నాలుగో రోజు.. నామినేషన్ల హోరు..!
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు.
మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి నలుగురు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు కూటమి శ్రేణులతో కలిసి ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్కువగా ఆమదాలవలస అసెంబ్లీ స్థానం నుంచి ఆరుగురు అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు పత్రాలు అందజేశారు. పలు నియోజకవర్గాల్లో తెదేపా, వైకాపా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో సందడి నెలకొంది. టెక్కలి, పలాస, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లో తెదేపా, వైకాపా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడంతో ఆయా చోట్ల ఎన్నికల వేడి మరింత పెరిగింది.
టెక్కలి: ర్యాలీలో పాల్గొన్న కూటమి శ్రేణులు
కాంగ్రెస్ అయిదుగురు.. స్వతంత్రులు ముగ్గురు..
కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం నుంచి అంబటి కృష్ణారావు, సనపల అన్నాజీరావు(ఆమదాలవలస), కె.మల్లేశ్వరరావు(ఎచ్చెర్ల), కె.రమేష్(ఎచ్చెర్ల), మంత్రి నరసింహమూర్తి(నరసన్నపేట), స్వతంత్ర అభ్యర్థులుగా మురపాల లక్ష్మి(ఇచ్ఛాపురం), కె.గోవిందరావు (పాతపట్నం), సనపల సురేష్ కుమార్ (ఆమదాలవలస), బీఎస్పీ తరఫున ఎల్.సోమేశ్వరరావు (ఆమదాలవలస), జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా జి.రేవతి(ఆమదాలవలస), భారత పిరమిడ్ పార్టీ నుంచి కోనేటి నీలాచలం(ఎచ్చెర్ల), జేబీఎన్పీ నుంచి బి.కొర్లయ్య(ఎచ్చెర్ల), నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కె.కామేశ్వరి(నరసన్నపేట) నామపత్రాలను ఆయా రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
మంత్రి అప్పలరాజుపై మూడు కేసులు
పలాసలో రిటర్నింగ్ అధికారి భరత్నాయక్కు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న మంత్రి అప్పలరాజు
కలెక్టరేట్(శ్రీకాకుళం), పలాస, న్యూస్టుడే: వైకాపా పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయా పత్రాలను ఆర్డీవో, రిటర్నింగ్ అధికారి భరత్నాయక్కు సోమవారం అందజేశారు. మరోసెట్ నామినేషన్ను ఆయన భార్య శ్రీదేవి దాఖలు చేశారు. నామపత్రాల్లో భాగంగా మంత్రి సమర్పించిన అఫిడవిట్లో తనపై మూడు కేసులు (ఒకటి రైల్వే పోలీసులు నమోదు చేశారు) అపరిష్కృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. అప్పలరాజు దంపతుల పేరిట 70.52 లక్షల చరాస్తులున్నాయి. ఇద్దరి పేరిట 2.59 కోట్ల స్థిరాస్తులు, 398 గ్రాముల బంగారం, రూ.85.18 లక్షల రుణాలున్నాయని అందులో పొందుపరిచారు.
నామినేషన్ ధరావత్తు చిల్లర రూపంలో అందజేత
శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున నాయుడుగారి రాజశేఖర్ సోమవారం నామినేషన్ వేశారు. చెల్లించాల్సిన ధరావత్తు మొత్తం చిల్లర రూపంలో అధికారులకు అందజేశారు. జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులుగా పనిచేస్తున్న ఈయన మహాశివరాత్రికి వచ్చిన సంభావనలను ధరవాత్తు కట్టినట్టు వివరించారు.
న్యూస్టుడే, కలెక్టరేట్ (శ్రీకాకుళం)
రెడ్డి శాంతిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు
పాతపట్నంలో రిటర్నింగ్ అధికారి అప్పారావుకు నామపత్రాలు అందజేస్తున్న రెడ్డి శాంతి
కలెక్టరేట్(శ్రీకాకుళం), పాతపట్నం, న్యూస్టుడే: వైకాపా పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేశారు. అచ్చుతాపురంలోని పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి ర్యాలీగా తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎం.శ్యాంసుందరరావుతో కలిసి రిటర్నింగ్ అధికారి ఎం.అప్పారావుకు పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా సమర్పించిన అఫిడవిట్లో తనపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివిన తనకు రూ.1.70 కోట్ల విలువైన చరాస్తులు, రూ.1.67 కోట్ల స్థిరాస్తులు, 400 గ్రాముల స్టోన్డ్ జ్యూయలరీ, 300 గ్రాముల బంగారం, ఆరు కిలోల వెండి, రూ.47 లక్షల రుణం ఉందని పొందుపరిచారు.
కేసులు లేని కృష్ణదాస్
ధర్మాన కృష్ణదాస్ పేరిట నామపత్రాలు అందజేస్తున్న కోడలు శ్రావణి తదితరులు
నరసన్నపేట, న్యూస్టుడే: వైకాపా నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేయగా.. సోమవారం మరోసెట్ను ఆయన కోడలు శ్రావణి రిటర్నింగ్ అధికారి రామ్మోహనరావుకు అందజేశారు. ఇందులో భాగంగా సమర్పించిన అఫిడవిట్లో తనపై ఎలాంటి కేసులు లేవని కృష్ణదాస్ స్పష్టం చేశారు. బీకాం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కృష్ణదాస్ దంపతుల పేరిట రూ.5.61 కోట్ల విలువైన చరాస్తులున్నాయి. రూ.3.95 కోట్ల స్థిరాస్తులు, 60 తులాల బంగారం, కిలో వెండి, రూ.3.68 కోట్ల రుణం ఉందని అందులో పొందుపరిచారు.
నామినేషన్ వేసిన సభాపతి
ఆమదాలవలసలో రిటర్నింగ్ అధికారి నవీన్కు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు అందజేస్తున్న తమ్మినేని సీతారాం
ఆమదాలవలస గ్రామీణం, న్యూస్టుడే: వైకాపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమవారం తమ్మినేని సీతారాం నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను సంయుక్త కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నవీన్కు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలో మాడిస్తే.. మీ కళ్లు చల్లబడ్డాయా?
[ 03-05-2024]
మాది గార మండలం తూలుగు పంచాయతీ జాఫ్రాబాదు గ్రామం. ఆటోలో 7 కి.మీ. ప్రయాణించి ఎండలో గార మండల కేంద్రానికి వచ్చాం. బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. -
పసుపు దండు ఉత్సాహం
[ 03-05-2024]
పాతపట్నం నియోజకవర్గంలో పసుపుదండు ఉత్సాహం ఉరకలెత్తింది.. ఏ దారి చూసినా పసుపు జెండాలే రెపరెపలాడాయి. -
దేవుడా.. ఇదేం పాలన..?
[ 03-05-2024]
నోరెత్తితే దేవుడి పేరు పలికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనలో ఆ భగవంతుడి ఆలనాపాలన సైతం పట్టించుకోలేదు.. -
మన్యం మౌన రోదన.. వినిపించలేదా జగనన్న..!
[ 03-05-2024]
అత్యవసరమైతే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడి మీద భారం వేయాల్సిందే. ఇదీ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఆయా ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం. -
ఏళ్లుగా అదే పరిస్థితి.. సాగు నీరందని దుస్థితి
[ 03-05-2024]
వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలను కలిపి ఉన్న వంశధార 60 ఆర్ఎల్ కాలువపై పలు చోట్ల సిమెంట్ పనులు పాడై కనీస మరమ్మత్తులకు నోచుకోవడంలేదు. -
కిడ్నీ రోగుల కుటుంబాలకు అండగా నిలవండి
[ 03-05-2024]
ఉద్దానంలో మూత్రపిండాల రోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అండగా నిలవాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు విజ్ఞప్తి చేశారు. -
చంద్రన్నతోనే సంక్షేమం
[ 03-05-2024]
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, వైకాపా పాలనలో విధ్వంసం చోటు చేసుకుందని తెదేపా నాయకులు తెలిపారు. -
ఒక్క రోడ్డయినా వేసినపాపాన పోలేదు
[ 03-05-2024]
ఇచ్ఛాపురం, పలాస పట్టణాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కీలక మార్గాలు ఛిద్రమై, గోతులతో నిండి ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
ఇసుక మూటలే.. కాంక్రీట్ గోడ..!
[ 03-05-2024]
ఎల్ఎన్పేట మండలంలో వంశధార నది వద్ద మెగా రక్షిత మంచినీటి పథకం బావుల నుంచి నీరు సరఫరా చేసే వంతెన శిథిలమైంది.
తాజా వార్తలు (Latest News)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన