బొలంగీర్ కోట రాణి సంగీతా సొంతమయ్యేనా?
పశ్చిమ ఒడిశాలోని బొలంగీర్ కోట (లోక్సభ స్థానం)ను మళ్లీ రాణి సంగీతా కుమార్ సింగ్దేవ్ సొంతం చేసుకోగలరా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.
ఈసారి సవాల్ విసురుతున్న సరేంద్ర, మనోజ్
భువనేశ్వర్, న్యూస్టుడే: పశ్చిమ ఒడిశాలోని బొలంగీర్ కోట (లోక్సభ స్థానం)ను మళ్లీ రాణి సంగీతా కుమార్ సింగ్దేవ్ సొంతం చేసుకోగలరా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇద్దరు ఉద్ధండులు ఆమెకు సవాల్ విసురుతున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో ఎవరిది ‘పైచేయి’ అన్నదానిపై పరిశీలకులంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
రాజపరివారానికి విశేషాదరణ
బొలంగీర్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ సంగీతా మళ్లీ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, మాజీ మంత్రి సురేంద్ర సింగ్ భోయ్ ఇటీవల కాంగ్రెస్ను వీడి బిజద గూటికొచ్చారు. ఆ పార్టీ తరఫున బొలంగీర్ అభ్యర్థి అయ్యారు. ప్రముఖ సినీనటుడు మనోజ్ మిశ్ర కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బొలంగీర్ స్థానంలో రాజపరివారానికి చెందినవారిని ఓటర్లు చాలాసార్లు గెలిపించారు.
ఆయన మిస్టర్ ఇండియా
బిజద అభ్యర్థి సురేంద్ర విషయానికొస్తే దేహదారుఢ్య పోటీల్లో ‘మిస్టర్ ఇండియా’ అవార్డు సాధించిన వ్యక్తి. ఎన్నో పోటీల్లో పాల్గొని రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపజేశారు. కాంగ్రెస్లో చేరి రెండుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి మంత్రిగాను విధులు నిర్వహించారు. గతసారి పరాజయం పాలయ్యారు. ఇటీవల కాంగ్రెస్ను వీడి బిజదలో చేరిన సురేంద్రకు సీఎం నవీన్ లోక్సభ అభ్యర్థిగా పోటీకి నిలిపారు. తనను గెలిపిస్తే పరిశ్రమలు లేని బొలంగీర్లో ఉపాధి కల్పనకు బాటలు వేసి వలసలకు అడ్డుకట్ట వేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. సీఎం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతున్నారు. లోయర్ సుక్తేల్ నీటిపారుదల ప్రాజెక్టు స్థాయి పెంచి వ్యవసాయక్షేత్రాలను సస్యశ్యామలం చేసి అన్నదాలకు అండగా ఉంటానని హామిలిస్తున్నారు.
సంగీతాకుమారీ సింగ్దేవ్ ప్రచారం
విస్తృత ప్రచారం
సంగీతా 2004, 2009, 2019లలో లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఆమె మరిది కాళికేష నారాయణ్ సింగ్దేవ్ గెలిచారు. బొలంగీర్ రాజు దివంగత రాజేంద్ర నారాయణ సింగ్దేవ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన సంగతి తెలిసిందే. నాలుగోసారి లోక్సభకు ఎన్నికవుతానన్న దృఢవిశ్వాసం వ్యక్తం చేస్తున్న సంగీతా సింగ్దేవ్ విస్తృత ప్రచారం చేస్తున్నారు.
రియల్ హీరోగా పనులు చేస్తా
వెండి తెరపై హీరోగా, క్యారెక్టర్ నటునిగా మెప్పించిన తాను ఒక రియల్ హీరోగా ప్రజలకు సేవలు చేస్తానంటున్నారు బొలంగీర్ వాసినైన తనకు ఈ ప్రాంత సమస్యలు తెలుసని, రాజకీయ రంగ ప్రవేశం చేసి వాటిని నెరవేర్చాలన్న ఆశయంతో వచ్చానని, ఆదరించాలని ఓటర్లను కోరుతున్నారు.
పోరు రసవత్తరం
బొలంగీర్లో ఈ ముగ్గురు యోధుల పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో ఉంది. విజయాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న వీరు అన్నివర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వలసలకు చిరునామాగా నిలుస్తున్న ఈ ప్రాంతంలో ఓటర్లు ఈసారి ఎవర్ని ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనేశ్వర్లో రూ.5 కోట్లు స్వాధీనం
[ 14-05-2024]
భువనేశ్వర్ సూర్యనగర్ ప్రాంతంలో ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) అధికారులు ఒక కారు నుంచి మంగళవారం సాయంత్రం రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
జూన్ 17న గ్రామ దేవత బురదల పొలమ్మ ఉత్సవాలు
[ 14-05-2024]
రాయగడ పట్టణ ప్రజల ఇలావేల్పు గ్రామదేవత బురదల పొలమ్మ అమ్మవారి ఉత్సవాలు జూన్ 17న ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. -
బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. ప్రిసైడింగ్ అధికారి మృతి
[ 14-05-2024]
ఎన్నికల పనులు ముగించి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ప్రిసైడింగ్ అధికారి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కాన్గిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. -
రాజధాని స్థానం... ఎవరి సొంతం?
[ 14-05-2024]
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రాజధాని నగరంలో ఎన్నికల వేడి ఎండ తీవ్రతను మించిపోయింది. -
ఓటేసిన అభ్యర్థులు.. ప్రముఖులు
[ 14-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
స్వల్ప ఘటనలు మినహా తొలివిడత ప్రశాంతం
[ 14-05-2024]
రాష్ట్రంలో సోమవారం తొలివిడత పోలింగులో స్వల్ప ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజబిహారీ ధొళో భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
పోలింగ్ బహిష్కరణ...
[ 14-05-2024]
మొదటివిడత పోలింగు రోజున పలు జిల్లాల్లోని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. -
ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్లో అక్రమానికి పాల్పడిన ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళొ సోమవారం సాయంత్రం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఉత్సాహంగా ఓట్ల పండగలో...
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ సోమవారం పూర్తయింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఆనందమానందమాయె
[ 14-05-2024]
చందనయాత్ర నేపథ్యంలో పూరీ తూర్పు తీరధామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. -
బైజయంత్కు మతి భ్రమించింది: అమర్
[ 14-05-2024]
భాజపా నేత బైజయంత్ పండాకు మతి భ్రమించిందని బిజద అధికార ప్రతినిధి అమర్ పట్నాయక్ అన్నారు. -
మూడు ట్రక్కుల ఢీ
[ 14-05-2024]
ఘటాల్- పంచుకురా రహదారిపై ఆదివారం మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక