రాజీనామాకు ఒక్కరోజే గడువట!
వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి..
వాలంటీర్లపై వైకాపా నేతల ఒత్తిడి
సాలూరు, న్యూస్టుడే: వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి.. ‘ప్రభుత్వ ఆదేశాలొచ్చాయి. తప్పనిసరిగా రాజీనామాలు చేయాలి.. మీకు పార్టీ తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తాం.. అని చెప్పినట్లు సమాచారం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు ఉన్నారు. ప్రతి కుటుంబం వ్యక్తిగత సమాచారం, పథకాల లబ్ధి వివరాలు వారి దగ్గర ఉన్నాయి. అందుకే ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను వినియోగిస్తే ఓట్ల లబ్ధి పొందవచ్చని ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. సాలూరు పురపాలిక పరిధిలో పలు వార్డు వాలంటీర్లను వైకాపా కౌన్సిలర్లు కలిసి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరు బుధవారం నాటికి రాజీనామా పత్రాలను సమర్పించాలని హుకుం జారీ చేశారట. రాజీనామాలపై పునరాలోచన చేయాలని కొంతమంది వాలంటీర్లు కోరినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి మూకుమ్ముడిగా రాజీనామాలు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులకు దూరం.. సేవలకు రాంరాం
[ 16-05-2024]
రైతుల కోసం... వారి ప్రయోజనం కోసం ఉద్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు ఉనికిని కోల్పోతున్నాయి. గతంలో పలు రకాల సేవలందించినా.. నేడు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. -
130 స్థానాలకు పైగా విజయం సాధిస్తాం
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 130కి పైగా స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు -
ఓటరు మారాజులు 17,35,958
[ 16-05-2024]
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 106 మంది అభ్యర్థులు నిలిచారు. -
శ్రమ ఎక్కువ.. పారితోషికం తక్కువ
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రెమ్యూనరేషన్ (పారితోషికం), టీఏ/డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని రెండు జిల్లాల సిబ్బంది ఆరోపించారు. -
ఇంజినీరింగ్కే మొగ్గు
[ 16-05-2024]
నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆన్లైన్ విధానంలో ఎనిమిది రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రోజుకు రెండు షిప్టులుగా పరీక్షలు జరుగుతాయి. -
ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ప్రారంభం
[ 16-05-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు బుధవారం నుంచి ప్రారంభమైనట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.ఆదినారాయణ తెలిపారు. -
జేఎన్టీయూలో ఈవీఎంల భద్రత
[ 16-05-2024]
ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్రూంలో భద్రపర్చే చర్యలు తీసుకున్నారు. -
అమ్మకు నిస్సత్తువ..!
[ 16-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు గత కొన్నేళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
ఇంతులు..చైతన్య కాంతులు
[ 16-05-2024]
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. మొత్తం 15,62,921 మందిలో 7,92,038 మంది వీరే ఉన్నారు. -
జాతీయ భాగ్యం.. పాలకుల నిర్లక్ష్యం
[ 16-05-2024]
జిల్లాలతో పాటు పక్కనున్న ఒడిశా రాష్ట్రాన్ని కలిపే కీలక మార్గం. నిత్యం వాహనాల రద్దీ ఎక్కువ. సరకులు, ఇతరత్రా ఉత్పత్తుల రవాణా లారీలు, ప్రయాణికుల బస్సులు, ఇతర వాహనాలు భారీగా రాకపోకలు సాగిస్తుంటాయి -
అంబులెన్స్ల నిర్వహణ గాలికి
[ 16-05-2024]
పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రికి రోజుకు 550 నుంచి 600 మధ్య ఓపీ ఉంటుంది. 150 పడకల ఆసుపత్రిలో 200 మంది వరకు ఇన్పేషెంట్లు ఉంటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?