ప్రసవాలకు వసతులు మెరుగు
గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు, సాధారణ కాన్పులు అధికంగా జరిగేలా ప్రోత్సహిస్తున్న మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘లక్ష్య’ (లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్) పథకం కింద ఎంపిక చేసింది.
‘లక్ష్య‘ పథకం కింద మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి ఎంపిక
మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి
మిర్యాలగూడ, న్యూస్టుడే: గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు, సాధారణ కాన్పులు అధికంగా జరిగేలా ప్రోత్సహిస్తున్న మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘లక్ష్య’ (లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్) పథకం కింద ఎంపిక చేసింది. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు ఆసుపత్రులను ఎంపిక చేయగా అందులో ఉమ్మడి జిల్లా నుంచి మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి మాత్రమే ఉంది. మిగతావి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆసుపత్రి, హైదరాబాద్లోని ఓ ఆసుపత్రి ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27న కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఈ ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించాయి. నలుగురు సభ్యుల బృందం ప్రత్యేకంగా మిర్యాలగూడ ఆసుపత్రిని సందర్శించింది. వసతులు, రోగులకు ప్రత్యేకించి గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు బృందం సభ్యులు పరిశీలించారు. గతంలో సాధారణ కాన్పులు, సిజేరియన్ల వివరాలు సేకరించి మార్కులు వేశారు. వీటి ఆధారంగా మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి ‘లక్ష్య’ పథకం కింద ఎంపికైంది.
మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రస్తుతం వంద పడకలు ఉండగా స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో మరో వంద పడకలుగా విస్తరిస్తున్నారు. దీనికి రూ.14 కోట్లు వెచ్చిస్తున్నారు. మూడేళ్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస సమరధ్ వైద్యులు, సిబ్బందిని సమన్వయం చేసి ప్రసవాల సంఖ్య పెంచారు. నిత్యం ఆసుపత్రికి 500 మందికి పైగా బయటి రోగులు (ఓపీ) వస్తున్నారు. 150 మంది వరకు రోగులు (ఐపీ) ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 24 గంటల పాటు వైద్యం విషయంలో వైద్యులు క్రమశిక్షణతో పనిచేస్తుండగా ప్రసవాల సంఖ్యతో పాటు సాధారణ వైద్య చికిత్సలు, కంటి ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు మెరుగుపడ్డాయి. అత్యవసర సమయంలో వైద్యసేవలు మెరుగ్గా అందిస్తుండగా అన్నింటిని పరిశీలించి కేంద్ర బృందం మిర్యాలగూడ ఆసుపత్రిని ఎంపిక చేసింది.
ప్రయోజనాలు ఇవీ..
లక్ష్య పథకాన్ని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ 2017లో ప్రారంభించింది. అత్యధికంగా ప్రసవాలు జరిగే ఆసుపత్రులు, మెరుగైన వైద్యసేవలు అందించే ఆసుపత్రులను గుర్తించి వాటిలో ప్రసవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేయనున్నారు. ఈ నిధులతో మెరుగైన ప్రసవం గదులు, సిజేరియన్ చేసేందుకు ఆపరేషన్ థియేటర్, గర్భిణులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రసవించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రసవం తరువాత శిశువు, తల్లికి మంచి వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రసవానికి వచ్చే గర్భిణులు ప్రశాంతంగా ఉండేలా వసతులు కల్పించటంతో పాటు స్వాంతన చెందేలా వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిశువు పుట్టిన గంటలోపు తల్లి పాలు తాగించేలా ప్రత్యేక పర్యవేక్షణ పెంచనున్నారు.
‘లక్ష్యా’నికి అనుగుణంగా వైద్యసేవలు మెరుగు
డాక్టర్ శ్రీనివాస సమరధ్, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్
కేంద్ర బృందం పరిశీలన సమయంలో ఆసుపత్రిలో వైద్యసేవల వివరాలు సేకరించారు. ఇక్కడికి వచ్చే గర్భిణుల సంఖ్యకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలు కల్పిస్తే మరింత మెరుగైన సేవలు అందిస్తామని వైద్యులుగా హామీ ఇచ్చాం. దీంతో లక్ష్య పథకం కింద ఎంపిక చేశారు. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సమన్వయంతో పనిచేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఎంపికైన నాలుగు ఆసుపత్రుల్లో మా ఆసుపత్రి ఉండటం మాకు సంతోషంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
[ 14-05-2024]
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. -
స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 14-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్స్లను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. -
ఓటే వజ్రాయుధమనె.. ప్రజాస్వామ్యానిదే విజయమనె..!
[ 14-05-2024]
నల్గొండ, భువనగిరి రెండు లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ అంకం సోమవారం ప్రశాంతంగా ముగిసింది. -
సిరా చుక్కలో.. భవిష్యత్తు లెక్క..!
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18వ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా, పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఎన్నికల సంఘం వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్ది ఆహ్వానించింది. -
ఓటు విలువ గుర్తించి.. ఖండాలు దాటొచ్చి
[ 14-05-2024]
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే.. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సంధించాల్సిందే. వజ్రాయుధం లాంటి ఓటుహక్కు వినియోగించడానికి విదేశాల నుంచి వచ్చారు.. పలువురు ఓటర్లు. -
టెండర్ ఓటు వేసిన దంపతులు
[ 14-05-2024]
తమ ఓటును ఇది వరకే వేరొకరు వేయడంతో దంపతులు అవాక్కయిన ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన ఇక్కె లక్ష్మీనారాయణ, ఉమారాణి దంపతులు లోక్సభ ఎన్నికల్లో -
ఈవీఎంల మొరాయింపు.. ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
శాసనసభ ఎన్నికల వేళ ఓటర్లలో, నాయకుల్లో, అభ్యర్థుల్లో కనిపించిన ఉత్సాహం లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జనగామ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గింది. -
ఇటు ఖాళీగా.. అటు నిండుగా
[ 14-05-2024]
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. నిన్నటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేలాది వాహనాలు బారులు తీరాయి. -
వెబ్కాస్టింగ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తీరును కలెక్టరేట్లోని కంట్రోల్రూం ద్వారా అధికారులు పర్యవేక్షించారు. -
ఫలించిన ఎన్నికల ప్రణాళిక
[ 14-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎస్సెల్బీసీ ఎప్పటికి పూర్తయ్యేనో..!
[ 14-05-2024]
ఎన్నికలు ఏవైనా సరే.. లోక్సభ కావొచ్చు.. అసెంబ్లీ కావొచ్చు.. గత నాలుగు దశాబ్దాలుగా మారుమూల దేవరకొండ గిరిజన ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీల నినాదం ఎస్సెల్బీసీ సొరంగం నిర్మాణం పూర్తిపైనే. -
అభివృద్ధి చేసే నాయకులను వదులుకోవద్దు: ఎంపీ ఉత్తమ్
[ 14-05-2024]
ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అమ్యూలమైన ఓటుహక్కును వినియోగించుకున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా చిన్న ఘటన జరగకుండా లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
పరిశీలించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. -
ఇచ్చిందే కొసరంత.. అందులోనే కోత..!
[ 14-05-2024]
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు, మద్యం పంపిణీ చేస్తుంటారు. -
బందోబస్తును పర్యవేక్షించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. -
తప్పిన పెను ప్రమాదం
[ 14-05-2024]
ఆలేరులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు