నిబంధనలకు నీళ్లు..!
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే.
కోదాడలో వాటర్ సరఫరా చేస్తున్న ఆటో
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. బీఐఎస్, ఫుడ్ అధికారుల అనుమతులు ఒక్క దానికి కూడా లేవు. కొన్ని వాటర్ ప్లాంట్లపై గతంలో కొందరు పురపాలికకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 800కు పైగా వాటర్ ప్లాంట్లు ఉండగా, వాటిలో పది శాతం కూడా అనుమతి పొందినవి లేవని ఓ అధికారి తెలిపారు.
కోదాడ, మిర్యాలగూడ, హాలియా, న్యూస్టుడే: వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఇంటింటికీ తిరిగి క్యాన్ల ద్వారా నీళ్లు ఇవ్వడంతో స్థానికులు కొనుగోలు చేసి వాటినే తాగుతున్నారు. ప్లాంట్ల నిర్వాహకులు ప్యూరిఫైడ్ వాటర్ పేరిట విచ్చలవిడిగా నీళ్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా మంది నిర్వాహకులు ఇంట్లో బోరు వేసి ఎలాంటి పరీక్షలు చేయకుండా ఆ నీటినే ప్యూరిఫైడ్ చేసి విక్రయిస్తున్నారు.
అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం..
కొందరు ప్లాంట్ల నిర్వాహకులు నీళ్లు రుచిగా ఉండాలని అధికంగా ప్యూరిఫైడ్ చేస్తున్నట్లు సమాచారం. చాలా చోట్ల మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ఈ నీటినే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. నిబంధనలకు విరుద్ధంగా తయారైన ఆ నీరే నిత్యం తాగుతుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీటి శుద్ధి కేంద్రాలపై తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు.
ఈ అనుమతులు ఎక్కడ?
ప్లాంట్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ధ్రువపత్రం, ట్రేడ్, ఫుడ్ లైసెన్స్లు తప్పనిసరిగా ఉండాలి. ఎన్వోసీ ఆధారంగా విద్యుత్ శాఖ నుంచి కనెక్షన్ ఉండాలి. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, భారత ప్రమాణాల ప్రకారం బయాలజిస్టు, కెమిస్టుల అనుమతి ఉండాలి. నీటి నాణ్యతను పరీక్షించే పరికరాలు ఉండాలి. వాటర్ ప్లాంట్లలో ఇనుప వస్తువులు కాకుండా స్టీల్ డ్రమ్ములు ఉపయోగించాలి. ఈ నిబంధనలు ప్లాంట్ల నిర్వాహకులు పాటించట్లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేయకపోవడంతో వాటర్ ప్లాంట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. క్షేత్రస్థాయిలో నిఘా పెంచి, నాణ్యమైన శుద్ధజలం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
క్షేత్ర స్థాయిలో పరిశీలించి సీజ్ చేస్తాం: యాదగిరి, శానిటరీ ఇన్స్పెక్టర్ కోదాడ
ప్లాంట్ల నిర్వాహకులు పురపాలిక అనుమతి తీసుకోవాలని ఎన్నో సార్లు వారి దృష్టికి తీసుకెళ్లాం. వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా ప్యూరిఫైడ్ చేస్తున్న ప్లాంట్లను సీజ్ చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 14-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్స్లను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. -
ఓటే వజ్రాయుధమనె.. ప్రజాస్వామ్యానిదే విజయమనె..!
[ 14-05-2024]
నల్గొండ, భువనగిరి రెండు లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ అంకం సోమవారం ప్రశాంతంగా ముగిసింది. -
సిరా చుక్కలో.. భవిష్యత్తు లెక్క..!
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18వ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా, పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఎన్నికల సంఘం వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్ది ఆహ్వానించింది. -
ఓటు విలువ గుర్తించి.. ఖండాలు దాటొచ్చి
[ 14-05-2024]
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే.. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సంధించాల్సిందే. వజ్రాయుధం లాంటి ఓటుహక్కు వినియోగించడానికి విదేశాల నుంచి వచ్చారు.. పలువురు ఓటర్లు. -
టెండర్ ఓటు వేసిన దంపతులు
[ 14-05-2024]
తమ ఓటును ఇది వరకే వేరొకరు వేయడంతో దంపతులు అవాక్కయిన ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన ఇక్కె లక్ష్మీనారాయణ, ఉమారాణి దంపతులు లోక్సభ ఎన్నికల్లో -
ఈవీఎంల మొరాయింపు.. ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
శాసనసభ ఎన్నికల వేళ ఓటర్లలో, నాయకుల్లో, అభ్యర్థుల్లో కనిపించిన ఉత్సాహం లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జనగామ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గింది. -
ఇటు ఖాళీగా.. అటు నిండుగా
[ 14-05-2024]
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. నిన్నటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేలాది వాహనాలు బారులు తీరాయి. -
వెబ్కాస్టింగ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తీరును కలెక్టరేట్లోని కంట్రోల్రూం ద్వారా అధికారులు పర్యవేక్షించారు. -
ఫలించిన ఎన్నికల ప్రణాళిక
[ 14-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎస్సెల్బీసీ ఎప్పటికి పూర్తయ్యేనో..!
[ 14-05-2024]
ఎన్నికలు ఏవైనా సరే.. లోక్సభ కావొచ్చు.. అసెంబ్లీ కావొచ్చు.. గత నాలుగు దశాబ్దాలుగా మారుమూల దేవరకొండ గిరిజన ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీల నినాదం ఎస్సెల్బీసీ సొరంగం నిర్మాణం పూర్తిపైనే. -
అభివృద్ధి చేసే నాయకులను వదులుకోవద్దు: ఎంపీ ఉత్తమ్
[ 14-05-2024]
ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అమ్యూలమైన ఓటుహక్కును వినియోగించుకున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా చిన్న ఘటన జరగకుండా లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
పరిశీలించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. -
ఇచ్చిందే కొసరంత.. అందులోనే కోత..!
[ 14-05-2024]
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు, మద్యం పంపిణీ చేస్తుంటారు. -
బందోబస్తును పర్యవేక్షించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. -
తప్పిన పెను ప్రమాదం
[ 14-05-2024]
ఆలేరులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
-
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
-
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ