logo

అదుపు తప్పి బస్సు బోల్తా

ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటన కొండపి మండలం గుర్రపడియ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఒంగోలు డిపోకు చెందిన బస్సు... మర్రిపూడి మండలం చిలంకూరు నుంచి ప్రయాణికులతో బయలుదేరింది.

Published : 14 Aug 2022 02:31 IST

అయిదుగురికి స్వల్ప గాయాలు


పొలంలో పడిపోయిన బస్సు

కొండపి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటన కొండపి మండలం గుర్రపడియ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఒంగోలు డిపోకు చెందిన బస్సు... మర్రిపూడి మండలం చిలంకూరు నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. గుర్రపడియ వద్దకు రాగానే మలుపులో చోదకుడు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రహదారి అంచులో ఓ వైపునకు ఒరిగి బోల్తా పడింది. బస్సులో ఉన్న అయిదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్థులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే బస్సులో... తక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ట్రాక్టర్ల సాయంతో బస్సును పైకి తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని