అవరోధాలు దాటితేనే ప్రగతి
నిజామాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే అంశంపై ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు తాజాగా చర్చించారు.
అసంపూర్తి దశల్లో పనులు
పురపాలికల్లో ఇదీ పరిస్థితి
ఈనాడు, నిజామాబాద్, న్యూస్టుడే, బోధన్ పట్టణం, నిజామాబాద్ నగరం
బోధన్ అంబేడ్కర్ చౌరస్తాలో అసంపూర్తిగా మురుగుకాల్వ
నిజామాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే అంశంపై ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు తాజాగా చర్చించారు. దీంతో పట్టణాల్లో ప్రగతిపై ఒక్కసారిగా కదలిక వచ్చింది. అయితే ఇప్పటికే ప్రారంభించి.. అసంపూర్తి దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు.
నిజామాబాద్ నగరం : ఇందూరు పట్టణంలో జనాభా నాలుగు లక్షలకు చేరింది. అంత్యక్రియల నిర్వహణకు సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి అర్సపల్లి, దుబ్బ, వర్ని రోడ్డులో రూ.3.30 కోట్లతో వైకుంఠధామాలు నిర్మించాలని గతేడాది నిర్ణయించారు. వర్నిరోడ్డులో ఆరు నెలల కిందటే పనులు నిలిచిపోగా.. తాజాగా సోమవారం ప్రారంభించారు. రఘునాథ చెరువుకు అనుబంధంగా రూపుదిద్దుకుంటున్న మినీ ట్యాంకుబండ్ పనులు ప్రారంభమై రెండేళ్లు దాటింది. వ్యయం పెరుగుతూ వచ్చి రూ.20 కోట్లకు చేరింది. టైల్స్ వేయటం, ట్రాక్ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మరో నెల రోజుల్లో పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. వినాయక్నగర్లో రూ.1.20 కోట్లు, మారుతీనగర్లో రూ.1.50 కోట్లతో ఉద్యానాలు నిర్మిస్తున్నారు. రెండేళ్ల కిందట పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా కాలంలో నిలిచిపోయాయి. ఇటీవలే తిరిగి ప్రారంభించారు. రూ.6 కోట్లతో నగరపాలక సంస్థ కార్యాలయం కోసం నిర్మించిన నూతన భవనం అసంపూర్తి దశలోనే ఉంది. మరికొన్ని నిధులు వెచ్చిస్తే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆర్మూర్ పట్టణం : పట్టణవాసులకు సౌకర్యంగా కూరగాయలు, మాంసం విక్రయాలు ఒకే దగ్గర ఉండేలా సమీకృత మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. కొంతకాలం కిందట అంగడిబజార్లో శంకుస్థాపన చేశారు. రైతులు వ్యతిరేకించటంతో అక్కడితో ఆపేశారు. పిప్రి రోడ్డు, పెర్కిట్లో రెండు వైకుంఠధామాలు నిర్మిస్తున్నా.. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వార్డుల్లో మురుగుకాల్వలు, కల్వర్టులను పూర్తి చేయాల్సి ఉంది.
భీమ్గల్ పట్టణం : మార్కెట్ సౌకర్యం లేక రోడ్ల మీదే కూరగాయలు, పూలు విక్రయిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. సమస్య పరిష్కారానికి సమీకృత మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు భూమిని కేటాయించడంతో చదును చేసే పనులు సాగుతున్నాయి. మరోవైపు పార్కు కోసం నిధులు కేటాయించారు.
బోధన్ పట్టణం : టీయూఎఫ్ఐడీసీ నిధులతో ఫుట్పాత్, మురుగుకాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. చివరి దశకు వచ్చిన తర్వాత ఓ చోట అర్ధాంతరంగా నిలిచిపోయింది. రెండో విడతలో వచ్చిన రూ.25 కోట్లలో రూ.13.71 కోట్ల విలువైన పనులు ఏడాదిన్నరగా ఆగాయి. అయితే ఈ నిధులకు తాజాగా సవరణ ప్రతిపాదనలు నివేదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాయంత్రానికి మైకులు బంద్
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పార్టీలకు కీలక ఘట్టమైన ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. మార్చి 16న షెడ్యూల్.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడగా.. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 29 మంది బరిలో దిగారు. -
‘ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఫిర్యాదు’
[ 11-05-2024]
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, భారాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు ఇప్పిస్తా
[ 11-05-2024]
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘భాజపా సర్కారు రైతుల్ని మోసగించింది’
[ 11-05-2024]
కేంద్రంలోని భాజపా సర్కారు రైతులను మోసగించిందని, ప్రజలకు ఆదాయం పెంచుతామని చెప్పి అన్ని రకాల ధరల్ని రెట్టింపు చేసిందని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. డి -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగియనుంది. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
‘కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు’
[ 11-05-2024]
-
కార్నర్ సమావేశంగా మార్పు
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ సమావేశ స్థలాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం తలపెట్టిన కాంగ్రెస్ జనజాతర సభను కార్నర్ సమావేశంగా మార్చినట్లు పేర్కొన్నారు. -
‘ఆశీర్వదిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా’
[ 11-05-2024]
ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భారాస జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి ఝరాసంగంలో పాత బస్టాండు కూడలి వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
ఏడాదిన్నర తర్వాత హత్య కేసు ఛేదన
[ 11-05-2024]
ఏడాదిన్నర కిందట మూసేసిన కేసును సాంకేతికతను వినియోగించి పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో డీఎస్పీ నాగేశ్వర్రావుతో కలిసి శిక్షణ ఐపీఎస్ కాజోల్ సింగ్ వివరాలు వెల్లడించారు. -
బిడ్డా.. ఓటు మరవొద్దు!
[ 11-05-2024]
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. రాజ్యాంగం మనకు వజ్రాయుధం వంటి ఓటుహక్కును కల్పించింది. దానిని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. ప్రతి ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. -
తప్పులకు తావు లేదిక
[ 11-05-2024]
ఉపాధ్యాయుల హాజరుకు మొన్నటి వరకు బయోమెట్రిక్ విధానం అమలులో ఉండేది. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సందేశం.. ఆచరణీయం
[ 11-05-2024]
ఎన్నికల్లో ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయనే అపవాదు ఉంది. దానిని తొలగించడానికి వివిధ రూపాల్లో ఎవరో ఒకరు స్పందిస్తుంటారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో అలాంటి అవగాహన పెంచే సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హోటల్ వ్యాపారం మాటున డ్రగ్స్ దందా
[ 11-05-2024]
ప్రేమలో విఫలమైన ఒక చెఫ్ డ్రగ్స్కు అలవాటుపడి.. దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కారు. కేసు వివరాలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!