ఇదేం బాగోతం!
కావలి పట్టణం జనతాపేటకు చెందిన ఓ వ్యక్తికి వైఎస్ఆర్ కాపునేస్తం ఇచ్చినట్లు కరపత్ర పుస్తకంలో చూపించారు. తాను ఆ సామాజిక వర్గం కాకున్నా.. తన పేరు అందులో ఉందని ఆ వ్యక్తి నివ్వెరపోతున్నారు.
గోరంత ఇచ్చి.. కొండంత ప్రచారం
గడపగడపలో నిరసన స్వరాలు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటా అందజేస్తున్న కరపత్రం
కావలి పట్టణం జనతాపేటకు చెందిన ఓ వ్యక్తికి వైఎస్ఆర్ కాపునేస్తం ఇచ్చినట్లు కరపత్ర పుస్తకంలో చూపించారు. తాను ఆ సామాజిక వర్గం కాకున్నా.. తన పేరు అందులో ఉందని ఆ వ్యక్తి నివ్వెరపోతున్నారు.
కావలి పురపాలక పరిధిలోని 29వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. తాను అలా ఎప్పుడూ అనారోగ్యంతో చికిత్స పొందలేదని చెప్పుకొస్తున్నారు.
కావలి, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు జరిగిన లబ్ధి కంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఇళ్ల వద్దకు వెళ్తున్న ప్రజాప్రతినిధులు ప్రస్తుత వైకాపా పాలనలో చేసిన మేలు గురించి వివరిస్తూ 16 పుటల కరపత్ర పుస్తకాన్ని అందజేస్తున్నారు. ఆ పుస్తకం ముందుభాగంలో ఉండే అట్టపై సదరు కుటుంబం పొందిన మొత్తం లబ్ధి గురించి రూపాయలతో సహా వివరించేలా ముద్రించి పంపిణీ చేస్తున్నారు. కావలి పురపాలక సంఘం పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంపై అసలు కంటే ప్రచారం జాస్తి అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బిడ్డలే లేని వారికి సైతం జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెనలు ఇచ్చినట్లు చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఇళ్లు నిర్మించుకోకపోయినప్పటికీ ఆ కరపత్ర పుస్తకంలో లబ్ధిదారుల వివరాలుంటున్నాయి.
అవాస్తవ గణాంకాలు.. : కావలి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆలస్యంగా జరుగుతోంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ల నాలుగు నెలలవుతుండగా, ఇప్పుడు కేవలం మూడో ఏటా సంక్షేమ బావుటా అంటూ పుస్తకాలను అందజేస్తున్నారు. ఇక నాలుగో సంవత్సరం వివరాలను కూడా కలిపితే ఇంకా అవాస్తవ గణాంకాలు వెలుగు చూసే అవకాశం ఉంది. తమ బ్యాంక్ ఖాతాలు పరిశీలిస్తే.. ప్రభుత్వం సాయం చేసింది? లేనిది? బహిర్గతమవుతుందని పలువురు తేల్చిచెబుతున్నారు. మహిళల పేరిట ఇచ్చిన సొమ్ము కంటే ఎక్కువ మొత్తాలు ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తుండటంపై పలువురి కుటుంబాల్లో కలహాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
తప్పుడు ప్రచారం తగదు
మేము అద్దె ఇంటిలో ఉంటున్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. ఎమ్మెల్యే వచ్చి రూ.6లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చినట్లుగా, రూ.2.5లక్షల వరకు గృహ నిర్మాణ సంస్థ నిధి అందినట్లు ఓ కరపత్ర పుస్తకాన్ని ఇచ్చి వెళ్లారు. ఇవ్వకుండానే ఇలా ప్రచారం చేసుకోవడం ఏమీ బాగోలేదు. పెద్దలు ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి.
షేక్ సుల్తానా, 18వ వార్డు, కావలి
నాకు అంత రాలేదు
నాకు ప్రభుత్వం నుంచి వచ్చిన దానికంటే చాలా ఎక్కువగా పొందినట్లు చెబుతున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద రూ. 4,113, జగనన్న అమ్మఒడి పథకంలో రెండేళ్లకు రూ.29వేల వరకు అందడం వాస్తవమే. వైఎస్ఆర్ ఆసరా కింద 33,590 అందజేసినట్లు చూపిస్తున్నారు. ఆ మొత్తం నాకు దక్కలేదు. (స్వయంగా ఎమ్మెల్యేనే ఇంటి వద్దకు వచ్చి పుస్తకం ఇచ్చి వెళ్లడంతో ఆ రూ.33,590 ఏమి చేశావంటూ నా భర్త ప్రశ్నిస్తున్నారు.)
వైరంగం వీరమ్మ పొదుపు మహిళ, తుపాన్నగర్, కావలి
అవి ముద్రణ తప్పిదాలు
ఈగ కిరణ్, కమిషనర్, కావలి పురపాలక సంఘం: ఈ ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరిపించాం. అవన్నీ కంప్యూటర్ ద్వారా ముద్రణ జరుగుతోంది. ముద్రణ తప్పిదాలుగా సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. తేడాలు లేకుండా వాస్తవంగా ఎంత లబ్ధిపొందారో అంతమాత్రమే ముద్రించాలని సూచించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20వేల మెజారిటీతో కావ్యకృష్ణారెడ్డి గెలుపు ఖాయం
[ 16-05-2024]
ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 20 వేల మెజారిటీతో గెలుస్తారని పట్టణంలోని 23వ వార్డుకు చెందిన నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
ఓటోత్సాహం
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. ఓటరులో చైతన్యం వెల్లివిరిసింది. ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు.. ఉపాధి కోసం వలస వెళ్లినవారూ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. -
సైబర్ వల.. సామాన్యులు విలవిల
[ 16-05-2024]
నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు లింక్ వచ్చింది. క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామన్నది సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్కార్డు నంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ. 80వేలు లాగేశారు. -
పోలింగ్పై.. వనితల ముద్ర
[ 16-05-2024]
‘జిల్లాలో పురుషులు 9,51,065 ఉండగా- ఇందులో 7,63,894 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీన్ని బట్టి సుమారు 20,325 మంది మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. -
క్రీడా పండగొచ్చింది
[ 16-05-2024]
వేసవి వచ్చింది.. పిల్లలకు ఎంతో ఇష్టమైన క్రీడా శిబిరాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి జూన్ 15 వరకు వీటిని నిర్వహించనున్నారు. నగరంలోని ఏసీ మైదానంలో అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని మైదానాలను వేసవి శిక్షణ శిబిరాలకు ఉపయోగించుకోనున్నారు. -
నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు
[ 16-05-2024]
జిల్లావ్యాప్తంగా ఎండలు పెరిగినా, నీటి ఎద్దడిపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా ఇన్ఛార్జి ఎస్ఈ మర్దనాలి తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను బుధవారం వివరించారు. -
ఉపాధికి ఊతం.. ఐటీఐ
[ 16-05-2024]
పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యాలు తప్పనిసరి. అవి సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులను పలు సంస్థలు కళాశాలల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకుంటున్నాయి. -
రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే
[ 16-05-2024]
‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే.. కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని అన్ని సర్వేలు తేల్చాయి.. రెండు రోజులుగా వైకాపా నేతల స్వరంలో మార్పు కనిపిస్తోంది’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. -
మూగజీవాల వేదన
[ 16-05-2024]
వైకాపా పాలనలో మూగజీవాల ఆలనాపాలన ప్రమాదంలో పడింది. తెదేపా ప్రభుత్వ పాలనలో పశువులకు అందించే వివిధ రకాల పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త పథకాలు తెచ్చిందా... అంటే అదీ లేదు. -
ఓటెత్తిన చైతన్యం.. ఎవరికో అనుకూలం
[ 16-05-2024]
నియోజకవర్గంలో ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందోనని అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెండున్నర శాతం పెరిగింది. -
పట్టణ ప్రజలపై పన్నుపోటు
[ 16-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక నూతనంగా తీసుకొచ్చిన ఆస్తికి మార్కెట్ విలువ ఆధారిత పన్ను విధానం ప్రజల నెత్తిన గుదిబండలా మారింది. మార్కెట్ విలువలో నిర్దేశిత శాతం చేరుకునేంత వరకు ఏటా 15 శాతం పన్ను పెంచుతుండటంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
జేఎస్ రెడ్డి సేవలు నిరుపమానం
[ 16-05-2024]
తెలుగు విజ్ఞాన సమితి పూర్వ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం బెంగళూరులో నివాళి అర్పించారు. -
కరేడులో యువకుల ఘర్షణ
[ 16-05-2024]
కరేడులోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రెండు సామాజిక వర్గాల యువకులు గొడవపడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం