వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు.
పంటల విస్తీర్ణం పెరుగుతుందని అంచనా
ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు
వనపర్తిలోని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ గోదాంలో సిద్ధంగా ఉన్న వరి విత్తనాలు
న్యూస్టుడే, మహబూబ్నగర్ వ్యవసాయం: వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. సాధారణ వర్షాలు పడితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18.46 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తారు. ఈ ఏడాది కూడా ఇంచు మించు అంతే విస్తీర్ణంలో సాగు కానుందని అంచనా వేశారు. గతేడాది వర్షాలు అనుకూలించక 15.59 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. గతేడాది పత్తి సాగు పడిపోయింది. కంది, మొక్కజొన్న వంటి పంటలు రైతుల చేతికి అందలేదు. వరి మాత్రం సగటుకు మించి సాగైంది. ఈ ఏడాది కంది, పత్తి, జొన్న పంటల సాగు పెరగనుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ నుంచి రైతులకు విత్తనాలు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్క్ఫెడ్, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఎరువులు అందించేలా చర్యలు చేపట్టారు.
క్షేత్రస్థాయి పరిస్థితి ఇది : ఏటా మాదిరే ఈ ఏడాది పచ్చిరొట్ట ఎరువులు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇంకా రాయితీ ధరలు నిర్ణయించలేదు. గతేడాది జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలను 5వేల క్వింటాళ్ల వరకు పంపిణీ చేసింది. ఒకటి, రెండు రోజుల్లో రాయితీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
- ఉమ్మడి జిల్లాలో 9.18 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 ఎకరాల్లో కంది, 2.12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేసే వీలుంది. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ వీటిని అందించటం లేదు. రైతులందరూ ప్రైవేటు వ్యాపారుల వద్దే కొనుగోలు చేయాల్సి వస్తోంది.
- ఐదేళ్ల క్రితం రద్దు చేసిన రాయితీ విత్తనాల పంపిణీ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని చాలా మంది రైతులు ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
- ఉమ్మడి జిల్లాలోని మార్క్ఫెడ్, ప్రైవేటు వ్యాపారుల వద్ద 2.23 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో కాంప్లెక్స్, డీఏపీ, పొటాష్, యూరియా వంటి ఎరువులు ఉన్నాయి. వీటిని ముందుగానే మండల కేంద్రాల్లోని గోదాములకు తరలించనున్నారు.
రాయితీపై పచ్చిరొట్ట ఎరువులు : వచ్చే నెల మొదటి వారంలో రైతులకు 65 శాతం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన రైతులు మండల కేంద్రాల్లోని ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయొచ్చు. కంది, పెసర తదితర విత్తనాలు ఇతర జిల్లాల నుంచి తెప్పించాలని ఆలోచిస్తున్నాం.
రాజీవ్, ఉమ్మడి జిల్లా డీఎం, విత్తనాభివృద్ధి సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ పోరు.. మారని తీరు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికపై పాలమూరు ఓటర్ల ఆసక్తి తగ్గుది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుది. -
స్ట్రాంగ్రూంలకు చేరిన ఈవీఎంలు
[ 15-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను పాలమూరు వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో మంగళవారం భద్రపరిచారు. -
పీయూ ఉపకులపతి పదవికి తీవ్ర పోటీ
[ 15-05-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి(వీసీ) పోస్టుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దరఖాస్తులు అందిన వర్సిటీల్లో పీయూ మూడో స్థానంలో ఉంది. -
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : డీకే అరుణ
[ 15-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె భాజపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
అలసి.. సొలసి.. సేదదీరి!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నుంచి క్షణం తీరిక లేకుండా గడిపిన ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు మంగళవారం కాస్త తీరికగా కనిపించారు. -
ఇన్నాళ్లు కళకళ.. నేడు వెలవెల
[ 15-05-2024]
తెలంగాణలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల రోజులుగా మహబూబ్నగర్లో సందడి నెలకొన్న ప్రధాన పార్టీల కార్యాలయాలు మంగళవారం బోసిపోయి కనిపించాయి. -
ఎన్నికల సిబ్బంది ప్రయాణ కష్టాలు
[ 15-05-2024]
ఎన్నికల సిబ్బంది పోలింగ్ అనంతరం ఇళ్లకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి ఈవీఎంలు, ఇతర సామగ్రి తీసుకొని వచ్చి అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అప్పగించారు. -
మట్టి పాత్రలకు మంచిరోజులు
[ 15-05-2024]
కరోనా తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యం పట్ల జనానికి స్పృహ పెరిగింది. అందులో భాగంగా అల్యూమినియం, స్టీల్పాత్రలు వంటలకు ఉపయోగించడం మానుకొని మట్టి పాత్రలు వాడేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 15-05-2024]
మద్యం దుకాణం నిర్వాహకులు చేసిన దాడిలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. -
తీరని సాగునీటి గోస
[ 15-05-2024]
యాసంగి సీజన్లో సాగు నీటి సమస్య ఏళ్లుగా వేధిస్తోంది. సింగోటం జలాశయం నుంచి గోపల్దిన్నె జలాశయానికి లింకు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తేనే సాగునీటి సమస్య తీరనుంది. -
భారాస కౌన్సిలర్ కుటుంబంపై దాడి
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం మొదలైన వివాదం రాజకీయంగా దాడులకు తెరలేపింది. -
పుస్తకాలొచ్చాయ్.. వస్త్రమే రాలె
[ 15-05-2024]
రాబోయే విద్యా సంవత్సరానికి ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చాయి. తొలివిడత ఇప్పటికే 20 శాతం మేరకు పుస్తకాలు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ గోదాముకు చేరాయి. -
పురాల్లో పన్ను బాదుడు
[ 15-05-2024]
పురపాలక సంఘాల్లో పన్ను బాదుడు మొదలైంది. కొత్త పురపాలక చట్టం 2019 ప్రకారం నమోదు చేయడంతో పన్ను దారులు లబోదిబోమంటున్నారు. -
వాళ్లమ్మిందే మందు!
[ 15-05-2024]
జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెడికల్ దుకాణాల వారిదే ఇష్టారాజ్యమవుతోంది. -
ఆరు బూత్లలో 50 శాతం లోపే పోలింగ్
[ 15-05-2024]
నాగర్ కర్నూల్ లోకసభ స్థానం పరిధిలోని గద్వాల పురపాలక సంఘంలో అతి తక్కువగా పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు వెలుగుచూడటంపై ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
5.3 లక్షల మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో 5.30 లక్షల మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. ఈ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా..
తాజా వార్తలు (Latest News)
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
-
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
-
నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు