తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు.
దొంగ అరెస్టు... బంగారు నగల స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న నగర డీఎస్పీ
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 44.5 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శనివారం స్థానిక బాలాజీనగర్ పోలీసుస్టేషన్లో నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అరవింద నగర్ మహాలక్ష్మమ్మ గుడి సమీపంలో నివాసం ఉండే వేములపాటి శ్రీవల్లి కుటుంబం ఇంటికి తాళాలు వేరే ప్రాంతానికి వెళ్లారు. ఈ నెల 15న గుర్తుతెలియని దుండగుడు తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.1,42,400 విలువ చేసే 44 సవర్ల బంగారు ఆభరణాలను దొంగతనం చేశారు. దీనిపై బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేలిముద్రలు సేకరించారు. దర్యాప్తులో నిందితుడు పాత దొంగ మీదూరి సునీల్గా గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసైన దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2013 నుంచి జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసిన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. నేరం జరిగిన 48 గంటల్లో దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తు రికవరీ చేయడంలో కృషి చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వీరా నాయక్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు
[ 02-06-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శనివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. -
గంటల వ్యవధిలో దంపతుల మృతి
[ 02-06-2024]
ఏ కష్టం వచ్చినా కలసి ఉంటామని మనువాడేటప్పుడు బాస చేసుకున్న ఆ దంపతులు ఒక్కటిగానే ఇహం వీడి పరం చేరారు. భార్య కన్నుమూతతో కలత చెందిన భర్త కూడా ఆమె మృతదేహంపై రోదిస్తూ తుది శ్వాస విడిచారు. -
సోమశిల.. సాగుకెలా?
[ 02-06-2024]
ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమకు 115 ఎంఎల్డీ నీటిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సోమశిల జలాశయం నీటి కేటాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పరిశ్రమల రాకతో ప్రగతికి బాటలు పడతాయని ఓ వర్గం అంటుండగా- ఈ ఏడాది ఎదురైన వర్షాభావ పరిస్థితులు.. -
భజే వాయుపుత్రం
[ 02-06-2024]
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమజ్జయంతిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అంజనీ సుతుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్గామిట్టలోని శబరి శ్రీరామ క్షేత్రంలో సామూహిక లక్ష మల్లెలార్చన నిర్వహించగా.. -
జమకాని సొమ్ము... జవాబు చెప్పేవారు లేరు!
[ 02-06-2024]
జూన్ నెలకూ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా- ఈసారి పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత మధ్య బ్యాంకుల వద్దకు చేరిన లబ్ధిదారులు.. -
కలగానే సొంత భవనాలు
[ 02-06-2024]
సంగంలోని ప్రభుత్వ ఆశ్రమ ఐటీఐకి సొంత భవనాలు కలగానే మిగిలాయి. ఏళ్లుగా పరాయి పంచనే తరగతులు నిర్వహిస్తున్నా.. ఐటీఐకి కేటాయించిన స్థలంపై కబ్జాదారులు కన్నేసి ప్రయత్నాలు చేస్తున్నా.. అదే సమయంలో గ్రావెల్ దొంగలు గుల్ల చేస్తున్నా.. -
నిబంధనలకు నీళ్లు
[ 02-06-2024]
జాతీయ రహదారి నిర్మాణంలో గుత్తేదారులు నిబంధనలకు నీళ్లొదిలారు. మట్టి తరలింపులో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించకుండా తీసుకెళుతున్నారు. -
అతివేగంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
[ 02-06-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కామాక్షి ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు వస్తోంది.