హడావుడి ఎక్కువ.. కొనుగోలు తక్కువ
ధాన్యం కొనుగోలు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు తెచ్చింది. కానీ ఆచరణలో మాత్రం పలు అడ్డంకుల వల్ల అన్నదాతలకు అవస్థలు తప్పలేదు.
ధాన్యం చేతికొచ్చినా అమ్ముకోలేని పరిస్థితి
న్యూస్టుడే, నరసన్నపేట, సారవకోట, జలుమూరు
కరగాంలో కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం
ధాన్యం కొనుగోలు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు తెచ్చింది. కానీ ఆచరణలో మాత్రం పలు అడ్డంకుల వల్ల అన్నదాతలకు అవస్థలు తప్పలేదు. మిల్లర్ల ప్రమేయం లేకుండా సేకరిస్తామని ఓ మంచి ఆలోచనను అమల్లోకి తెచ్చినా అధికారులు, సిబ్బంది సమన్వయ లోపంతో ఆదిలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని పరిస్థితులే ఇందుకు ఉదాహరణ..
నియోజకవర్గంలో 68 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జలుమూరు, సారవకోట మండలాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు మండలాల్లో రైతులు ధాన్యం విక్రయించేందుకు ఎదురు చూస్తున్నారు. సారవకోట మండలంలో ఆరు, జలుమూరు మండలంలో 8 ప్రాంతాల్లో చేపట్టినా అంతంతమాత్రంగా సాగుతోంది. నరసన్నపేటలో ఒక్కటీ తెరవకపోగా, పోలాకిలో ఒకే ఒకటి తెరిచినా ఒక్క గింజా కొనలేదు. నరసన్నపేట మండలంలో ఇప్పటివరకు 15 మంది రైతులకు ఆర్బీకేల ద్వారా షెడ్యూలు ప్రకటించారు. గతనెల 26న కరగాం, రావులవలస, చిక్కాలవలస వంటి ఆరు గ్రామాల్లోని ధాన్యం సిద్ధంగా ఉంచాలని చెప్పారు. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు ధాన్యాన్ని సిద్ధంగా ఉంచినా ఇప్పటికీ కొనలేదు. మరోవైపు త్వరలో వాయుగుండం ప్రకటనతో అన్నదాతల్లో భయం వెంటాడుతోంది. సారవకోట మండలంలోని పలు కేంద్రాల్లో గత శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో రైతులు రోజంతా ఆయా కేంద్రాల పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు ఇందుకు అవసరమైన డేటాఎంట్రీ ఆపరేటర్ల నియామకం ఇంతవరకు జరగకపోవడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
వారం రోజులుగా కల్లాల్లోనే నిల్వ
- పంగ శ్రీరాములు, రైతు, కరగాం, నరసన్నపేట
గతనెల 26న ధాన్యం కొంటామని ఆర్బీకే నుంచి నాకు సూక్ష్మసందేశం వచ్చింది. దీంతో నేను 200 బస్తాల ధాన్యాన్ని కళ్లాల్లోనే నిల్వ ఉంచాను. వాటిని కాపాడుకోవడం కష్టంగా మారింది. సమాచారం వచ్చి వారం రోజులైనా ఇప్పటివరకు కొనలేదు.
వేగవంతం చేస్తున్నాం
- కె.రవీంద్రభారతి, ఏడీ వ్యవసాయశాఖ
నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే జలుమూరు, సారవకోట మండలాల్లో రైతుల నుంచి సేకరిస్తున్నాం. సాంకేతిక సమస్యలు అధిగమించి ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతిలో అధికారం.. చేసేదంతా అ‘ధర్మం’..!
[ 11-05-2024]
ఆయనో రాజకీయ దురంధరుడు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్నని, తన మాటలతో ఎంతటి వారినైనా అలవోకగా నమ్మించేస్తారు. -
ఉద్యోగాలేవీ.. ఉపాధి ఉసేది జగన్?
[ 11-05-2024]
గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు.. స్థానిక ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకేనని డప్పుకొట్టారు.. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన.. ఇలా.. యువతకు చెప్పనిది లేదు. -
పర్యాటకాన్ని మడతపెట్టేశారు..!
[ 11-05-2024]
జిల్లాలో సహజసిద్ధ పర్యాటక సొబగులు ఎన్నో ఉన్నాయి.. వాటిని పర్యాటకులకు అనుకూలంగా అభివృద్ధి చేస్తే జిల్లాలో ఈ రంగానికి ఎంతో ఆదరణ లభిస్తుంది. -
పేరుతో కిరణం.. ప్రగతిలో అంధకారం..!
[ 11-05-2024]
గత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హామీలు గుప్పించారు. ఆయన అధికారంలోకి వస్తే నియోజకవర్గ రూపురేఖలు మారతాయని నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. -
ప్రచారానికి నేటితో తెర
[ 11-05-2024]
ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. -
సభాపతికి నిరసన సెగ
[ 11-05-2024]
శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది. -
ఎమ్మెల్యే కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదు
[ 11-05-2024]
నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులను ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అహంకార పూరితంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ కోశాధికారి పిసిని జగన్నాథం ఆరోపించారు. -
మట్టి రోడ్లే గతి.. పడకేసిన ప్రగతి
[ 11-05-2024]
ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో శివారు ప్రాంతాలతో పాటుగా కాలనీల్లో శాశ్వత రహదారులు లేకపోవడంతో ఆయా ప్రాంతాల వాసులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. -
మహిళా సంక్షేమం.. తెదేపా ధ్యేయం
[ 11-05-2024]
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలతోపాటు ప్రత్యేక పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తెదేపా ధ్యేయమని పలాస, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు గౌతు శిరీష, అశోక్ అన్నారు. -
ప్రముఖుల చేరిక
[ 11-05-2024]
ఇచ్ఛాపురం పురపాలకసంఘం 23వ వార్డు మాజీ కౌన్సిలర్ బాసి పార్వతీశం, దోనీ రాజు, మరికొంత మంది ముఖ్యనాయకులు, కార్యకర్తలతో తెదేపాలో చేరారు. -
ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
[ 11-05-2024]
పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు ఎం.సురేష్ అన్నారు. -
మిత్రుడి కుటుంబానికి ఆపన్న హస్తం
[ 11-05-2024]
మండలం పరిధి ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేష్ పోలాండ్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. -
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 11-05-2024]
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రధానాచార్యులు ఎల్.సుధాకరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!