logo

పార్టీని బలోపేతం చేస్తా

కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా జిల్లా నూతన అధ్యక్షుడు బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడారు. వచ్చే ఎ

Published : 20 May 2022 06:22 IST

వైకాపా జిల్లా నూతన అధ్యక్షుడు బాలనాగిరెడ్డి


బాలనాగిరెడ్డిని అభినందిస్తున్న మేయర్‌ రామయ్య, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా జిల్లా నూతన అధ్యక్షుడు బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీకి పనిచేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బాలనాగిరెడ్డిని మేయరు బీవై రామయ్య, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సుధాకర్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రరెడ్డి, గోపాల్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, శివరాం తదితరులు అభినందించారు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బీవై రామయ్యను ఎమ్మెల్యేలు, నాయకులు సన్మానించారు.

ఉనికి చాటుకునేందుకే పర్యటన

అవినీతి రహితపాలన అందిస్తున్న వైకాపాను తెదేపా విమర్శించడం సరికాదని, ఉనికిని చాటుకునేందుకు చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని మేయరు బీవై రామయ్య అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెదేపా హయాంలో ఎంత మంది బీసీలను రాజ్యసభకు పంపారని ప్రశ్నించారు. కరోనా సమయంలో తమ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని, చంద్రబాబు తెలంగాణకు పరిమితమయ్యారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని