ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
కోదాడలోని ఆర్డీవో కార్యాలయంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాహుల్హెగ్డే
కోదాడ న్యూస్టుడే: పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ముగ్గురు విలేజ్ పోలీసు వాలంటీర్స్ ఈసీఐ సింబల్తో జాకెట్ వేసుకొని ఉండాలన్నారు. చెక్పోస్టుల వద్ద వాహనాల నంబర్లు రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఈవీఎంలు తరలించేటపుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచాలన్నారు. ఎస్ఎస్టీ బృందాలు నిత్యం పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మానాయక్, పుర కమిషనర్ రమాదేవి, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, సీఐలు రజితరెడ్డి, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే చర్యలే
కోదాడ, న్యూస్టుడే: ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటరావు మిల్లుల యజమానులను హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని పలు మిల్లులను సందర్శించి సీఎంఆర్ బియ్యం నిల్వలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచే ధాన్యం లోడులను వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. లారీల కొరత ఏర్పడితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు ఆగుతాయన్నారు. దీంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ సాయగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర
చివ్వెంల, న్యూస్టుడే: రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటరావు సూచించారు. మండలంలోని వల్లభాపురంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 89,598.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని, రూ.60 కోట్లకు పైగా చెల్లింపులు జరిపామన్నారు. జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నందున అన్ని కేంద్రాల్లో టార్పాలిన్లతో పాటు ధాన్యాన్ని శుద్ధి చేసే యంత్రాలు, గోనె సంచులు, కాంటాలు, తేమ శాతం చూసే యంత్రాన్ని అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్వో మోహన్బాబు, తహసీల్దార్లు కృష్ణయ్య ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!