కృష్ణానీటిపై జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందం : యెన్నం
కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, చిత్రంలో ఎన్పీ వెంకటేశ్, నాయకులు
పాలమూరు, న్యూస్టుడే : కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యం 9 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జగన్ తరలించుకుపోతున్నా.. నాడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని విమర్శించారు. కమీషన్ల కోసమే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి కాకుండా డిజైన్ మార్చి కృష్ణా తిరుగు జలాల వద్ద చేపట్టారని, అందుకే ఇప్పటికీ 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోకుండా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతోందన్నారు. జగన్కు వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని కృష్ణానీటిని తాకట్టు పెట్టారని, తద్వారా దిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన కేసీఆర్ రుణమాఫీపై మాట్లాడారని, 2018లో భారాస మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి విడతలో రూ.25వేలు మాత్రమే రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయని కేసీఆర్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అవుతున్నా.. విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తే తమ ప్రభుత్వం వాటిని గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పాత బకాయిలు తీర్చుకుంటూ, ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలను అందిస్తున్నామని, ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎన్పీ వెంకటేశ్, చంద్రకుమార్ గౌడ్, అబ్దుల్ సిరాజ్ఖాద్రి, లక్ష్మణ్యాదవ్, రాములు యాదవ్, బెనహర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలానగర్ వద్ద రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
[ 11-05-2024]
జిల్లాలోని బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. -
భాజపాలో కొత్త జోష్
[ 11-05-2024]
సభకు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసుశాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో సభ సాఫీగా ముగిసిపోయింది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాహనాలను అక్కడి సమీపంలో పార్కింగ్ చేయించడం, ట్రాఫిక్ ఆంక్షల మూలంగా సభ సజావుగా ముగిసింది. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
పాలమూరులో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెర పడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివీ.
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు
[ 11-05-2024]
చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. -
ఏ అభ్యర్థి ఓటు ఎక్కడ..?
[ 11-05-2024]
పార్లమెంట్కు దేశంలోని ఏ లోక్సభ స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలిసిందే. నియోజకవర్గంలోనే ఓటు ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. -
ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందాం: చల్లా
[ 11-05-2024]
స్థానికుడైన ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
భాజపాపై కాంగ్రెస్, భారాస విష ప్రచారం తగదు
[ 11-05-2024]
రిజర్వేషన్లను మార్చే హక్కు, అధికారం ఏ పార్టీలకు లేదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో భాజపా నిర్ణయం స్థిరంగా ఉన్నదని స్పష్టం చేశారు. -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
[ 11-05-2024]
నాగర్కర్నూల్, షాద్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. -
ఓటు సద్వినియోగంతోనే సమస్యలకు పరిష్కారం
[ 11-05-2024]
బల్మూర్ మండలంలో చేపట్టనున్న శ్రీ ఉమామహేశ్వర జలాశయంతో బలహీన వర్గాల ప్రజలు అధికంగా భూములను కోల్పోతున్నారని బాధితులు ఆందోళన బాట బట్టారు. -
మద్యం రేషన్కు గేట్లెత్తారు !
[ 11-05-2024]
నిన్నటివరకు రేషన్ పద్ధతిన సరఫరా చేసిన మద్యానికి శుక్రవారం ఒక్కరోజు గేట్లెత్తేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ. 25 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు