అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు.
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తలకు టోపీలు, రుమాలు చుట్టుకోవాలని, గొడుగులు వినియోగించాలని పేర్కొన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు కనీసం ఐదు లీటర్ల మంచినీటిని తాగాలన్నారు. ప్రయాణాలు తెల్లవారుజామున ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. నలుపు, ముదురు రంగు, మందంగా ఉండే దుస్తులు కాకుండా, తెలుపు, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురైతే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు. ఆయా కేంద్రాల్లో చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు నీడ కల్పించడమే కాక తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
ద్యాగదొడ్డిలో 44.2 డిగ్రీల నమోదు
రాజోలి, న్యూస్టుడే: జిల్లాలో సూరీడు మండిపోతున్నాడు. ఈ సీజన్లోనే అత్యధికంగా ధరూర్ మండలం ద్యాగదొడ్డిలో శనివారం 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజంతా తీవ్రమైన వడగాల్పులు వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లల్లో ఉన్న వారు సైతం ఉక్కపోతతో అల్లాడారు. గట్టు మండలకేంద్రంలో 43.4, గద్వాల పట్టణంలో 43.3, రాజోలి, కేటీదొడ్డిలో 43.1, ఇటిక్యాల మండలం కొదండాపురం, వడ్డేపల్లి, అయిజలో 42.8, మల్దకల్లో 42.4, అలంపూర్లో 42.3 సెల్సియస్ డిగ్రీలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 41 డిగ్రీలకు పైఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలానగర్ వద్ద రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
[ 11-05-2024]
జిల్లాలోని బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. -
భాజపాలో కొత్త జోష్
[ 11-05-2024]
సభకు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసుశాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో సభ సాఫీగా ముగిసిపోయింది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాహనాలను అక్కడి సమీపంలో పార్కింగ్ చేయించడం, ట్రాఫిక్ ఆంక్షల మూలంగా సభ సజావుగా ముగిసింది. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
పాలమూరులో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెర పడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివీ.
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు
[ 11-05-2024]
చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. -
ఏ అభ్యర్థి ఓటు ఎక్కడ..?
[ 11-05-2024]
పార్లమెంట్కు దేశంలోని ఏ లోక్సభ స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలిసిందే. నియోజకవర్గంలోనే ఓటు ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. -
ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందాం: చల్లా
[ 11-05-2024]
స్థానికుడైన ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
భాజపాపై కాంగ్రెస్, భారాస విష ప్రచారం తగదు
[ 11-05-2024]
రిజర్వేషన్లను మార్చే హక్కు, అధికారం ఏ పార్టీలకు లేదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో భాజపా నిర్ణయం స్థిరంగా ఉన్నదని స్పష్టం చేశారు. -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
[ 11-05-2024]
నాగర్కర్నూల్, షాద్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. -
ఓటు సద్వినియోగంతోనే సమస్యలకు పరిష్కారం
[ 11-05-2024]
బల్మూర్ మండలంలో చేపట్టనున్న శ్రీ ఉమామహేశ్వర జలాశయంతో బలహీన వర్గాల ప్రజలు అధికంగా భూములను కోల్పోతున్నారని బాధితులు ఆందోళన బాట బట్టారు. -
మద్యం రేషన్కు గేట్లెత్తారు !
[ 11-05-2024]
నిన్నటివరకు రేషన్ పద్ధతిన సరఫరా చేసిన మద్యానికి శుక్రవారం ఒక్కరోజు గేట్లెత్తేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ. 25 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా