అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
తాము స్వచ్ఛభారత్ ప్రతినిధులమని చెబుతూ ప్రజలను మోసం చేస్తూ సినీఫక్కీలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలను ఆదోని పోలీసులు అరెస్టు చేశారు.
పరారీలో మరో నిందితుడు
రూ.35.50 లక్షలు విలువై ఆభరణాలు, కారు సీజ్
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వినోద్కుమార్, సీఐ శ్రీరామ్, ఎస్సై జయశేఖర్, పోలీసుల అధీనంలో నిందితులు, కారు, ఆభరణాలు
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే: తాము స్వచ్ఛభారత్ ప్రతినిధులమని చెబుతూ ప్రజలను మోసం చేస్తూ సినీఫక్కీలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలను ఆదోని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదోని డీఎస్పీ వినోద్కుమార్, సీఐ శ్రీరామ్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం అరుణ్జ్యోతినగర్లో నివాసం ఉంటున్న సంధ్యారాణి ఇంట్లో 2022 జులై 15వ తేదీన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తాము స్వచ్ఛభారత్ ప్రతినిధులమని.. మీ ఇంట్లో డ్రైనేజీ పైపులైను వ్యవస్థ పరిశీలిస్తామని నమ్మబలికి ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉంచిన బంగారు ఆభరణాలు దొంగిలించుకెళ్లారు. బాధితురాలు సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సీఐ శ్రీరామ్, ఎస్సై జయశేఖర్, కానిస్టేబుళ్లు కృష్ణయ్యనాయుడు, నరేంద్ర, చిన్నవెంకటేశ్వర్లు బృందంగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం శిగ్గావ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న యోగేశ్, కెంచప్పను అరెస్టు చేశారని తెలుసుకొని సీసీ ఫుటేజీ, ఫోటోలతో పరిశీలించగా.. పై ఇద్దరు నిందితులను ఆదోని బాధితులు గుర్తించారు. కాగా.. యోగేశ్, కెంచప్ప కర్ణాటకలోని హవేరి జిల్లా జైలులో రిమాండులో ఉండగా కోర్టు అనుమతి తీసుకొని నిందితులను కస్టడీలో తీసుకొని విచారించగా.. పై నిందితులు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైందన్నారు. కర్ణాటక రాష్ట్రం భద్రావతి తాలుకా దొడ్డేరి గ్రామానికి చెందిన యోగేశ్, కెంచప్ప, రవి బృందంగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. జిల్లాలో ఆదోని పట్టణంలోని అరుణ్జ్యోతినగర్లోని సంధ్యారాణి ఇంట్లో దొంగతనంకు పాల్పడగా.. అందుకు సంబంధించి 90 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదోని పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ, కర్నూలు నగరంలోని మిలిటరీ కాలనీలో, చిప్పగిరిలో, మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలోని మాలపల్లె, కర్నూలు నగరం కొత్తపేట, బ్యాంకర్స్ కాలనీ, సప్తగిరి కాలనీల్లో చోరీలకు పాల్పడిన 500 గ్రాముల బంగారు ఆభరణాలు, 475 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మారుతి స్విప్ట్ కారును సీజ్ చేశామన్నారు. నిందితులు తయారు చేసుకున్న నకిలీ ఐడీ కార్డులు సీజ్ చేశామన్నారు. మరో నిందితుడు రవి పరారీలో ఉన్నాడని.. గాలిస్తున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.35.50 లక్షలు ఉంటోందన్నారు. సొత్తు రీకవరికి కృషి చేసిన సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందనలు తెలిపారు.
స్వచ్ఛభారత్ ప్రతినిధుల పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడా అంటివి.. యాడుంది ప్రగతి జాడ
[ 11-05-2024]
కరవు కాటకాలు, వలసలతో విలవిలలాడే కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ తెరపైకి తీసుకొచ్చిన ‘ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ (ఆడా)ను ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది -
రాష్ట్రాన్ని జగన్ ఎడారిగా మార్చారు
[ 11-05-2024]
జిల్లా ప్రజలకు ఏమి చేస్తామో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పలేకపోయారని.. పచ్చని చెట్లను నరికించి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిన జగన్కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
చదువులమ్మ వాకిట అవస్థల పాఠం
[ 11-05-2024]
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ.. విద్యనందిస్తున్నామని చెబుతోంది జగన్ ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. -
ప్రగతి నినాదం... విధ్వంస విధానం.. ఏది కావాలో ఎంచుకో
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఘట్టం చివరి దశకొచ్చింది.. నేటితో ప్రచారం ముగియనుంది.. ‘తెర’ వెనక మంతనాలు మొదలు కానున్నాయి.. మహిళా సంఘాలకు ఎర వేస్తారు.. -
వైకాపాకు ఉద్యోగుల పోటు
[ 11-05-2024]
ప్రభుత్వం ఆటంకం కల్పించే యత్నాలను ఛేదించి.. హక్కు వినియోగానికి బారులు తీరారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రలోభాలకు లొంగలేదు.. బారులు తీరి పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు.. -
సాయంత్రం 6 వరకు పోలింగ్
[ 11-05-2024]
‘సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్కు ముందు 72 గంటలు అత్యంత కీలకం. -
సీమంతైనా మేలు చేయని జగన్
[ 11-05-2024]
కృష్ణా వెనుక జలాల ఆధారంగా నిర్మించిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన జల వనరులను గాలికొదిలేసింది. -
అరాచకపాలనకు ముగింపు పలకాల్సిందే: తెదేపా
[ 11-05-2024]
మే 13న జరిగే పోలింగ్తో రాష్ట్రంలో వైకాపా అరాచకపాలనకు ముగింపు పలకాల్సిందేనని డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. -
అవుకు అధికారంలో అలజడి
[ 11-05-2024]
నంద్యాల జిల్లా అవుకులో వైకాపా నాయకులు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ రసాబాసగా మారడంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. వైకాపా నాయకుల మధ్య ఆధిపత్యపు పోరే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. -
యువకుడి ఆత్మహత్య
[ 11-05-2024]
కర్నూలులోని ఎఫ్సీఐ కాలనీకి చెందిన గుండ్రెడ్డి జయచంద్రారెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మహేశ్వరరెడ్డి, మాధవి దంపతులు తమ పిల్లల చదువుల కోసం కర్నూలు వచ్చారు. -
పతాకస్థాయికి ప్రలోభాల పర్వం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు ప్రలోభాల ప్రక్రియకు తెరతీశారు. రాత్రి వేళల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటరు స్లిప్పులు పరిశీలించి డబ్బులు అందజేస్తున్నారు. -
ఎన్నికల నిర్వహణకు పంచాయతీ నిధులు
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో పంచాయతీ నిధులన్నీ పక్కదారి పట్టాయి. గ్రామాల్లో కనీసం వసతులు కల్పించేందుకు వీలులేని పరిస్థితి. చాలా ప్రాంతాల్లో సర్పంచులు అప్పులు చేసి పనులు చేయించారు. -
వైకాపాకు ఉద్యోగుల పోటు
[ 11-05-2024]
ప్రభుత్వం ఆటంకం కల్పించే యత్నాలు ఛేదించి.. హక్కు వినియోగానికి బారులు తీరారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రలోభాలకు లొంగలేదు.. బారులు తీరి పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!