logo

కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పని చేయాలి

కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకుపోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.

Published : 23 Apr 2024 21:10 IST

ఎల్లారెడ్డి పట్టణం: కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకుపోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. భాజపా, భారాస నాయకుల కుట్రలను తిప్పికొట్టలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు సాయిబాబా, వినోద్, నాయకులు విద్యాసాగర్, చెన్న లక్ష్మణ్, గాయజోద్దీన్, శ్రీనివాస్, సామెల్, అరిఫ్, తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని