గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు.
తుంగతుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న
కలెక్టర్ వెంకటరావు, చిత్రంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, తదితరులు
తుంగతుర్తి, న్యూస్టుడే: త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలోని శ్రీ వెంకటలక్ష్మి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో విలేజ్ పోలీసు వాలంటీర్లను ప్రతి కేంద్రం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ జరిగేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు రూ.5.50 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికలు గట్టి బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్వో, అదనపు కలెక్టర్ బీఎస్.లత, డీఎస్పీ రవి, తహసీల్దార్లు రమణారెడ్డి, శ్రీను, అమిన్నాయక్ పాల్గొన్నారు.
కౌలు రైతులకు ఇబ్బందులు కల్గించవద్దు..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేందుకు కౌలురైతులకు ఇబ్బందులు కల్గించవద్దని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. మంగళవారం తుంగతుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తాము భూములు కౌలుకు తీసుకున్న భూపట్టాదారులు అందుబాటులో లేకపోవడంతో వారు ఐరిస్, ఓటీపీలు వేయడానికి రాలేకపోతున్నారని, తమ పరిస్థితి ఏమిటని కలెక్టర్ను కౌలురైతు తడకమల్ల వెంకన్న అడిగారు. స్పందించిన కలెక్టర్ ఆ కౌలు రైతు పేరిట బిల్లు చేసి వారి ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, తహసీల్దారు రమణారెడ్డి, ఏపీఎం నర్సయ్య పాల్గొన్నారు.
సూర్యాపేట కలెక్టరేట్: ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్ వెంకటరావు సూచించారు. కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నోడల్, ప్రత్యేక అధికారులు, ఏఆర్వోలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి మాట్లాడారు. రాజకీయ నాయకుల ప్రతినిధులతో ఈ నెల 24న ఇంటి వద్ద ఓటింగ్పై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్వో సతీష్, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో మధుసూదన రాజు, ఎఫ్డీవో రూపేందర్ సింగ్, డీఎస్వో పద్మ, ఆర్డీవోలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఓటు ఆవశ్యకతపై పోటీలు
సూర్యాపేట కలెక్టరేట్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఓటు ఆవశ్యకతపై నిర్వహించిన డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను కలెక్టర్ వెంకటరావు పరిశీలించి మాట్లాడారు. నోడల్ అధికారి, డీఈవో అశోక్, డీఐఈవో కృష్ణయ్య, కోఆర్డినేటర్ జనార్దన్, బాల భవన్ పర్యవేక్షకులు రాధారెడ్డి పాల్గొన్నారు.
అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు
సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలోని చెరువుల్లోంచి అక్రమంగా మట్టిని తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ వెంకటరావు మంగళవారం హెచ్చరించారు. రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!