అందలంపై నీవు.. అంధకారంలో మేము
గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు..
గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు.. వీధిదీపాల వ్యవస్థను అస్తవ్యస్తం చేసేశారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రత్యేక ఏజెన్సీని సాగనంపేశారు.. మరోవైపు పురపాలికలకూ నిధులివ్వక దిక్కుతోచని పరిస్థితిని దరిచేర్చారు.. ఇదీ జగనన్న చీకటి రాజ్యం..
న్యూస్టుడే, రాజాం, బొబ్బిలి, విజయనగరం పట్టణం, నెల్లిమర్ల
ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో రాత్రయితే చీకట్లు రాజ్యమేలుతున్నాయి. వీధి దీపాల నిర్వహణ భారంగా మారడంతో పురపాలికలు పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. నిధులు కొరతా వెంటాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఈఈఎస్ఎల్ సంస్థ దీపాల బాధ్యతను చూసుకునేది. ఏడేళ్ల పాటు పనులు చేసేందుకు ముందుకొచ్చింది. ఈమేరకు 2016లోనే పురపాలికలతో ఒప్పందం చేసుకుంది. ఒక్క విజయనగరం నగరపాలక సంస్థ అప్పట్లో నెలకు రూ.16 లక్షలు చెల్లించేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నిర్వహణ కొనసాగించింది. అయితే జగన్ సర్కారు హయాంలో సకాలంలో నిధులు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో గడువు ముగిశాక తప్పుకొంది.
రాజాం పరిధిలోని విజయనగరం రోడ్డులో స్తంభాలకు వీధిదీపాలు లేని దృశ్యం
జిల్లాలో ఇలా..
- రాజాం పట్టణ పరిధిలోని ప్రధాన, పాలకొండ, బొబ్బిలి, శ్రీకాకుళం రహదారుల్లో కొన్ని దీపాలు వెలగడం లేదు. విజయనగరం రహదారిలోని గాయత్రీ కాలనీ వరకూ అంధకారం నెలకొంటోంది. రహదారి విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం, దీనికి అంధకారం తోడవడంతో రాత్రివేళల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రాంతాలు, శివారు కాలనీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
- నెల్లిమర్ల, జరజాపుపేటలోని ప్రధాన రోడ్లలోనే దీపాల్లేవు. కీలకమైన రామతీర్థం కూడలి, గాంధీనగర్లోనూ ఇదే దుస్థితి.
- బొబ్బిలిలో ప్రధానమైన ఇందిరమ్మకాలనీలో ఏళ్లనుంచి సమస్య ఉంది. ఇక్కడ కొత్తతీగల కోసం రూ.20 లక్షల నిధులు కేటాయించారు. ఇంతవరకు పనుల్లేవు. ఇక్కడ 3 వేల గృహాలుండగా.. రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు.
నగరపాలికలో ఘోరం..
జిల్లా కేంద్రంలోని 27 డివిజన్లలోని వీధుల్లో సమస్య తీవ్రంగా ఉంది. గతంలో రహదారులను విస్తరించి, సెంట్రల్ లైటింగ్ కోసం ప్రతిపాదించినా.. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. నిత్యం జిల్లా అధికారులు తిరిగే కలెక్టరేట్ ఇన్గేటు నుంచి ఎన్టీఆర్ విగ్రహ కూడలి వరకు నిత్యం అంధకారం నెలకొంటోంది. శివారు, విస్తరించిన ప్రాంతాల్లో కొత్తగా 500 వరకు దీపాలు వేయాలి. మూడో విద్యుత్తు లైన్ కోసం రూ.94 లక్షలను నగరపాలక అధికారులు ఈపీడీసీఎల్కు చెల్లించారు. అయినా పనులు సక్రమంగా జరగలేదు. నగరపాలిక పరిధిలో నిర్వహణ పనుల కోసం ఓ ప్రైవేటు సంస్థ ఏడాదికి రూ.1.53 కోట్లతో టెండర్లు దక్కించుకుంది. కానీ అంధకారం కనిపిస్తోంది.
బొబ్బిలిలోని బాలాజీ నగర్లో పరిస్థితి ఇదీ..
సకాలంలో పనులు చేయడం లేదు..
అంబటిసత్రం ప్రధాన దారిలో 15 రోజుల నుంచి వీధిదీపాలు వెలగడం లేదు. రాత్రి వేళల్లో చీకటిగా ఉంటోంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పనులు చేయడం లేదు.
షఫీ, మెకానిక్, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొఠియాపై సర్కారు ఖిన్ను
[ 12-05-2024]
రాష్ట్రాల విభజన సమయంలో కొఠియాలోని 21 గ్రామాలపై వివాదం నెలకొంది. 1965లో ఆ గ్రామాలు తమవేనని ఒడిశా తొలిసారి కోర్టుకు వెళ్లగా స్టేటస్కో ఇచ్చింది. -
291 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. నాలుగు నియోజకవర్గాల్లో 7,83,440 మంది ఓటర్లు ఉన్నారు. -
మైళ్లకొద్ది నడవాలి.. కొండలు, వాగులూ దాటి వెళ్లాలి
[ 12-05-2024]
పాచిపెంట మండలంలో గిరిశిఖర గ్రామాల ప్రజలు ఓటేయాలంటే వాగులు, వంకలు దాటాలి. మైళ్ల దూరం నడిచి పోలింగు కేంద్రాలకు చేరుకోవాలి. కొండల మీదుగా ఉన్న అధ్వానదారులతో నరకయాతన పడాలి. -
‘మందు’ జాగ్రత్త..
[ 12-05-2024]
సాధారణ ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం నుంచి మద్యనిషేధం అమల్లోకి వచ్చింది. ఉదయం మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. -
ఎన్నికల ప్రచారానికి తెర
[ 12-05-2024]
సాధారణ ఎన్నికల ప్రచారం శనివారం ముగియడంతో రాజకీయ పార్టీల ప్రచార వాహనాలు పార్టీ కార్యాలయాలకు చేరాయి. -
ఎన్నికలలో!!
[ 12-05-2024]
కర్ర ఒంపును పొయ్యి తీస్తుందంటారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించి వేధిస్తే జనాలకూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు మాత్రం ఓటరే మారాజు. -
ఖాకీలపైనే లాఠీన్యం
[ 12-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించే వారికి జగన్ పెద్ద టోపీˆయే పెట్టారు.