మండుటెండలో ‘ఎన్నికల వేడి’
వాతావరణ మార్పుల కారణంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు.
ముందస్తు చర్యలతోనే పోలింగ్ శాతం మెరుగు
ఎండతో నిర్మానుష్యంగా ప్రభుత్వ వైద్యశాల ఎదుట ట్రంకురోడ్డు ప్రాంతం
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: వాతావరణ మార్పుల కారణంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మేలో వడగాలులు కూడా వీయొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ రోజున ఎండ తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లకు ఇప్పటి నుంచే యంత్రాంగం సన్నద్ధం కావాలని వివిధ పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది.
గతంలో..
- 2019లో దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. గతంలో మాదిరిగా మొదటి విడతలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగో విడతలో భాగంగా మే 13న జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి.
- గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సరాసరిన 77.48 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఓటింగ్ శాతంలో తొమ్మిదో స్థానంలో ఉంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఈసారి ఓటింగ్ శాతం పెరగాలని, ఆ దిశగా ఓటర్లలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేయాలని ఓటర్లు కోరుతున్నారు.
ఏర్పాట్లు చేస్తేనే..
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు రాకుండా, వడదెబ్బ తగలకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సన్నద్ధం కావాల్సి ఉంది. అధికశాతం కేంద్రాలు పాఠశాలల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎక్కువ మంది ప్రజలు వస్తారు. ఆయా చోట్ల నీడ, తాగునీటి కోసం ఏర్పాట్లు చేయాలని ఓటర్లు కోరుతున్నారు. వడదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో తగిన వైద్య సదుపాయాలు సమకూర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓటర్లు ఎక్కువ సేపు వేచి చూడకుండా వీలైనంత త్వరగా పోలింగ్ జరిగేలా అధికారులు చూడాలని చెబుతున్నారు. అలాగే ఎండలకు భయపడి చాలామంది ఓటుకు దూరంగా ఉంటారు. అలాంటి వారికి రవాణా వసతి కల్పించాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
[ 12-05-2024]
నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. -
ఇసుక తోడేళ్లు..!
[ 12-05-2024]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. తెదేపా హయాంలో ఉచితంగా ఇసుక దొరుకుతుండగా వైకాపా ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. -
కూటమి గెలుపుతోనే అరాచక పాలన అంతం
[ 12-05-2024]
కూటమి గెలుపుతోనే వైకాపా అరాచక పాలన అంతమని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా శనివారం తెదేపా ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పోలింగ్కు అధికార యంత్రాంగం సన్నద్ధం
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం సాయంత్రంతో మైకులు మూగబోయాయి. మరో 24 గంటల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో.. -
జగన్ తీరు.. రైతు కంట కన్నీరు
[ 12-05-2024]
తెదేపా ప్రభుత్వం సోమశిల హైలెవల్ కాలువలను జిల్లాలో మొదటి ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టి.. పనులు వేగంగా చేపట్టేలా కృషి చేసింది. అదే క్రమంలో అవి జరిగి ఉంటే.. -
వ్యవ‘సాయం’లేని క్షేత్రం
[ 12-05-2024]
నియోజకవర్గంలోని అన్నదాతలతోపాటు చుట్టు పక్కల జిల్లాల్లోని వారికి పంట విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లింగసమద్రం మండలం చినపవనిలో 410 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. -
ప్రారంభించారు.. వదిలేశారు
[ 12-05-2024]
బహిరంగ జంతు వధశాల నిర్మూలించడంతోపాటు పట్టణంలోని ప్రధాన వీధుల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకూడదనే ఆలోచనతో నిర్మించిన మటన్మార్కెట్ భవనం నిరుపయోగంగా ఉంది. -
రుణాల మంజూరు అరకొరే...
[ 12-05-2024]
గ్రామాల్లోని రైతులకు సకాలంలో రుణాలు అందించడంతోపాటు వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడిన వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) వైకాపా పాలనలో నిర్వీర్యమయ్యాయి. -
వేసవి కాలం తీరని దాహం
[ 12-05-2024]
కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమైంది. వేసవిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. -
అరచేతిలో స్వర్గం.. యువత నైరాశ్యం
[ 12-05-2024]
నిరుద్యోగులందరికీ వివిధ వృత్తి విద్య, కంపెనీ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తాం. ఉద్యోగ సాధనలో తోడ్పాటునందిస్తాం. -
నటి పవిత్ర కారుకు ప్రమాదం
[ 12-05-2024]
జాతీయ రహదారిపై శనివారం పాతాళపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి.