ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ముహూర్త బలం నిర్ణయించుకొని కొంత సమయం వేచి ఉండైనా సరిగ్గా అదే సమయానికి ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. మంగళవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతోపాటు కొందరు స్వతంత్రులు కూడా తమ నామపత్రాలు సంబంధిత అధికారులకు అందించారు.
న్యూస్టుడే, బృందం
రాయగడ విధానసభ నియోజకవర్గం బిజద అభ్యర్థిని అనుసూయ మాఝి నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం జగన్నాథ మందిరం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, జిల్లా ఇన్ఛార్జి కృష్ణ మహాపాత్ర్, జగదీష్ పాత్ర్, మాజీ మంత్రి లాల్బిహారీ హిమిరిక పాల్గొన్నారు.
రాయగడ జిల్లా బిసంకటక్ అసెంబ్లీ బిజద అభ్యర్థి జగన్నాథ సరక భారీ ర్యాలీగా వెళ్లి అదనపు కలెక్టర్ భాస్కర్ చంద్ర రైత్కు నామినేషన్ పత్రం అందజేశారు
ప్రముఖ ఓలీవుడ్ హీరో, గంజాం జిల్లా దిగపొహండి అసెంబ్లీ నియోజకవర్గం భాజపా అభ్యర్థి సిద్ధాంత్ మహాపాత్ర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీగా బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు.
రాయగడ జిల్లా గుణుపురం విధానసభ నియోజకవర్గంలో మంగళవారం కాంగ్రెసు అభ్యర్థి సత్యజిత్ గమాంగ్, స్వతంత్ర అభ్యర్థి ఫాల్గుని సబర నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి, సబ్కలెక్టరు కిరణ్దీప్ కౌర్ సహొతాకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మశానంలో అలుముకున్న చీకట్లు
[ 03-05-2024]
జయపరం అభివృద్ధి కోసం పురపాలిక రూ. కోట్లు వెచ్చిస్తుంది.. కానీ స్మశానంలో వీధి దీపాలు లేక అంత్యక్రియలు నిర్వహించటానికి బంధంవులు అవస్థలు ఎదుర్కుంటున్నారు. -
విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద గ్రామస్థుల ఆందోళన
[ 03-05-2024]
గ్రామంలో నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ఆగ్రహించిన గ్రామస్థులు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. -
117 క్వింటాళ్ల విప్ప పువ్వు స్వాధీనం
[ 03-05-2024]
సార్వత్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నవరంగపూర్ జిల్లా పాలనాధికారి డా. కమల్ లోచన్ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా అబ్కారీ అధికారి అభిరామ్ బెహరా నేతృత్యంలో పలు చోట్లు తనిఖీలు జరుగుతున్నాయి. -
చోరీ కేసులను ఛేదించిన పోలీసులు
[ 03-05-2024]
ఏడు బంగారం చోరీ కేసులకు సంబంధం ఉన్న నిందితులను గురండి ఠాణా పోలీసులు ఛేదించారు పర్లాఖెముండి ఎస్డీపీవో కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎస్డీపీవో మాధవ నంద నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. -
తాగునీరు అందించకపోతే.. ఎన్నికలు బహిష్కరిస్తాం!
[ 03-05-2024]
ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురవక గజపతి జిల్లాలో తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. -
అప్పుడిచ్చారు... ఇప్పుడు అడుగుతున్నారు
[ 03-05-2024]
’హలో... ప్రకాష్ బాగున్నావా... నీ చదువుకు ఇబ్బందులేమీ లేవుగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇచ్చిన రూ.10 వేల ఉపకార వేతనం నీ చదువుకు కలిసొచ్చాయి కదా... -
వేసవి తుపానులు పొంచి ఉన్నాయ్
[ 03-05-2024]
ఇదివరకు రాష్ట్రానికి అక్టోబరు తుపానుల కాలంగా చెప్పుకునేవారు. కాల ప్రవాహంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో -
కంటాబంజిలో నవీన్ నామినేషన్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి నవీన ఈసారి రెండుచోట్ల పోటీకి దిగారు. మంగళవారం గంజాం జిల్లా హింజిలి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆయన గురువారం బొలంగీర్ జిల్లా కంటాబంజి -
భాజపాకు అవకాశమిచ్చి చూడండి: కేంద్రమంత్రి యాదవ్
[ 03-05-2024]
ప్రకృతి ప్రసాదించిన వనరులు, ఖనిజ సంపదకు నిలయమైన రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి చేయాలన్న ధ్యేయం గల భాజపాకు ఈసారి అవకాశమిచ్చి చూడండని కేంద్ర అటవీ -
బిజదకు ఓటేస్తే.. పాండ్యన్ పాలిస్తారు: భట్టి
[ 03-05-2024]
రాష్ట్రంలో పాలన దారి తప్పిందని, బిజద పార్టీకి ఓటు వేస్తే పాండ్యన్ పాలిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
కొండబాబు.. ఆంతర్యం ఏమిటో?
[ 03-05-2024]
ఆయన బిజద పార్టీలో సభ్యుడు కాడు. ఏ పదవికీ పోటీ చేయడం లేదు. పార్టీ నుంచి బహిష్కృతుడైనా పట్టువదలని విక్రమార్కుడిలా బిజద అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
పాల ప్యాకెట్లపై ఓటరు చైతన్యం
[ 03-05-2024]
ఎన్నికల యంత్రాంగం ఓటింగ్ శాతం పెంచడానికి తరచూ జన చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. -
అపరాజిత, మన్మథ్ల నామినేషన్ దాఖలు సమయంలో ఖుర్దా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
[ 03-05-2024]
ఖుర్దా కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా, బిజద కార్యకర్తలు జైశ్రీరాం, జైజై మోదీ, జైజగన్నాథ్, నవీన్ జిందాబాద్ నిదాదాలతో పార్టీ పతాకాలతో ప్రధాన
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు