జగన్ హామీ.. నెరవేరదేమీ?
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
జిల్లాలో పర్యాటక ఆశలు ఆవిరి
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ వీధుల్లో ప్రయాణం దుర్భరంగా మారింది.
ఇది సోమశిల జలాశయం వద్ద పర్యాటక శాఖ నిర్మించిన అతిథిగృహం. దివంగత మేకపాటి గౌతమ్రెడ్డి సోమశిల వద్ద పర్యాటక అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేయించారు. పనులు చేపట్టి పూర్తిచేశారు. అనంతరం పర్యాటక శాఖ పట్టించుకోలేదు. ప్రభుత్వం ఈ భవనాలు వినియోగంలోకి తేవాలనే ప్రయత్నమే చేయలేదు.
ఆత్మకూరు, న్యూస్టుడే: జిల్లాలో ఏఎస్పేట దర్గా, సోమశిల జలాశయం, పెంచలకోన మూడు భిన్న ప్రాంతాలు. వాటిని త్రికోణ పర్యాటక కేంద్రాలుగా చేస్తామని గత ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత సీఎం జగన్ హామీ ఇచ్చారు. అనంతరం పట్టించుకోనేలేదు.
- హిందూముస్లిం భక్తులు అధికంగా సందర్శించే ఏఎస్పేట దర్గా పరిసర ప్రాంతాలను వీధులను వెడల్పు పేరుతో ఛిద్రం చేశారు. విస్తరణ పేరుతో ప్రధాన రహదారులకు ఇరువైపుల ఉన్న గొట్టాలను సగం మేరకు పగులగొట్టారు. ఇరువైపులా మురుగు కాలువలు, సీసీ రోడ్లు నిర్మించాలి. పనులు దక్కించుకొన్న గుత్తేదారు బిల్లులు రావని వాటిని పట్టించుకోలేదు. ఫలితంగా ఇక్కడ వీధులు అధ్వానంగా మారాయి. మురుగునీటి నిల్వతో పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో భక్తులు, సందర్శకులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- సోమశిలలో పర్యాటక కేంద్రం అభివృద్ధి పనుల్లో భాగంగా బోట్ షికారు, యూ పాయింట్ వద్ద అతిథిగృహాలు. ప్రాజెక్ట్ ముందుభాగంలో పైలాన్, కలువాయి రోడ్డు మధ్యలో ఉద్యానవనం అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికి రూ. 2 కోట్లతో అతిథిగృహం, ఇతర నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిని వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో ఇవి ఉపయోగంలోకి రాకుండానే శిథిలమవుతున్నాయి. మిగిలిన పనుల ఊసు లేదు. పెంచలకోనలో పర్యాటక పనుల జాడే లేదు. ఇలా ఎన్నికల అనంతరం పర్యాటక అభివృద్ధి పనుల మాటను ప్రభుత్వం మరిచిపోయింది.
హామీ: ఏఎస్పేట దర్గా, సోమశిల, పెంచలకోనలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం.
- 2019 ఎన్నికల సందర్భంగా సీఎం జగన్
అమలు: వైకాపా అధికారంలోకి వచ్చాక పైవేవీ అమలుకు నోచుకోలేదు. గతంలో సోమశిల వద్ద చేపట్టిన పనులు ఉపయోగంలోకి తేలేదు. మిగిలిన పనులు మరిచారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధి అంశాన్నే అటకెక్కించారు.
ప్రధాన వీధుల్లో నడవలేం
సయ్యద్ అక్బర్, ఎ.ఎస్.పేట
ప్రధాన వీధుల పక్కన దుకాణాలను పగలగొట్టారు. అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో ప్రధాన వీధుల్లో రాకపోకలే సాగించలేని పరిస్థితి. దీంతో స్థానికులు, భక్తులకు అసౌకర్యంగా ఉంది.
పరిసరాలు అధ్వానం
మహబూబ్బాషా, ఎ.ఎస్.పేట
ఏఎస్పేటలో రోడ్ల విస్తరణ అంటూ దుకాణాలు పగులగొట్టారు. ఆపై మురుగు కాలువలు నిర్మించలేదు. దీంతో పరిసరాలు దారుణంగా మారాయి. మురుగు వీధుల్లో చేరి దుర్వాసన వస్తోంది. పర్యాటకులు ఉండలేని విధంగా పరిస్థితులు మార్చారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయకేతన.. జయదీవెన
[ 04-05-2024]
నెల్లూరు నగరంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్కల్యాణ్లు నిర్వహించిన రోడ్షో, ప్రజాగళం సభకు ప్రజలు పోటెత్తారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ అధినేతలకు ఘనస్వాగతం పలికారు. -
అయిదేళ్ల పాలన.. మూడుసార్లు వడ్డన!
[ 04-05-2024]
నేనున్నాను.. నే విన్నానని పదేపదే చెప్పి.. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి.. ఆర్టీసీ ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. గత ప్రభుత్వంపై నానా యాగీ చేసి పీఠమెక్కిన ముఖ్యమంత్రి.. వైకాపా అయిదేళ్ల పాలనలో మూడుసార్లు ఛార్జీలు పెంచారు. -
అదేతీరు.. పండుటాకుల కన్నీరు
[ 04-05-2024]
బ్యాంకుకు వెళ్లిన తర్వాత పాన్కార్డు, ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకొస్తే నగదు డ్రా చేసుకోవచ్చన్నారు. ఎండలో నకలు కాపీల కోసం ప్రదక్షిణలు చేశాం. నాలుగేళ్లుగా ఖాతా లావాదేవీలు నిలిచిపోయినట్లు బ్యాంకర్లు చెప్పారు. పింఛను అందక నిరాశ చెందా. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 85 ఏళ్లుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. -
నేడు సీఎం జగన్ పర్యటన
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ శనివారం నెల్లూరుకు రానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చాపర్లో వీఆర్సీ క్రీడా మైదానానికి చేరుకుని.. 3.10 గంటలకు రోడ్షో నిర్వహించనున్నారు. -
మాటల్లో ప్రేమ.. చేతల్లో ఏదయ!
[ 04-05-2024]
ఎస్సీ.. ఎస్టీలపై ప్రేమ ఒలకబోసిన జగన్.. ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతిపై విషం కక్కారు. తెదేపా పాలనలో వెలుగు వెలిగిన ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. అయిదేళ్ల పాలనలో కార్పొరేషన్కు పైసా విదల్చని జగన్.. ఎన్నికల వేళ ఆయా సామాజిక వర్గాల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. -
సోమశిల నుంచి 1.5 టీఎంసీల నీటిని తీసుకొస్తాం
[ 04-05-2024]
రాళ్లపాడు జలాశయానికి సోమశిల ప్రాజెక్టు నుంచి ఏటా రావాల్సిన 1.5 టీఎంసీల నీటిని తీసుకొచ్చి అన్నదాతను ఆదుకుంటామని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. -
వీవోఏ వైకాపా ప్రచారంలో ఉపాధ్యాయుడు
[ 04-05-2024]
వరికుంటపాడు మండలం ధర్మవరంలో శుక్రవారం వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి ప్రచారంలో నార్తుకొండాయపాలెం వీవోఏ జె.అనూష పాల్గొన్నారు. అభ్యర్థికి గజమాల వేసి ప్రచారంలో పాల్గొన్నారు. -
జగన్ పాలన.. వేతన జీవులకు వెత
[ 04-05-2024]
జగన్ పాలనలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ప్రతి నెలా జీతం సకాలంలో అందక ఆర్థికంగా అవస్థ పడుతున్నారు. జీతం ఎప్పుడొస్తుందోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణ: కలెక్టర్
[ 04-05-2024]
పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో శుక్రవారం పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్స్ నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణను పరిశీలించారు. -
అభి సుజుకి నూతన షోరూం ప్రారంభం
[ 04-05-2024]
నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో అభి సుజుకి రెండో షోరూంను శుక్రవారం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ జోనల్ సర్వీస్ మేనేజర్ వెంకటేషన్ ప్రారంభించారు. -
రైతు నేస్తమన్నావ్.. కన్నీరు నింపావ్!
[ 04-05-2024]
రైతు నేస్తమన్నావు.. అండగా నిలుస్తానన్నావ్.. వారి క్షేమమే ప్రాధాన్యమని ముఖ్యమంత్రి జగన్ నమ్మించారు. వారి కష్టాలు మాత్రం పట్టించుకోలేదు. పంటలు పండించే మార్గాలను గాలికొదిలేశారు. పొలాలకు నీరు అందించే కాలువల నిర్వహణ అయిదేళ్లుగా మరిచిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!