గమాంగ్ దంపతుల మద్దతు ఎవరికో?
రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన భార్య హేమా గమాంగ్ పేరు తెలియని వారుండరు. గిరిధర్ గమాంగ్కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది.
గుణుపురం, న్యూస్టుడే : రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన భార్య హేమా గమాంగ్ పేరు తెలియని వారుండరు. గిరిధర్ గమాంగ్కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన భార్య హేమాగమాంగ్ కూడా రాజకీయాలకు రాకముందు భర్తకు అన్ని రంగాల్లో సలహాలు, సహకారం అందించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గమాంగ్ దంపతులు పోటీలో లేరు. గుణుపురం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా గిరిధర్ బంధువులే కావడంతో మాజీ ముఖ్యమంత్రి దంపతుల మద్దతు ఎవరికి ఉంటుందోనన్న చర్చ సాగుతోంది.
పోటీకి దూరం
గిరిధర్ గమాంగ్ కాంగ్రెసులో సీనియర్ నాయకుడు. తొమ్మిదిసార్లు ఎంపీగా, పదేళ్లు కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా సేవలందించారు. ఆయన రాజీవ్గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మెలిగేవారు. తర్వాత కాంగ్రెస్ను వదిలి భాజపాలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక తిరిగి కాంగ్రెసు గూటికి వెళ్లారు. ఆయన భార్య హేమా గమాంగ్ గృహిణిగా ఉండి కొరాపుట్ ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చారు. తరువాత గుణుపురం ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెసుకు రాజీనామా చేసి బిజదలో చేరారు. గత ఎన్నికల్లో లక్ష్మీపురం నియోజకవర్గం నుంచి బిజద అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తరువాత ఆమె భర్త బాటలోనే కాంగ్రెసు గూటికి చేరారు. ఈ ఎన్నికలలో అఖిల భారత కాంగ్రెసు నాయకుల ఆశీర్వాదం ఉండడంతో హేమా గమాంగ్కు కాంగ్రెసు టికెట్ వస్తుందని ఆశ పడ్డారు. ఆ ఆశ నెరవేరలేదు. ప్రస్తుతానికి వీరి కుటుంబంలో ఎవరికీ టిక్కెట్ లేకపోవడంతో పోటీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఎన్నికల్లో వీరు ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతారోనన్న చర్చ సాగుతోంది. పోటీలో ఉన్న కాంగ్రెసు, బిజద, భాజపా అభ్యర్థుల ముగ్గురూ వీరికి బంధువులు కావడమే ఇందుకు కారణం. కాంగ్రెసు అభ్యర్థి సత్యజిత్ గమాంగ్ గిరిధర్ తమ్ముని కొడుకు. భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్న త్రినాథ్ గమాంగ్ గిరిధర్కు బావమరిది అవుతారు. బిజద ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ గమాంగ్ హేమాగమాంగ్కు మేనమామ వరస అవుతారు. దీంతో వీరి మద్దతుపై ఉత్కంఠ నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మశానంలో అలుముకున్న చీకట్లు
[ 03-05-2024]
జయపరం అభివృద్ధి కోసం పురపాలిక రూ. కోట్లు వెచ్చిస్తుంది.. కానీ స్మశానంలో వీధి దీపాలు లేక అంత్యక్రియలు నిర్వహించటానికి బంధంవులు అవస్థలు ఎదుర్కుంటున్నారు. -
విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద గ్రామస్థుల ఆందోళన
[ 03-05-2024]
గ్రామంలో నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ఆగ్రహించిన గ్రామస్థులు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. -
117 క్వింటాళ్ల విప్ప పువ్వు స్వాధీనం
[ 03-05-2024]
సార్వత్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నవరంగపూర్ జిల్లా పాలనాధికారి డా. కమల్ లోచన్ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా అబ్కారీ అధికారి అభిరామ్ బెహరా నేతృత్యంలో పలు చోట్లు తనిఖీలు జరుగుతున్నాయి. -
చోరీ కేసులను ఛేదించిన పోలీసులు
[ 03-05-2024]
ఏడు బంగారం చోరీ కేసులకు సంబంధం ఉన్న నిందితులను గురండి ఠాణా పోలీసులు ఛేదించారు పర్లాఖెముండి ఎస్డీపీవో కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎస్డీపీవో మాధవ నంద నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. -
తాగునీరు అందించకపోతే.. ఎన్నికలు బహిష్కరిస్తాం!
[ 03-05-2024]
ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురవక గజపతి జిల్లాలో తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. -
అప్పుడిచ్చారు... ఇప్పుడు అడుగుతున్నారు
[ 03-05-2024]
’హలో... ప్రకాష్ బాగున్నావా... నీ చదువుకు ఇబ్బందులేమీ లేవుగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇచ్చిన రూ.10 వేల ఉపకార వేతనం నీ చదువుకు కలిసొచ్చాయి కదా... -
వేసవి తుపానులు పొంచి ఉన్నాయ్
[ 03-05-2024]
ఇదివరకు రాష్ట్రానికి అక్టోబరు తుపానుల కాలంగా చెప్పుకునేవారు. కాల ప్రవాహంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో -
కంటాబంజిలో నవీన్ నామినేషన్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి నవీన ఈసారి రెండుచోట్ల పోటీకి దిగారు. మంగళవారం గంజాం జిల్లా హింజిలి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆయన గురువారం బొలంగీర్ జిల్లా కంటాబంజి -
భాజపాకు అవకాశమిచ్చి చూడండి: కేంద్రమంత్రి యాదవ్
[ 03-05-2024]
ప్రకృతి ప్రసాదించిన వనరులు, ఖనిజ సంపదకు నిలయమైన రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి చేయాలన్న ధ్యేయం గల భాజపాకు ఈసారి అవకాశమిచ్చి చూడండని కేంద్ర అటవీ -
బిజదకు ఓటేస్తే.. పాండ్యన్ పాలిస్తారు: భట్టి
[ 03-05-2024]
రాష్ట్రంలో పాలన దారి తప్పిందని, బిజద పార్టీకి ఓటు వేస్తే పాండ్యన్ పాలిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
కొండబాబు.. ఆంతర్యం ఏమిటో?
[ 03-05-2024]
ఆయన బిజద పార్టీలో సభ్యుడు కాడు. ఏ పదవికీ పోటీ చేయడం లేదు. పార్టీ నుంచి బహిష్కృతుడైనా పట్టువదలని విక్రమార్కుడిలా బిజద అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
పాల ప్యాకెట్లపై ఓటరు చైతన్యం
[ 03-05-2024]
ఎన్నికల యంత్రాంగం ఓటింగ్ శాతం పెంచడానికి తరచూ జన చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. -
అపరాజిత, మన్మథ్ల నామినేషన్ దాఖలు సమయంలో ఖుర్దా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
[ 03-05-2024]
ఖుర్దా కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా, బిజద కార్యకర్తలు జైశ్రీరాం, జైజై మోదీ, జైజగన్నాథ్, నవీన్ జిందాబాద్ నిదాదాలతో పార్టీ పతాకాలతో ప్రధాన
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు