ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే.
సాంకేతికంగా ఎంత పురోగమించినా వన్నె తగ్గని పుస్తకం
న్యూస్టుడే, మహబూబ్నగర్ సాంస్కృతికం: పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. పుస్తక పఠనంతో తమ జీవన గమనాన్ని మార్చుకున్నవారే. టీవీలు వచ్చినా, చరవాణి వినియోగం పెరిగినా, ఎన్ని సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నా పుస్తకాలకు ప్రత్యామ్నాయం కాబోవన్నది అందరూ అంగీకరించే నిజం. అందుకే సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని ఏనాడో చెప్పారు. పుస్తకాలతో ప్రభావితమై ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్లు ఎందరో ఉన్నారు. అనేక పుస్తకాలు సేకరిస్తూ తమ ఇంటిలోనే చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటున్నారు. ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ నేపథ్యంలో పలువురిని ‘న్యూస్టుడే’ పలకరించింది. పుస్తకాల ప్రాధాన్యం, వారిని ప్రభావితం చేసిన తీరు తదితర వివరాలన్నీ వారి మాటల్లోనే..
ఉన్నత స్థాయిలో నిలబెట్టింది.. : పుస్తకానికి మరణం లేదు.. బతుకు సౌందర్యాన్ని అద్దంలా చూపిస్తుంది. పుస్తకాలు చదివితే జీవిత అనుభవం వస్తుంది. 2016 నుంచి కథలు, కవిత్వం, నవలలు, సాహిత్య విమర్శకు సంబంధించిన పుస్తకాలు 400 వరకు సేకరించాను. జి.లక్ష్మీనర్సయ్య రచించిన ‘కవిత్వం - చర్చనీయాంశాలు’ పుస్తకం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నేను కవిత్వం, వ్యాసాలు రాయటానికి దోహదపడింది. జూకంటి జగన్నాథం, డా.ఎన్.గోపి, శివారెడ్డి, యాకూబ్ తదితరుల సాహిత్యాన్ని ఇష్టంగా చదువుతాను. జన జీవనానికి దగ్గరగా ఉండే రచనలను ఇష్టపడతాను. నా రచనలు తీరొక్క పువ్వు(నానీలు), దండ కడియం(కవితా సంపుటి), జల (మామిడి హరికృష్ణతో కవిత్వం ముచ్చట్లు) పుస్తకాలుగా వచ్చాయి. మరో రెండు సాహిత్య పుస్తకాలు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయి. నేను పనిచేసే వెల్దండ మండలం అజిలాపురం గ్రామ పాఠశాల విద్యార్థులు రాసిన ‘దేవగన్నేరు’ పుస్తకం త్వరలో ఆవిష్కరిస్తాం. నేను రాసిన ‘దండకడియం’ సంపుటికి 2021లో కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకున్నాను. పుస్తక పఠనమే నన్ను ఈ స్థాయిలో నిలిపింది.
తగుళ్ల గోపాల్, యువకవి, నాగర్కర్నూల్
పుస్తకాలు చదివి రచయితనయ్యా : నేను ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నా. రోజుకు 2 గంటలైనా ఏదో ఒక పుస్తకం చదువుతాను. పసునూరి రవీందర్ రాసిన ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ పుస్తకం సామాజిక దృక్కోణంలో నన్ను ఎంతో ప్రభావితం చేసింది. పుస్తకాలను బాగా చదవటం వల్లనే సాహిత్యంపై పట్టు వచ్చింది. కొన్నేళ్లుగా కవిత్వం, కథలు, నాటకాలు రాస్తున్నాను. ‘మరోకోణం’ కవితా సంపుటిని వెలువరించాను. త్వరలో కథల పుస్తకాన్ని ముద్రిస్తాను. శ్రీశ్రీ, రంగనాయకమ్మ, కేశవరెడ్డి, బుచ్చిబాబు, అలిశెట్టి ప్రభాకర్, పసునూరి రవీందర్, సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్ రచనలు నాకు ఎంతో ఇష్టం. సాహిత్యం, రాజనీతి, తాత్వికత, చరిత్రలు, సాహిత్య విమర్శకు సంబంధించి 150 వరకు పుస్తకాలు సేకరించాను. ఇంట్లో గదిని గ్రంథాలయంగా మార్చాను. హైదరాబాద్కు వెళ్లిన ప్రతీసారి పుస్తకాలు కొంటాను.
రాము పెరుమాళ్ల, యువకవి, ఊర్కొండ మండలం, మాదారం
మనసును కదిలిస్తుంది.. మనిషిని నడిపిస్తుంది : పుస్తకం మనసును కదిలిస్తుంది.. మనిషిని నడిపిస్తుంది. లోకంలో మంచి మిత్రుడు ఉండకపోవచ్చు. చెడు పుస్తకం మాత్రం ఉండదు. గురువులా వెలుగు పంచుతూ జ్ఞానాన్ని పెంచుతూ ముందుకు తీసుకెళ్తుంది. పదేళ్ల నుంచి పుస్తక పఠనం అభిరుచి ఉంది. పుస్తకాల కొనుగోలుకు చేసే ఖర్చు వృథా కాదు. 500 వరకు పుస్తకాలు సేకరించాను. నేను ప్రాచీన సాహిత్యంతో పాటు ఆధునిక సాహిత్యం పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. ఇటీవల ఎన్.గోపి రచించిన ‘వృద్ధోపనిషత్’ పుస్తకాన్ని చదివాను. ఇది జీవితాన్ని వడపోసింది. జీవిత చరమాంకంలో ఎలా ఉంటామో వివరించింది. కరుణ రసాత్మకమైన కవిత్వాన్ని అందులో చూడొచ్చు. అందరూ చదవాల్సిన పుస్తకం. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవాలి. సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా పుస్తకానికి విలువ తగ్గలేదు. పిల్లలకు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి.
పుట్టి గిరిధర్, కవి, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరుల స్థావరంపై పోలీసుల దాడి
[ 03-05-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో జూదరుల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. -
గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
[ 03-05-2024]
వడ్డేపల్లి మండలం రామాపురం, కొంకల గ్రామాల్లో భాజపా మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. -
సమీక్షలు.. వ్యూహ రచనలు
[ 03-05-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల బలాలు, బలహీనతలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. -
ఇంజినీరింగ్ కళాశాలకు సన్నాహాలు
[ 03-05-2024]
నిధుల కొరత, అసౌకర్యాలతో 16 ఏళ్లుగా కొట్టుమిట్టాడుతున్న పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఎం ఉష)కు ఎంపిక కావటంతో దశ మారనుంది. -
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: యెన్నం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాద్, తిర్మలగిరి, నాయినోనిపల్లి, పుల్పవానిపల్లి, చిన్నదర్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. -
మూడోసారి కేంద్రంలో భాజపానే
[ 03-05-2024]
దేశవ్యాప్తంగా భాజపా 400కు పైగా లోక్సభ స్థానాలు కైవసం చేసుకొని మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని కావడం ఖాయమని కేంద్ర ప్రసార, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు. -
భారత్లో ఓటు ప్రస్థానమిదీ..
[ 03-05-2024]
ఆంగ్లేయుల పాలనలో మండలాలను ఫిర్కాలుగా పిలిచేవారు. అప్పట్లో ఫిర్కాకు కార్కోన్ అనే హోదాలో ఓ ఉద్యోగి విధులు నిర్వహించేవారు. -
పన్ను రాయితీ సద్వినియోగం అంతంతే
[ 03-05-2024]
ఏడాది కాలానికి సంబంధించిన ఆస్తిపన్ను ఏకకాలంలో చెల్లిస్తే పొందే 5 శాతం రాయితీ వెసులుబాటును పురపాలికల్లోని వ్యాపారులు, ఇళ్ల యజమానుల్లో తక్కువ మందే వినియోగించుకున్నారు. -
పరివార్
[ 03-05-2024]
లోక్సభ స్థానంలో విజయం సాధించడం అత్యంత గౌరవప్రదంగా ప్రతి నాయకుడూ భావిస్తున్నారు. అందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు అహర్నిశలు కష్టపడుతున్నారు. -
ఓటింగ్ను అడ్డుకుంటే మూడేళ్ల జైలు
[ 03-05-2024]
పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో దుండగులు పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనంలోకి తీసుకొని ఓటింగ్ అడ్డుకోవడాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటారు. -
హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్కు కృషి : వంశీచంద్రెడ్డి
[ 03-05-2024]
హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్లోని కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ఓటమి భయంతో నీచ రాజకీయాలు: డీకే అరుణ
[ 03-05-2024]
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని భాజపా మహబూబ్నగర్ లోక్సభ స్థానం అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
మైనారిటీ విద్యార్థులకు 408 గురుకులాలు : మన్నె
[ 03-05-2024]
గత ప్రభుత్వాలు ముస్లింలను అన్ని రంగాల్లో విస్మరించారని, భారాస పదేళ్ల పాలనలో ప్రత్యేకంగా మైనార్టీలకు 408 గురుకులాలు నిర్మించామని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి: మల్లు రవి
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని అందుకే కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పార్టీ అభ్యర్థి మల్లు రవి కోరారు. -
ఆరు గ్యారంటీల అమలు ఏదీ: భాజపా
[ 03-05-2024]
కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి శూన్యమని నాగర్కర్నూల్ భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ విమర్శంచారు. గురువారం బావాయిపల్లి, తీగలపల్లి, జనుంపల్లి, కోడేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రాముడి పేరుతో రాజకీయాలా?
[ 03-05-2024]
భాజపా దిగజారుడు రాజకీయాలు చేస్తూ రాముని పేరుతో అక్షింతలు పంపిణీ చేసి ఓట్లు పొందాలనుకుంటోందని, కేసీఆర్కు మాత్రం ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కులేదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
మైకంలో ఆలినే కడతేర్చాడు
[ 03-05-2024]
ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను మద్యం తాగిన మైకంలో కత్తిపీటతో గొంతు కోసి దారణంగా హత మార్చిన సంఘటన గురువారం నాగర్కర్నూల్ మండలం వనపట్లలో చోటు చేసుకుంది. -
అవగాహన కల్పిస్తారా... మమ అనిపిస్తారా!
[ 03-05-2024]
ఏటా విద్యుదాఘాతానికి గురై పదుల సంఖ్యలో రైతులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలో 14 మందికి పైగా రైతులు, వినియోగదారులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
పురపాలికలపై సైబర్ నేరగాళ్ల నజర్
[ 03-05-2024]
సైబర్ నేరగాళ్లు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దిగారు. ట్రేడ్ లైసెన్సు ఫీజులు, లేబర్ ఛార్జీలు తగ్గిస్తామంటూ అక్రమాలకు తెర లేపారు. బడా వ్యాపారులతో పాటు కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణాదారులను మోసం చేస్తున్నారు. -
అడ్డూ అదుపు లేని ఇసుక మాఫియా
[ 03-05-2024]
రాత్రీపగలు తేడాలేకుండా వాగుల్లోంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, ఠాణా నుంచి ఒక కానిస్టేబుల్ను పర్యవేక్షణకు ఇన్ఛార్జిగా నియమించారు.. రవాణాదారులు వారిని గుప్పెట్లోకి పెట్టుకుంటున్నారు. -
ప్రజా దీవెనలతో విజయం: జూపల్లి
[ 03-05-2024]
నమ్మి వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం