ఇటు రచన.. అటు బోధన
పాఠ్యపుస్తకాల రచనలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ సంస్థ 2019లో నిర్వహించిన బాలసాహిత్య కార్యశాలల్లో పాల్గొని ‘తెలుగు మహిళలు- స్ఫూర్తి ప్రదాతలు’ అనే పుస్తకాన్ని రాశాను.
పాఠ్య పుస్తకాల రూపకల్పనలో జిల్లా ఉపాధ్యాయినులు
- చిట్యాల, న్యూస్టుడే
ఓ పక్క తరగతి గదిలో పాఠాలు చెప్తూ... మరోపక్క పాఠ్యాంశాల రూపకల్పనలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాళ్లు భాగస్వాములవుతున్నారు. గదుల్లో పిల్లల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి, ఆ కోణంలో ఆలోచిస్తూ అందుగు తగ్గట్టుగా వారు కూడా నిత్యవిద్యార్థులై విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయురాళ్ల మనోభావాలివి....
పుస్తక రచనలో పాల్గొనడం ఆనందంగా ఉంది
- ఉప్పల పద్మ, జడ్పీ బాలిక ఉన్నతపాఠశాల, మిర్యాలగూడ
పాఠ్యపుస్తకాల రచనలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ సంస్థ 2019లో నిర్వహించిన బాలసాహిత్య కార్యశాలల్లో పాల్గొని ‘తెలుగు మహిళలు- స్ఫూర్తి ప్రదాతలు’ అనే పుస్తకాన్ని రాశాను. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల కోసం తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో రూపొందించనున్న ‘సరళ తెలుగువాచకం’ రచయిత బృందంలో పొడుపు కథల రూపకల్పన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్య పరిచేందుకు యునిసెఫ్ వారి అభ్యర్థన మేరకు ‘చిన్నవయసులో పెళ్లిల్లు వద్దు’, ‘పిల్లలు ఉండాల్సింది బడిలోనే’ అనే రెండు నాటికలు రాశాను. ఉపాధ్యాయురాలిగా విద్యార్థులు ఆసక్తి కనబరిచే అంశాలపై అవగాహన ఉండటంతో పాఠ్యాంశాల రచన నాకు సులభతరమయ్యింది.
రచయితగా అవకాశం గొప్ప అనుభూతి
వురిమళ్ల సునంద (సూర్యాపేట వాసి, ప్రస్తుతం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం, కలకోట జడ్పీహెచ్ఎస్)
2007లో రాష్ట్ర వ్యాప్తంగా బాలసాహిత్య రూపకల్పనలో ఖమ్మం జిల్లాలోని ఎడిటోరియల్ బోర్డులో పనిచేశాను. 2014లో 1-5 తరగతులకు పాఠ్యపుస్తక రచనలో పాల్గొన్నాను. వర్ణమాలు నేర్పించడం కోసం నేను రాసిన గేయాలు ఎంపిక కావడం, కథలు సరళంగా చేసి రాయడం ఆనందాన్ని ఇచ్చింది. తెలుగు వాచకంలో రచయిత్రిగా నాపేరు చూసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. దూరవిద్య విద్యార్థులకు పుస్తక రచనలో, క్యూఆర్ కోడ్ పాఠాల రూపకల్పనలోనూ భాగస్వామిని అయ్యాను. రిసోర్స్ పర్సన్గా ఎన్నో మాడ్యూల్స్ చదవడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటివి పాఠ్య పుస్తక రూపకల్పనలో నాకు ఉపయోగపడ్డాయి.
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి...
- డా.బండారు సుజాత, జడ్పీహెచ్ఎస్ గుజ్జ, యాదాద్రి భువనగిరి జిల్లా
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగు పుస్తక రచనలో పాల్గొన్నాను. 2009-17లో ఓపెన్ స్కూల్ బ్రిడ్జి కోర్సులు, హేండ్ బుక్స్, మాడ్యూల్స్, కథలు రచనలో భాగస్వామినయ్యాను. 2012-14లో 1-5, 2015లో 1-3 తరగతుల తెలుగు పుస్తకాల రూపకల్పనలో పాల్గొన్నాను. 2010-22లో 3,5,7,8 తరగతుల దూర విద్య విద్యార్థులకు తెలుగు అధ్యయన సామగ్రి తయారీలో పాల్గొన్నాను. విద్యార్థుల కోసం రూపుదిద్దుకునే ఈ క్రతువులో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!