134 ఎకరాలు హాంఫట్
రూ. కోట్ల విలువైన దేవుడి మాన్యాలు ఆక్రమణ చెరలో చిక్కాయి. దక్షిణ సింహాచలంగా గణతికెక్కిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని విక్రయిస్తున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది
కబ్జా చెరలో దేవుడి మాన్యాలు
చక్రం తిప్పుతున్న వైకాపా నేతలు
కలెక్టర్ ఆదేశాలు అమలయ్యేనా ?
నరసింహస్వామి ఆలయ చిత్రం
రూ. కోట్ల విలువైన దేవుడి మాన్యాలు ఆక్రమణ చెరలో చిక్కాయి. దక్షిణ సింహాచలంగా గణతికెక్కిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని విక్రయిస్తున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఈ అంశం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించి ఆక్రమణదారులపై కొరడా ఝుళిపించాలని ఆదేశాలివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధూప దీప నైవేద్యాల నిమిత్తం నెల్లూరు, గూడూరు, ఒంగోలు, సింగరాయకొండ ప్రాంతాల్లోని 693.47 ఎకరాల భూములు దాతలు అందజేయగా, అందులో రెండొందల ఎకరాల వరకూ అన్యాక్రాంతమయ్యాయి. ఒక్క పాత సింగరాయకొండ పరిధిలోనే 134 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలో ఉన్న భూముల్ని స్వాధీన పరచుకోవాలని అయిదేళ్ల క్రితం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినా, నేటికీ చర్యలు లేవు. ఆరు నెలల క్రితం ఆలయ పాలకవర్గం ఏర్పడినప్పుడు ఆస్తులను పరిరక్షిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా నేటికీ క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు.
బోర్డులు ఏర్పాటుచేసినా..
ఇటీవల ఆలయానికి కూతవేటు దూరంలోని 607 సర్వే నంబరులోని 2.98 ఎకరాలు చదును చేసి కబ్జాకు తెరదీయగా, ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఆలయానికి చెందిన భూమి అంటూ బోర్డు ఏర్పాటుచేసినా, స్థానిక వైకాపా నాయకుడు బరితెగించి రూ.3 కోట్లకు ఇక్కడి భూముల్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడని సమాచారం. అధికార పార్టీ నాయకుల ఒత్తిడులకు తలొగ్గి ఆక్రమణదారులపై అధికారులు చర్యలు చేపట్టడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతసింగరాయకొండ పంట చెరువుకు వెళ్లే ప్రధాన కాల్వను సైతం ఆక్రమించి కొందరు అమ్మకాలు సాగించారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. స్వామివారికి వందల ఎకరాల భూములున్నా ఆలయంలో నిత్యం అన్నదానాలకు, ధూప దీప నైవేద్యాలకు దాతల సహకారం కోసం ఎదురు చూడాల్సిన దీనస్థితి దాపురించింది.
జామాయిల్ తోటలు సాగుచేసి..
పాతసింగరాయకొండ మల్లికార్జున నగర్ ఎస్టీ కాలనీకి తూర్పు వైపున జాతీయ రహదారిని ఆనుకుని సర్వే నెం.105/1లో 1.61, 106/1,2,3,4,5ల్లో 9.47 ఎకరాలు ఆలయం పేరిట నమోదై ఉన్నాయి. ఈ భూములను కొంతమంది అనధికారిక కౌలు పేరుతో స్వాధీనం చేసుకుని నాలుగు దశాబ్దాలుగా జామాయిల్ తోటలు సాగు చేసుకుంటున్నారు. వాటి ద్వారా రూ.లక్షల ఆదాయాన్ని అక్రమంగా ఆర్జిస్తున్నారు. గ్రామ పరిధిలోని అయ్యప్ప నగర్ ప్రాంతంలో సర్వే నెం.116లో 5.92, 117లో 7.30 ఎకరాలు స్వామివారి పేరిట ఉండగా, అధికారుల పర్యవేక్షణ కొరవడి ఇది కాస్తా అన్యాక్రాంతమైంది. గతంలో విధులు నిర్వహించిన ఆలయ అధికారులు, పాలక మండలి సహకారంతో పలువురు కబ్జాలకు పాల్పడి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా ఆలయ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
రొయ్యల చెరువులుగా మారినా..
పాత సింగరాయకొండ పరిధిలోని సర్వే నెం.356/2,3లో 5.47, 357లో 5.42, 367లో 8 ఎకరాల భూములను కొందరు రొయ్యల చెరువులుగా సాగు చేసుకుంటున్నారు. వీరిపైనా చర్యలు శూన్యం. ఇక్కడి ఆలయం పేరిట ఉన్న 134 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు దస్త్రాలు మంజూరు చేసి అయిదేళ్లు అయినా నేటికీ అధికారులు భూములు స్వాధీన పరచుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొండపి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ దినేష్కుమార్ ఆలయ భూముల కబ్జాపై సమీక్షించారు. అన్యాక్రాంతమైన భూముల్ని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
చట్టపరమైన చర్యలు చేపడతాం
నరసింహ స్వామి ఆలయం పేరిట ఉన్న భూములు కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు చేపడతాం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను, మండలంలోని భూములను సర్వే చేయించి స్వాధీనం చేసుకుంటాం.
ఈవో కృష్ణవేణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
[ 16-05-2024]
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. -
కాలిపోయిన కంటి‘పాప’..
[ 16-05-2024]
అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పెద్దమ్మ ఇంటి వద్ద వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న ఆ చిన్నారిని చూసి విధికి కన్ను కుట్టింది. -
ఓటెత్తిన జనం.. మనమే ప్రథమం
[ 16-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లా ప్రజలు ఓటెత్తారు. ప్రకాశం నలుమూలలా స్ఫూర్తి పరిఢవిల్లేలా చేశారు. -
దొంగలకు పోలీసుల వత్తాసు
[ 16-05-2024]
ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిన వారిని వదిలి.. అడ్డుకున్న వారిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. -
గిరిజనంతో మూడు ముక్కలాట
[ 16-05-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి చెంచు గిరిజనులు అండగా నిలుస్తున్నారు. అటువంటి వారిని ఆ పార్టీ ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి గురిచేసింది. -
పట్టుదలే విజయానికి మెట్టు
[ 16-05-2024]
‘అపజయాలు పలకరించినా కుంగిపోవద్దు. ఎందరు నిరాశపరిచినా తగ్గొద్దు. ఎంచుకున్న లక్ష్యం నుంచి మళ్లొద్దు. -
నిధులివ్వక వ్యధ
[ 16-05-2024]
లక్షలాదిమంది తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే చెరువుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. -
ఉపశమనానికో ఉపాయం
[ 16-05-2024]
రోజు రోజుకీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకే బెంబేలెత్తుతున్నారు. -
డయాలసిస్ రోగులతో చెలగాటం
[ 16-05-2024]
వారికి వారంలో రెండు మూడుసార్లు డయాలసిస్ చేస్తేనే ప్రాణం దక్కేది. -
నాసిరకం ఐస్క్రీం.. విక్రయాలపై కేసులు
[ 16-05-2024]
పొదిలిలో ఐస్క్రీమ్ బండ్ల వారు విక్రయిస్తున్న ఐస్క్రీముల్లో నాణ్యత లోపించడంతో వారిపై కేసులు నమోదు చేశారు. -
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం పోలింగ్తో ముగిసింది. మార్కాపురం నియోజకవర్గంలో గతంలో నమోదు కానీ పోలింగ్ శాతం నమోదైంది. -
ఓటేశాం.. వెళ్లొస్తాం
[ 16-05-2024]
ఓట్ల పండుగ సోమవారంతో పూర్తయింది. -
అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు
[ 16-05-2024]
కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటనలో తెదేపా నాయకుడితో పాటు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. -
వై.పాలెం తహసీల్దార్, సర్వేయర్కు గాయాలు
[ 16-05-2024]
లారీ-కారు ఢీకొన్న ప్రమాదంలో వై.పాలెం తహసీల్దారుకు గాయాలైన సంఘటన మండలంలోని తోకపల్లి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం