Teacher: కన్నీటి వీడ్కోలుతో.. సారూ..సారూ.. అంటూ వెక్కివెక్కి ఏడ్చారు!
సారూ..సారూ.. అంటూ వెక్కివెక్కి ఏడ్చారు. తమను రోజూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించే సారు ఇక లేరని తెలుసుకున్న పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన నకిరేకల్లో మంగళవారం చోటు చేసుకుంది.
రోదిస్తున్న విద్యార్థులు
నకిరేకల్, న్యూస్టుడే: సారూ..సారూ.. అంటూ వెక్కివెక్కి ఏడ్చారు. తమను రోజూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించే సారు ఇక లేరని తెలుసుకున్న పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన నకిరేకల్లో మంగళవారం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పుర కార్యాలయం వద్ద ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బచ్చుపల్లి శ్రీనివాసరావు(50) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. అంత్యక్రియలు మంగళవారం నకిరేకల్లో నిర్వహించారు. ఐదేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఆ ఉపాధ్యాయుడంటే విద్యార్థులకు చాలా అభిమానం. కోపగించుకోకుండా పిల్లలను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తూ పాఠాలు బోధించేవారు. భోజనం చేసి వచ్చారా.. తినే పాఠశాలకు రావాలని చెప్పేవారని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ఆయన బీరువాలో చాక్లెట్ల పొట్లాలు ఎప్పుడూ ఉండేవని, పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్లకు ఇచ్చి బుజ్జగించేవారని పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ గుర్తుచేసుకున్నారు. రోదిస్తున్న చిన్నారులను ఎమ్మెల్యే సతీమణి వేముల పుష్ప ఓదార్చారు. శ్రీనివాసరావు మృతదేహం వద్ద ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీపీసీసీ పూర్వ కార్యదర్శి దైద రవీందర్, మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్ తదితరులు నివాళి అర్పించారు. అంత్యక్రియలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు.
బచ్చుపల్లి శ్రీనివాసరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.