సీనియర్ సహాయకుల వాంగ్మూలం సేకరణ
నిజామాబాద్ రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక అడుగు ముందుకు పడింది. విచారణ అధికారి, మెదక్ జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ నిజామాబాద్లోని డీఐజీ కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు. సస్పెన్షన్కు
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: నిజామాబాద్ రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక అడుగు ముందుకు పడింది. విచారణ అధికారి, మెదక్ జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ నిజామాబాద్లోని డీఐజీ కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు. సస్పెన్షన్కు గురైన ఇద్దరు సీనియర్ సహాయకుల వాంగ్మూలం సేకరించారు. అధికారులపై వచ్చిన ఆరోపణలు, విచారణలో గుర్తించిన సమాచారంతో శాఖాపరమైన చర్యల కోసం నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
* స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నాన్ లేఅవుట్లు, నాలా లేని భూములకు దస్తావేజులు పుట్టించిన వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి విచారణకు ఆదేశించడంతో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. ఈక్రమంలో గతేడాది నవంబరులో విచారణ జరిపి ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి శాఖాపరమైన విచారణ మొదలుపెట్టారు. తాజాగా ఇద్దరు అధికారులు అక్రమాలు చేసినట్లు గుర్తించి ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ఆధారంగానే శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
కలెక్టర్ విచారణ..
పాలనాధికారి సైతం ప్రత్యేకంగా 2021 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో జరిగిన రిజిస్ట్రేషన్ల దస్తావేజుల వివరాలు సేకరించి విచారణ చేయిస్తున్నారు. ఇది దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరందించే ట్యాంకు నిరుపయోగంగా..!
[ 14-05-2024]
మండలంలోని పోచారం గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద మంచి నీటి సౌకర్యర్థం నిర్మించిన ట్యాంకు వృథాగా వదిలేశారు. -
ఓట్ల గల్లంతు
[ 14-05-2024]
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఓట్లు గల్లంతు పరిపాటిగా మారింది. గతంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గొడవలు జరిగాయి. -
పోటెత్తిన ఓటరు
[ 14-05-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరారు. -
పేరు లేదని.. నిరాశతో వెనుదిరిగి
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరిగింది. పిట్లం మండల కేంద్రంలో ఓటర్ కార్డు ఉన్నా ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో హక్కుకు దూరమై పలువురు ఇంటి ముఖం పట్టారు. స్థానిక బీఎల్వోలను, అధికారులను అడిగినా ఎలాంటి సమాధానం లేదు. -
తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం
[ 14-05-2024]
లోక్సభ పోరు ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రాజకీయపార్టీలు దాదాపు నెల రోజులుగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. -
ఇరు వర్గాల ఘర్షణ.. కేసు నమోదు
[ 14-05-2024]
మండలంలోని శెట్పల్లి చౌరస్తా సమీపంలోని కరీంనగర్ డెయిరీ వద్ద ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చైతన్యకుమార్రెడ్డి తెలిపారు -
వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన
[ 14-05-2024]
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సోమవారం వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. -
ఆకట్టుకున్న ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
[ 14-05-2024]
పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కొన్నిచోట్ల ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు నెలకొల్పారు. -
ఫలించిన భద్రతా వ్యూహం
[ 14-05-2024]
ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలోని పోలీసులు ప్రణాళికాబద్ధంగా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు -
పోలీసులపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం
[ 14-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోల్డెన్ జూబ్లీ, నేషనల్ పాఠశాలల పోలింగ్ కేంద్రాల యువకులు గుంపుగా నిలబడటంపై అసహనం వ్యక్తం చేశారు. -
ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
[ 14-05-2024]
ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.8 లక్షలు తీసుకొని ఇద్దరు వ్యక్తులు చేసిన మోసానికి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. -
కేంద్రీయ విద్యాలయంలో శతశాతం ఫలితాలు
[ 14-05-2024]
నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీబీఎస్ఈ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి