లక్ష్యం శతశాతం
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
ఇంటర్లో ప్రవేశాలు పెంచేందుకు కసరత్తు
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ సారి శతశాతం ప్రవేశాల లక్ష్యం అధిగమించేందుకు దృష్టి పెట్టింది. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రవేశాలు ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది.
* గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ అనుబంధ కళాశాలలు, ఆదర్శ బడులు, గురుకులాలు, కసూర్బా బాలికల విద్యాలయాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో మండల కేంద్రాలకు, గ్రామాలకు అధ్యాపకులు వెళ్లి పిల్లల తల్లిదండ్రులను చైతన్యం చేయాలని నిర్ణయించారు. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు అప్పటికప్పుడు ఆన్లైన్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఫలితాల ప్రభావం ఏ మేరకు..?
2023-24 విద్యాసంవత్సరం ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 35వ స్థానానికి చేరింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం అధికారులు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలి
...షేక్ సలాం, డీఐఈవో
జిల్లాలో ఇంటర్లో ప్రభుత్వ కళాశాలల్లోనే పిల్లలను చేర్పించాలి. అన్ని రకాల వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ఈ విద్యాసంవత్సరం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతాం. ఫలితాల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడొద్దు.
ఆదర్శలో 960 సీట్లు
సదాశివనగర్, న్యూస్టుడే: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంలా మారాయి. ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన, అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, నిష్ణాతులైన అధ్యాపకులు ఉండటం, ఏటా ఉత్తమ ఫలితాలు వస్తుండడంతో ప్రవేశాలకు పోటీ నెలకొంది.www.tsmodel schools.com వెబ్సైట్లో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, బాన్సువాడ, మద్నూర్లో ఆదర్శ పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో ఇంటర్ ప్రథమసంవత్సంలో 160 సీట్ల చొప్పున మొత్తం 960 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కొక్కదానిలో 40 సీట్లు చొప్పున 160 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. కళాశాలలో చేరిన వారిలో 100 మంది విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి సౌకర్యం కల్పిస్తారు. ఇబ్బందులు తలెత్తకుండా కేర్టేకర్, ఏఎన్ఎం, నైట్వాచ్మెన్ అందుబాటులో ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా ప్రగతి సాగాలి
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్ది ప్రత్యేక స్థానం. అభివృద్ధిలోనూ ప్రత్యేక ముద్ర కనిపించినా.. ఆశించిన ఫలితాలు దక్కలేదు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది. నేటితో 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటోంది. -
ఉద్యమానికి ఊపిరై.. స్వరాష్ట్ర సాధకులై
[ 02-06-2024]
నిజాం చెర నుంచి విముక్తి కోసం జరిగిన విమోచనోద్యమంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యేవరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు పోరాట పటిమతో ఉద్యమం చేపట్టారు. -
రాష్ట్ర గీతం సృష్టికి ఇందూరే స్ఫూర్తి
[ 02-06-2024]
రాష్ట్ర గీతంగా గుర్తించడం అందెశ్రీకి దక్కిన గౌరవం. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి దాశరథి ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ ఊపిరిలూదితే.. మలి దశ పోరాటంలో అందరిలో స్ఫూర్తి నింపింది అందెశ్రీ గీతం.. -
తండా రోడ్డు తవ్వేశారు...
[ 02-06-2024]
రైతుల మధ్య ఏర్పడిన పంచాయితీ రోడ్డు తవ్వేయడానికి కారణమైంది. మంచిప్పకు చెందిన ఓ రైతు శివలాల్ తండాకు వెళ్లే రోడ్డును పొక్లెయిన్తో శనివారం తవ్వించేశారు. -
ఉపాధి కల్పిస్తానని మోసం
[ 02-06-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రంలో దక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరిట విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసగించిన ఘటన శనివారం వెలుగుచూసింది. -
డిగ్రీ పరీక్షల్లో ముగ్గురి డిబార్
[ 02-06-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో నిజామాబాద్లోని ఇందూరు ఉషోదయ, బోధన్లోని ఎస్వీ, ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. -
అక్రమ కుళాయిలపై కొరడా
[ 02-06-2024]
నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అక్రమ కుళాయిలపై కొరడా ఝలిపించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు రంగం సిద్ధం చేశారు. -
కలెక్టరేట్లో వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదివారం ఉదయం 8.45కు వినాయక్నగర్లోని అమరవీరుల