కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: నామా
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
మాట్లాడుతున్న భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు
తల్లాడ: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని హైదరాబాద్ నుంచి దిగుమతి చేశారని, తాను లోకల్ వ్యక్తినని తెలిపారు. భారాస చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటరును కలవాలని చెప్పారు. ఎంపీగా తనను గెలిపిస్తే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. భారాస అధినేత కేసీఆర్ తల్లాడలో మంగళవారం రోడ్షో నిర్వహిస్తారని పేర్కొన్నారు. భారాస శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకటలాల్, దిరిశాల దాసురావు, బద్దం కోటిరెడ్డి, కేతినేని చలపతిరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బాణోతు మోహన్, గరిడేపల్లి వెంకటేశ్వరరావు (జీవీఆర్), రుద్రాక్ష బ్రహ్మం, తూము శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుకు పోటెత్తారు
[ 14-05-2024]
సార్వత్రిక సమరంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఓటర్లు మరోసారి చైతన్యం చాటారు. పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బడిముబ్బడిగా బారులు కనిపించనప్పటికీ ఎక్కువ మంది ఓటేసేందుకు ఆసక్తి కనబరిచారు. కొంతమంది ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ఓటుకు పట్టం..!
[ 14-05-2024]
ఓటు చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ‘తెల్లావారకముందే పల్లే లేచింది..’ అన్న చందంగా గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలారు. -
అట్టహాసంగా శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ
[ 14-05-2024]
ఆలయంలో సోమవారం శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ పూజలు అట్టహాసంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న స్వీకరించిన దీక్షలను ఇక్కడి భద్రుడి మండపంలో విరమించారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 14-05-2024]
కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన సీబీఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఖమ్మం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు సత్తాచాటారు. మంచి మార్కులు సాధించి ప్రతిభ చూపారు. విద్యార్థులను ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అభినందించాయి. -
అడవి బిడ్డ ప్రసవ వేదన
[ 14-05-2024]
సరైన రహదారి లేకపోవడంతో ఓ నిండు గర్భిణి మూడు కి.మీ. దూరం అడవిలోంచి ద్విచక్రవాహనంపై ప్రయాణించాల్సి వచ్చింది. పురిటినొప్పులకు తోడు.. అరగంట పాటు ప్రయాణ బాధ ఓర్చుకోక తప్పలేదామెకు. -
ప్రశాంతంగా పోలింగ్
[ 14-05-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల పరిధిలోని భద్రాద్రి జిల్లాలో అయిదు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ప్రియాంక అల ఒక తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ