logo

ఏడు నామినేషన్ల దాఖలు

మెదక్‌ లోక్‌సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్‌, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్‌గారి సునీల్‌ నామపత్రాలను దాఖలు చేశారు.

Published : 23 Apr 2024 01:59 IST

నామినేషన్‌ వేస్తున్న తెలంగాణ రాజ్య సమితి అభ్యర్థి  మురళీకాంత్‌, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి సునీల్‌

మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ లోక్‌సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్‌, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్‌గారి సునీల్‌ నామపత్రాలను దాఖలు చేశారు. శ్రీశైలం, పృథ్విరాజ్‌, వరికోలు శ్రీనివాస్‌, కుమార్‌, కమ్మరి లక్ష్మినారాయణ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేశారు. ఇప్పటికే భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌ వేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు తరఫున మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు నామపత్రం దాఖలు చేసిన సంగతి విధితమే. నామినేషన్‌ దాఖలుకు ఈనెల 25 వరకు అవకాశం ఉంది. 24న భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ వేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు దాఖలైన నామపత్రాల సంఖ్య 25కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని