logo

నామినేషన్ల జోరు

జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు.

Published : 25 Apr 2024 04:29 IST

నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న అదితి

విజయనగరం అర్బన్‌, ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. కాంగ్రెస్‌ నుంచి బొబ్బిలి శ్రీను, నవ భారత నిర్మాణ సేవా పార్టీ అభ్యర్థిగా వంగపండు మహేశ్వరరావు, వైకాపా అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్‌ ఒక్కో సెట్‌ను రిటర్నింగ్‌ అధికారిణి, కలెక్టర్‌ నాగలక్ష్మికి అందజేశారు. అసెంబ్లీ స్థానాలకు 31 మంది అభ్యర్థులు 45 నామపత్రాలు ఇచ్చారు. వీరిలో అదితి గజపతిరాజు (విజయనగరం అసెంబ్లీ), ఎస్‌.కోటలో తెదేపా తరఫున కోళ్ల లలిత కుమారి, చీపురుపల్లిలో కళా వెంకటరావు, రాజాంలో వైకాపా నుంచి తలే రాజేష్‌ తదితరులున్నారు.

చీపురుపల్లిలో కళావెంకటరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని