కొరాపుట్ లో త్రిముఖ పోరు
పదిహేనేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన కొరాపుట్ లోక్సభ స్థానంలో గతకొంత కాలంగా బిజద, కాంగ్రెస్లు నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి
రాయగడ పట్టణం, న్యూస్టుడే: పదిహేనేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన కొరాపుట్ లోక్సభ స్థానంలో గతకొంత కాలంగా బిజద, కాంగ్రెస్లు నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. తాజా పరిణామాలతో ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు కమలం(భాజపా) సైతం ధీటుగా పోటీనిస్తుండడంతో త్రిముఖ పోటీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో కేవలం 9 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న భాజపా 2019 నాటికి 19 శాతం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత గడిచిన ఐదేళ్లలో కొరాపుట్ లోక్సభ స్థానం పరిధిలో కాషాయం పార్టీ తన ఉనికిని మరింత చాటుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ఈ స్థానానికి కాంగ్రెస్ బిజదతోపాటు కమల దళం నుంచి గట్టిపోటీ ఎదురుకానుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 1957లో ఏర్పడిన కొరాపుట్ లోక్సభ స్థానం కాంగ్రెస్కు కంచుకోటగా నిలిచిన విషయం తెలిసిందే. తొలిసారిగా 1972లో కాంగ్రెస్ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన గిరిధర్ గమాంగ్, ఆ తరువాత ఏకధాటిగా మరో ఎనిమిది సార్లు ఈ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్కు తిరుగులేదన్న ముద్ర ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీగా తెరమీదకు వచ్చిన బిజద 2009లో ఈ స్థానాన్ని దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. బిజద తరఫున బరిలోకి దిగిన జయరాం పంగి, గిరిధర్ గమాంగ్పై గెలుపొందారు. ఆ తరువాత 2014లోనూ జీనూ హిక్కాక (బిజద) గెలుపొందడంతో ఇకపై కొరాపుట్ ఎంపీ స్థానం కాంగ్రెస్కు కష్టమే అన్న అభిప్రాయాలు అప్పట్లో కలిగాయి. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ 2019లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన సప్తగిరి ఉలక ఈ పీఠాన్ని దక్కించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలిగింది.
రెండు ర్గాలుగా బిజద
మరోవైపు బిజదకు ఇక్కడ మంచి ఉనికి ఉన్నప్పటికీ, చిన్నచిన్న పొరపాట్లు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాయగడలో ఇప్పటికే బిజద రెండు వర్గాలుగా చీలి బేదాభిప్రాయాలు తారస్థాయికి చేరుకోవడంతోపాటు తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఏమేర ప్రభావం చూపుతాయో అన్న సందేహాలు కలుగుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్చిన అధిష్ఠానవర్గం నిర్ణయానికి రెండు వర్గాలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయో అన్న అనుమానాలు రేగుతున్నాయి. దీనికితోడు భాజపా నుంచి జాతీయ స్థాయిలో ఆ పార్టీ ముఖ్య నేతల మన్ననలు పొందిన కాళీరాం మాఝి కమల దళం తరఫున బరిలోకి దిగుతుండడంతో ఇటు కాంగ్రెస్, అటు బిజదలకు గట్టి పోటీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఉన్నత విద్యావంతుడైన కాళీరాం 2008 నుంచి పార్టీలో కొనసాగుతూ భాజపా ఎస్టీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంత స్థాయిలో భాజపాకు అంతగా ఉనికి లేకపోవడం ప్రతికూలంశంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈసారి ఏమవుతుందో
గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో సప్తగిరి ఉలక చేతిలో ఓడిన బిజద అభ్యర్థి కౌసల్య హిక్కాకకు ఆ పార్టీ అధిష్ఠానం మరోసారి అవకాశమిచ్చింది. అయితే కొరాపుట్ లోక్సభ స్థానం పరిధిలో మొబైల్ నెట్వర్క్ సమస్య, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు, గుణుపురం - తెరువలి రైల్వేలైను, జోడియాలను ఆదివాసీలుగా గుర్తించడం, తాగునీటి సమస్య తదితర వాటిపై పార్లమెంట్లో గళం విప్పి, ఎంతోమంది మన్ననలు పొందిన ఉలకను ఓడించడం అంత సులభంకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొరాపుట్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో ఉలకాకు ఏర్పడిన భేదాభిప్రాయాలు ప్రతికూలంగా మారే అవకాŒం విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం