logo

పీడిత వర్గాల ప్రజల కోసం పోరాటం

పీడిత వర్గాల ప్రజల కోసం సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మోహన్, జిల్లా కార్యదర్శి నరసిహులు, సహాయ కార్యదర్శి అరుణ్కుమార్ అన్నారు.

Published : 28 Apr 2024 20:27 IST

రైతునగరం(నంద్యాల): పీడిత వర్గాల ప్రజల కోసం సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మోహన్, జిల్లా కార్యదర్శి నరసిహులు, సహాయ కార్యదర్శి అరుణ్కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రజా సంఘాల, ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జాతీయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు కమిటీ నాయకత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. సీపీఐ(ఎంఎల్) అనుబంధ సంస్థ పీడీఎస్ యూ విద్యార్థి సంఘం నాయకులు రఫీ, నాగరాజులను పార్టీ క్రమశిక్షణ చర్యల కింద పార్టీ సభ్యంత్వం నుంచి తొలగించడం జరిగిందని, నేటి నుంచి వారికి పార్టీతో ఎటువంటి సంబంధంలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జునైద్బాష, చౌడప్ప, మహమ్మద్, ఇర్ఫాన్, ఆనంద్, మౌలిసా, ఫరూక్, అల్లాబకాష్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని