జగనన్నా.. న్యాయం ఏదన్నా..
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
మహిళలను ఆదుకోని ప్రత్యేక పోలీసుస్టేషన్లు
నిందితులపై కానరాని చర్యలు
కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం, న్యూస్టుడే
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దిశా చట్టం అమలు చేస్తున్నామని.. నిందితులకు తక్షణం శిక్షలు అమలవుతాయని పేర్కొన్నారు. కొద్దిరోజులపాటు నానా హంగామా సృష్టించారు. ఆ తర్వాత షరామామూలే. కేసుల దర్యాప్తు ముందుకు సాగలేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా తీసుకుంటున్న చర్యలు శూన్యమే.
మహిళలకు న్యాయం చేసే ఉద్దేశంతో కర్నూలులోని పాత మహిళా పోలీసుస్టేషన్ను ఆధునికీకరించి దిశా మహిళా పోలీసుస్టేషన్గా మార్చారు. కొత్త జిల్లా ఏర్పడినప్పుడు నంద్యాల జిల్లాలోనూ మరో పోలీసుస్టేషన్ ఏర్పాటైంది. ఈ స్టేషన్లకు ప్రత్యేకంగా వాహనాలు కేటాయించారు. ఏర్పాటుచేసిన కొత్తలో కొద్దిరోజులపాటు పోక్సో, అత్యాచారం కేసులను పర్యవేక్షించడం, విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత ఈ స్టేషన్లు భార్యాభర్తల వివాద కేసులకే పరిమితమయ్యాయి. మంత్రణం చేసి రాజీ చేయడం.. లేదంటే కేసులు నమోదు చేయడం వంటి విధులకే పోలీసులు పరిమితమయ్యారు. కొద్దిరోజుల కిందట కర్నూలు దిశా పోలీసుస్టేషన్పై పలు ఆరోపణలు వచ్చాయి. అన్యాయానికి గురైన ఓ కలెక్టరేట్ ఉద్యోగిని కర్నూలు దిశా స్టేషన్ను ఆశ్రయించగా పోలీసు అధికారులు అవమానించడంతో భరించలేక ఈ ఏడాది జనవరిలో మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
యాప్ పేరుతో హంగామా..
ఆపద సమయాల్లో మహిళలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన దిశా యాప్ పరిస్థితి ఇలానే ఉంది. దీనిపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. జనాన్ని ముప్పుతిప్పలు పెట్టి మహిళల సెల్ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. ఈ యాప్తో పెద్దగా ఫలితం లేకపోయింది. దిశా చట్టం అమలులోకి వస్తుందని నాలుగేళ్లుగా చెబుతున్నా అమలులోకి రాలేదు. అత్యాచారం జరిగిన 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, దిశా యాప్ ఉంటే భద్రత ఉన్నట్లేనని జగన్ చెప్పిన మాటలు ఉత్తమాటలేనని తేలిపోయింది.
కొన్ని ఘటనలు
- 2020 ఆగస్టులో గోనెగండ్ల మండలం ఎర్రబాడుకు చెందిన హజరబీ మృతి చెందగా కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. పొలానికి వెళ్లిన ఈ యువతి విగతజీవిలా మారింది. హత్యాచారానికి గురైనట్లు మృతురాలి సోదరుడి ఫిర్యాదుమేరకు గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.
- గతేడాది ఫిబ్రవరిలో కోడుమూరు పరిధిలో ఓ ఇంటి యజమాని తన ఇంట్లో అద్దెకు ఉన్న దంపతుల కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఇటీవల కర్నూలులోని ఓ కాలనీకి చెందిన బాలుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
- రెండు నెలల కిందట బండిఆత్మకూరు మండల పరిధిలో 30 ఏళ్ల యువతిని వైకాపా నేత అనుచరులు అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది.
వారు ఏం చేస్తున్నారు?
మహిళల సమస్యలు తెలుసుకొని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి న్యాయం చేసి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రతి వార్డు, గ్రామ సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులను నియమించారు. ఉమ్మడి జిల్లాలో 1,190 మందిని నియమించారు. ఉద్దేశం బాగానే ఉన్నా సరైన ప్రణాళికలు రూపొందించకపోవడంతో వారితో మహిళలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. కొద్దిమంది మాత్రమే పలు సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నా అధిక శాతం మంది మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. చివరికి దిశా యాప్ డౌన్లోడ్ చేయించే విధులకు పరిమితమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
[ 16-05-2024]
శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
క్రాస్ ఓటింగ్ భయం.. వైకాపాలో కలవరం
[ 16-05-2024]
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ‘అధికార’ పార్టీ నేతలను క్రాస్ ఓటింగ్ భయపెడుతోంది.. తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి వైకాపా కార్యకర్తలు స్వచ్ఛందంగా అండగా నిలిచినట్లు తెలుస్తోంది. -
రాయితీ కోత.. రైతుకు వాత
[ 16-05-2024]
పక్షం రోజుల్లో ఖరీఫ్ సీజన్ ఆరంభం కానుంది... ఇప్పటికే చిరు జల్లులు పలకరించాయి.. కర్షకులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తనాలు సమకూర్చుకొనే పనిలో పడ్డారు.. ఖరీఫ్ సీజన్కు అవసరమైన రాయితీ విత్తనాలను సిద్ధం చేసేందుకు వ్యవసాయశాఖ ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు అప్పగించింది. -
ఆళ్లగడ్డలో అలజడి
[ 16-05-2024]
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.. ఆళ్లగడ్డ పట్టణ ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఇంతలోనే మంగళవారం అర్ధరాత్రి అలజడి రేగింది.. మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ ప్రైవేటు అంగరక్షకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం సృష్టించింది. -
నేతలకు రూ.కోట్లు కుమ్మరింత
[ 16-05-2024]
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గుట్టుచప్పుడు కాకుండా అడుగులు పడుతున్నాయి.. ఎన్నికల కోడ్కు కొన్ని రోజుల ముందుగా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో కొన్నింటికి బిల్లులు మంజూరయ్యాయి. -
ప్రజల పనులకు వెక్కిరింత
[ 16-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్ర‘జల’ కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. వేసవిలో 181 గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది.. నివారణకు రూ.23.12 కోట్లు నిధులు విడుదల చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులు (ఆర్డబ్ల్యూఎస్) ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. -
స్ట్రాంగ్రూంలకు కట్టుదిట్టమైన భద్రత
[ 16-05-2024]
రాయలసీమ యూనివర్సిటీలోని మూడు బ్లాక్ల్లో 16 స్ట్రాంగ్రూంల్లో భద్రపరిచిన ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. బుధవారం ఆయన భద్రతా ఏర్పాట్లు పరిశీలించి వివరాలు వెల్లడించారు. -
తిరువీధిలో అహోబిలేశుడు
[ 16-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. అహోబిలేశుడు విశేష అలంకృతుడై వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. -
అలసత్వం వీడండి.. నాడు-నేడు పూర్తి చేయండి
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కింద మొదలుపెట్టిన నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయి. మొదటి దశ పనులు 80 శాతం పూర్తయినప్పటికీ రెండో దశ పనులు మాత్రం 10 శాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. -
గెలుపే వారి గోల్
[ 16-05-2024]
క్రీడలపై ఆస్తి ఒక్కటే సరిపోదు.. నిత్యం సాధన చేయాలి. ఎంచుకున్న లక్ష్యం చేరుకోవాలనే తపనతో సాగాలి. ఆటలో గెలుపే కాదు.. గుర్తింపు ప్రధానమనే విషయం గుర్తించాలి. అవకాశాల కోసం ఎదురు చూడటం కాదు.. వెతుక్కుంటూ వెళ్లి అందుకోవాలి. -
ఫలితాలపై పందేల పోరు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల తంతు ముగియడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పందేలకు తెర లేసింది. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వ్యాపారులు మొదలుకొని యువకుల వరకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు కాస్తున్నారు. -
అనధికార నిల్వలు.. ఆదాయానికి తూట్లు
[ 16-05-2024]
కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని షెడ్లలో కొందరు వ్యాపారులు వాము బస్తాలను అనధికారికంగా నిల్వ చేసుకుంటున్నారు. వాటిని తరలించాల్సి ఉన్నా ఇక్కడే నిల్వ చేస్తున్నారు. -
ఆదర్శం.. సేవారూపం
[ 16-05-2024]
ఆయన ఓ సాధారణ కూలి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అయినా ఆయన కూలికెళ్లగా రోజు వచ్చే రూ.వందల్లో కొంతమొత్తాన్ని పదుగురి సంక్షేమానికి వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మూగజీవాల పట్ల ప్రేమను చూపుతూ నేనున్నానని... మీకేం కాదని భరోసా ఇస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు