అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
జహీరాబాద్ బరిలో 19 మంది..
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు: జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించగా.. 40 మంది 68 సెట్లు దాఖలు చేశారు. పరిశీలన ప్రక్రియలో 14 మందికి చెందిన 19 సెట్లు తిరస్కరించారు. 26 మంది అభ్యర్థుల నామపత్రాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. బరిలో ఉన్న వారిలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆరుగురు, మిగతా పది మంది స్వతంత్రులు. అభ్యర్థుల సంఖ్య 15 దాటడంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఈవీఎంలో నోటాతో కలిపి 16 గుర్తులు ఉంటాయి. ఓటర్లు రెండు ఈవీఎంలను పరిశీలించి.. నచ్చిన అభ్యర్థికి చెందిన మీట నొక్కనున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థుల నేపథ్యం
గాలి అనిల్కుమార్: భారాస
2009లో భారాస (తెరాస) పటాన్చెరు ఇన్ఛార్జిగా ఉన్నారు. 2014లోటికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్లో చేరి.. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ రాకపోవడంతో తిరిగి భారాస గూటికి చేరారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
బీబీ పాటిల్: భాజపా
స్వగ్రామం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్. జహీరాబాద్ నుంచి రెండు పర్యాయాలు (2014, 2019లో) భారాస అభ్యర్థిగా పోటీ చేసి ఎంపిగా గెలుపొందారు. ఇటీవల భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా నుంచి పోటీ¨లో ఉన్నారు.
సురేష్ కుమార్ షెట్కార్: కాంగ్రెస్
2004లో ఖేడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి ఎంపీగా విజయం సాధించారు. 2014లో జహీరాబాద్ ఎంపీగా, 2018లో నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మెదక్ పోరులో 44 మంది..
మెదక్, న్యూస్టుడే: మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు తలపడుతున్న నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే మెదక్ ద్వితీయ స్థానంలో ఉంది. ఇందులో గుర్తింపు, రిజిస్టర్ పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. 29 మంది స్వతంత్రులు బరిలో నిలిచాయి. అత్యధిక మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో పోలింగ్ రోజున ఓటు వేసేందుకు మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరమరమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీలు రాక.. తూకం వేయక
[ 16-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. కేంద్రాల్లో తూకం వేశాక, రోజుల తరబడి వడ్లను మిల్లులకు తరలించకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. -
వడ్లు తరలించాలని ధర్నా
[ 16-05-2024]
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, తరలించాలని డిమాండ్ చేస్తూ చిట్కుల్లో బుధవారం రైతులు రోడ్డెక్కారు. -
నిధులున్నా నిస్తేజం
[ 16-05-2024]
ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ఇందుకోసం నిధులు విడుదల చేసినా, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
ఫలితాలపై జోరుగా పందేలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే కేంద్రీకృతమైంది. -
తరలిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ..
[ 16-05-2024]
జిల్లా కేంద్రం మెదక్ పట్టణానికి మంజూరైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆరేళ్లలో మూడు ప్రాంతాలకు మార్చారు. -
అప్రమత్తతే శరణ్యం.. ఆరోగ్యం సంపూర్ణం
[ 16-05-2024]
నిలువ, మురుగు నీరు ఆవాసంగా దోమలు పెరుగుతాయి. పూలకుండీలు, కూలర్లు, తాగి, వాడి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లలో ఆవాసం ఏర్పర్చుకొని పగటిపూట దోమలు కాటేస్తాయి. ఫలితంగా తీవ్రమైన కండరాల నొప్పి, వికారం, జ్వరం, కళ్లు ఎర్రబారటం లక్షణాలతో బాధపడుతుంటారు. -
ఫలితమిచ్చే చుక్క.. 37.110 లీటర్ల వినియోగం ఎంచక్కా!
[ 16-05-2024]
వేలిపై చుక్క.. ఫలితం ఇచ్చును ఎంచక్కా.. అనుకుంటూ.. ఈ నెల 13న రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు వరుస కట్టి హక్కు వినియోగించుకున్నారు. -
వేతన బకాయిలు కావాలని కార్మికుడి నిరసన
[ 16-05-2024]
వేతన బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో బుధవారం కార్మికుడు చిమ్నీ (పొగ గొట్టం) ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. -
కారు ఢీకొని భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
[ 16-05-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద (కొండాపురం మలుపు రోడ్డు) భువనగిరి-గజ్వేల్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. -
జాతీయ రహదారి విస్తరణ పనులు షురూ
[ 16-05-2024]
తెలంగాణ-కర్ణాటకలను అనుసంధానిస్తూ 161బి నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. -
పెరుగుతున్న ఖర్చులు.. తగ్గుతున్న రాబడి
[ 16-05-2024]
ప్రజలకు ఆనందాన్ని పంచుతున్న సినిమా థియేటర్లకు కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా పరిస్థితులకు ముందు ప్రేక్షకులతో కిటకిటలాడిన సినిమా హాళ్లు ప్రస్తుతం కళ తప్పాయి. -
పెట్రోల్లో నీళ్లు వచ్చాయని ఆందోళన
[ 16-05-2024]
ములుగు పెట్రోల్ బంక్లో తరచూ నీళ్లు వస్తున్నాయని బుధవారం వినియోగదారులు ఆందోళనకు దిగారు. ములుగుకు చెందిన తోడేటి వెంకటస్వామి తన ద్విచక్ర వాహనంలో ములుగు గ్రామంలో ఉన్న బంకులో పెట్రోలు పోయించుకున్నాడు. -
అందని వస్త్రం.. అందేనా ఏకరూపం
[ 16-05-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ప్రభుత్వమే ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తుంది. అందుకు ముందు నుంచి ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు. -
అధిక లాభాలతో బురిడీ
[ 16-05-2024]
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.1.98 లక్షలు కాజేసిన ఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.