logo

వంటపాత్రలో గర్భిణి తరలింపు

కొరాపుట్‌ జిల్లా బొరిగుమ్మ సమితి కటగుడ పంచాయతీ దంబతురుజి గ్రామంలో గురువారం పురిటినొప్పులతో బాధపడుతున్న దముల జానీ అనే మహిళను గ్రామస్థులు వంటపాత్రలో కూర్చోబెట్టి నది దాటించిన ఘటన

Published : 19 Aug 2022 03:25 IST

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా బొరిగుమ్మ సమితి కటగుడ పంచాయతీ దంబతురుజి గ్రామంలో గురువారం పురిటినొప్పులతో బాధపడుతున్న దముల జానీ అనే మహిళను గ్రామస్థులు వంటపాత్రలో కూర్చోబెట్టి నది దాటించిన ఘటన చర్చనీయాంశమైంది. గ్రామంలో శబరి నదిపై వంతెన లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నది నీటిమట్టం పెరిగి ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోయారు. తమ గ్రామంలో వంతెన నిర్మించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని