారు. -
అట్టహాసంగా శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ
[ 14-05-2024]
ఆలయంలో సోమవారం శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ పూజలు అట్టహాసంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న స్వీకరించిన దీక్షలను ఇక్కడి భద్రుడి మండపంలో విరమించారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 14-05-2024]
కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన సీబీఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఖమ్మం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు సత్తాచాటారు. మంచి మార్కులు సాధించి ప్రతిభ చూపారు. విద్యార్థులను ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అభినందించాయి. -
అడవి బిడ్డ ప్రసవ వేదన
[ 14-05-2024]
సరైన రహదారి లేకపోవడంతో ఓ నిండు గర్భిణి మూడు కి.మీ. దూరం అడవిలోంచి ద్విచక్రవాహనంపై ప్రయాణించాల్సి వచ్చింది. పురిటినొప్పులకు తోడు.. అరగంట పాటు ప్రయాణ బాధ ఓర్చుకోక తప్పలేదామెకు. -
ప్రశాంతంగా పోలింగ్
[ 14-05-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల పరిధిలోని భద్రాద్రి జిల్లాలో అయిదు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ప్రియాంక అల ఒక తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ