మాదిగల ఐక్యతకు త్వరలో పర్యటన
ఇటీవల భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ దళితబంధు పథకం గురించి ప్రసంగిస్తూ మాదిగలు, మాదిగ ఉపకులాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
తిరుమలగిరిలో విపక్ష నాయకులతో కలిసి అభివాదం చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
తిరుమలగిరి, న్యూస్టుడే: ఇటీవల భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ దళితబంధు పథకం గురించి ప్రసంగిస్తూ మాదిగలు, మాదిగ ఉపకులాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తిరుమలగిరిలోని వంగపల్లి నర్సయ్య ఫంక్షన్హాల్లో శనివారం ఏర్పాటుచేసిన విపక్షాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పనట్లయితే తుంగతుర్తి టికెట్ నిరాకరిస్తారా అని ప్రశ్నించారు. ఒకవేళ టికెట్ ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా భారాసకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపిన ఎమ్మార్పీఎస్, విపక్షాలను పోలీసులతో నిర్బధించడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లు భావించాల్సి వస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల అనుచరులను పార్టీకి దూరం పెట్టాలని డిమాండ్ చేశారు. తుంగతుర్తిలో అధికార పార్టీ వారిని ప్రశ్నిస్తే భౌతికదాడులు, క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వ్ శాసనసభ నియోజకవర్గ స్థానాల్లో 85 శాతం మాదిగలు, ఉపకులాలున్న చోట ఏ పార్టీ అయినా మాదిగ అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని అన్ని పార్టీల ముఖ్యులను కోరనున్నట్లు తెలిపారు. అలా కాకుండా మాలలకు ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మాదిగల ఐక్యత కోసం త్వరలో నియోజకవర్గంలో ఐదు రోజుల పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. సమావేశంలో భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జి కడియం రాంచంద్రయ్య, వైతెపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న, సీపీఎం నాయకుడు కడెం లింగయ్య, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమన్న, కందుకూరి శ్రీను, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంబేడ్కర్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
[ 14-05-2024]
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. -
స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 14-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్స్లను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. -
ఓటే వజ్రాయుధమనె.. ప్రజాస్వామ్యానిదే విజయమనె..!
[ 14-05-2024]
నల్గొండ, భువనగిరి రెండు లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ అంకం సోమవారం ప్రశాంతంగా ముగిసింది. -
సిరా చుక్కలో.. భవిష్యత్తు లెక్క..!
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18వ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా, పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఎన్నికల సంఘం వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్ది ఆహ్వానించింది. -
ఓటు విలువ గుర్తించి.. ఖండాలు దాటొచ్చి
[ 14-05-2024]
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే.. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సంధించాల్సిందే. వజ్రాయుధం లాంటి ఓటుహక్కు వినియోగించడానికి విదేశాల నుంచి వచ్చారు.. పలువురు ఓటర్లు. -
టెండర్ ఓటు వేసిన దంపతులు
[ 14-05-2024]
తమ ఓటును ఇది వరకే వేరొకరు వేయడంతో దంపతులు అవాక్కయిన ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన ఇక్కె లక్ష్మీనారాయణ, ఉమారాణి దంపతులు లోక్సభ ఎన్నికల్లో -
ఈవీఎంల మొరాయింపు.. ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
శాసనసభ ఎన్నికల వేళ ఓటర్లలో, నాయకుల్లో, అభ్యర్థుల్లో కనిపించిన ఉత్సాహం లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జనగామ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గింది. -
ఇటు ఖాళీగా.. అటు నిండుగా
[ 14-05-2024]
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. నిన్నటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేలాది వాహనాలు బారులు తీరాయి. -
వెబ్కాస్టింగ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తీరును కలెక్టరేట్లోని కంట్రోల్రూం ద్వారా అధికారులు పర్యవేక్షించారు. -
ఫలించిన ఎన్నికల ప్రణాళిక
[ 14-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎస్సెల్బీసీ ఎప్పటికి పూర్తయ్యేనో..!
[ 14-05-2024]
ఎన్నికలు ఏవైనా సరే.. లోక్సభ కావొచ్చు.. అసెంబ్లీ కావొచ్చు.. గత నాలుగు దశాబ్దాలుగా మారుమూల దేవరకొండ గిరిజన ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీల నినాదం ఎస్సెల్బీసీ సొరంగం నిర్మాణం పూర్తిపైనే. -
అభివృద్ధి చేసే నాయకులను వదులుకోవద్దు: ఎంపీ ఉత్తమ్
[ 14-05-2024]
ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అమ్యూలమైన ఓటుహక్కును వినియోగించుకున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా చిన్న ఘటన జరగకుండా లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
పరిశీలించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. -
ఇచ్చిందే కొసరంత.. అందులోనే కోత..!
[ 14-05-2024]
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు, మద్యం పంపిణీ చేస్తుంటారు. -
బందోబస్తును పర్యవేక్షించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. -
తప్పిన పెను ప్రమాదం
[ 14-05-2024]
ఆలేరులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు